Begin typing your search above and press return to search.

పాకిస్థాన్‌ కు 50 సాయుధ డ్రోన్లు..భారత్ పై కుట్రలు పన్నుతున్న శత్రుదేశాలు!

By:  Tupaki Desk   |   26 Dec 2020 8:00 PM IST
పాకిస్థాన్‌ కు 50 సాయుధ డ్రోన్లు..భారత్ పై కుట్రలు పన్నుతున్న శత్రుదేశాలు!
X
పాకిస్థాన్ ‌కు 50 సాయుధ డ్రోన్లను చైనా అమ్మింది. ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న 50 వింగ్ లూంగ్ 2 డ్రోన్లను ఈ నెలలో పాక్‌ కు సరఫరా చేయాలని నిర్ణయించినట్లు చైనా మీడియా తెలిపింది. ఇక భారత సైన్యానికి కాళ రాత్రేనని, పర్వతాల్లో మోహరించిన ఆ దేశ మిలిటరీకి ఈ అత్యాధునిక ఆయుధాలను ఎదుర్కొనే సామర్థ్యం లేదని తెలిపింది. చైనా, టర్కీకి చెందిన ఇలాంటి డ్రోన్లు లిబియా - సిరియా - అజర్‌ బైజాన్ ఘర్షణల్లో సాంప్రదాయ సాయుధ సంపత్తి గలిగిన శత్రువుల రక్షణ వ్యవస్థలను చిత్తు చేశాయని వివరించింది.

భారతీయ భూ నిర్మాణాలు - భారత సాయుధ బలగాలు పెద్ద సంఖ్యలో సాయుధ డ్రోన్‌ ల దాడిని అణచివేయలేవని పేర్కొంది. అటువంటి 50 వింగ్ లూంగ్ II సాయుధ డ్రోన్లను పాకిస్తాన్ కు విక్రయిస్తుంది చైనా . అయితే, భారత సైనిక అధికారులు సాయుధ డ్రోన్లు అనియంత్రిత వాయు ప్రదేశాలలో లేదా వాయు ఆధిపత్యం ఉన్న చోట ఉత్తమంగా పనిచేస్తాయని అభిప్రాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌ లో నియంత్రణ రేఖ అయినా, లడఖ్‌ లోని వాస్తవ నియంత్రణ రేఖ అయినా, గగనతలం రాడార్ల ద్వారా చాలా నిశితంగా పరిశీలించబడుతుంది . అదేవిధంగా సాయుధ బలగాలు నిత్యం పహారా కాస్తున్నాయని, సాయుధ డ్రోన్లు గీతలు దాటితే కాల్చివేయబడతాయి అని భారత వైమానిక దళం మాజీ చీఫ్ అన్నారు. చైనా చెబుతున్నట్టు అది అంత ఈజీ కాదని చెప్తుంది.

మరోవైపు చైనా బెదిరింపులను భారత్‌ తిప్పికొట్టింది. వింగ్‌ లూంగ్‌ 2 డ్రోన్ల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేసింది. ఒక ప్రాంతం గగనతలంపై మరొకరికి పట్టు ఉన్నప్పుడే డ్రోన్ల ద్వారా దాడి సాధ్యమని పేర్కొంది. ఆఫ్ఘన్‌ గగనతలంపై పట్టు ఉన్న అమెరికా ఉగ్రవాదులపై దాడులు చేస్తున్నవైనాన్ని ఉదాహరించింది. సరిహద్దులోని చైనా లేదా పాకిస్థాన్‌ కు ఇది సాధ్యం కాదని భారత్‌ స్పష్టం చేసింది. పాకిస్థాన్‌ వైపు నియంత్రణ రేఖ లేదా చైనా సరిహద్దులోని లఢక్‌ వాస్తవాధీన రేఖపై భారత రాడార్లు, యుద్ధ విమానాల నిఘా ఎల్లప్పుడు ఉంటుందని భారత్‌ తెలిపింది. ఆయా రేఖలను దాడిన డ్రోన్లను ఆ వ్యవస్థలు వెంటనే పసిగట్టి కూల్చివేస్తాయని భారత వాయుసేన మాజీ చీఫ్‌ వెల్లడించారు. అయితే చైనా నుంచి పాకిస్థాన్‌ ఆయుధ డ్రోన్లను సమకూర్చుకున్న నేపథ్యంలో భారత్‌ కూడా సాయుధ డ్రోన్లను, డ్రోన్ల వ్యతిరేక వ్యవస్థలను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.