Begin typing your search above and press return to search.

బొల్లినేని గాంధీ - సానా స‌తీష్ - చంద్ర‌బాబు లింకేంటి...!

By:  Tupaki Desk   |   4 Aug 2019 9:32 AM GMT
బొల్లినేని గాంధీ - సానా స‌తీష్ - చంద్ర‌బాబు లింకేంటి...!
X
ఏపీలో అధికార వైసిపి - విపక్ష టీడీపీ నేతల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ కొనసాగుతూనే ఉంది. ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వైసీపీ నుంచి టిడిపికి కౌంటర్ ఇస్తోన్న‌ నేతల్లో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. మిగిలిన నేతల‌ సంగతి ఎలా ? ఉన్నా విజయసాయిరెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు టిడిపిని ఏదో విధంగా ఎండగ‌డుతూనే ఉన్నారు. తాజాగా మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టు అయిన సానా సతీష్‌ కు.... అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కున్న బొల్లినేని గాంధీకి మధ్య లింకులు ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ట్వీట్ చేసి విరుచుకుపడ్డారు.

మనీ లాండరింగ్ దళారి సానా సతీష్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈడీలో చంద్రబాబు కోవర్టు బొల్లినేని గాంధీ - స‌తీష్ దుబాయ్‌ లోని ఓ హోట‌ల్లో ర‌హ‌స్యంగా క‌లిశార‌ని విచార‌ణ‌లో తేలింది. ఇందులో బాబు పాత్ర‌పైనా విచార‌ణ జ‌ర‌పాల‌న్న విజ‌య‌సాయి... అలా చేస్తే మ‌రిన్ని లింకులు బ‌య‌ట ప‌డ‌తాయ‌ని కూడా చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మిగిలిన టీడీపీ నేత‌ల‌ను కూడా టార్గెట్‌ గా చేసుకుని ట్వీట్ల‌తో విరుచుకుప‌డ్డారు.

మాజీ జ‌ల‌వ‌న‌రుల శాఖా మంత్రి ఉమాను టార్గెట్‌ గా చేసుకుని పోలవరం కాంట్రాక్టర్లను వైదొలగమంటే ఉమా ? నీకు ఉలుకు ఎందుకు ? ప‌్రాజెక్టు ప‌నుల‌ను బినామీ కాంట్రాక్ట‌ర్ల‌కు ఇచ్చి వేల కోట్లు దండుకున్నారు ? క‌దా ? ఇప్పుడు అడ్డంగా దొరికేశాక ఇది నీకు పులివెందుల పంచాయితీలా ఉందా ? అని విమ‌ర్శించారు.

ఇక మాజీ ఆర్థిక శాఖా మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడును టార్గెట్‌ గా చేసుకుని ఎన్టీఆర్‌ పై వెన్నుపోటు కుట్ర‌లో బాబు పార్ట‌న‌ర్‌ గా ఉన్న నువ్వు విలువ‌ల గురించి గుర‌వింద గింజ‌లా మాట్లాడుతున్నావు. చిదంబరాన్ని అర్థరాత్రి కాళ్లు పట్టుకుని జగన్ గారిపైన కేసులు పెట్టించింది నీబాసే కదా? రేపు మీ నాయకుడు - ఆయన కొడుకు ఏ జైల్లో ఉంటారో? ములాఖత్లో కలుద్దురు. సిద్ధంగా ఉండండ‌ని పంచ్ వేశారు.

ఇక ప‌దే ప‌దే త‌న‌ను కెలుకుతోన్న టీడీపీ యువనేత లోకేశ్‌ ను కూడా విజ‌య‌సాయి వ‌ద‌ల్లేదు. అన్న క్యాంటిన్లు మూసేస్తే గ‌గ్గోలు పెడుతున్నారు క‌దా ? అవి ఏమైనా మీ హెరిటేజ్ సొమ్ముతా న‌డిపారా లోకేశ్ బాబు ? ఇప్పుడు వాటిని మ‌సేశార‌ని టీఎంసీల కొద్ది కన్నీరు కారుస్తున్నావు అని సెటైర్ వేశారు. మీ పాల‌న‌లో ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల సంక్షేమానికి కాకుండా దోచుకునేందుకు వాడుకున్నారు. క్యాంటిన్ నిధుల‌ను కూడా పసుపు - కుంకుమ ప్ర‌లోభాల‌కు మ‌ళ్లించ‌లేదా ? అని విమ‌ర్శించారు.