Begin typing your search above and press return to search.
మావోల మాటల్లో నిజం లేదన్న మంత్రిగారబ్బాయ్
By: Tupaki Desk | 27 Jun 2017 12:55 PM ISTఏపీ మంత్రిగారి పుత్రరత్నంపై మావోయిస్టులు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అక్రమ మైనింగ్ తో చెలరేగిపోతున్నాడంటూ మావోయిస్ట్ పార్టీ తూర్పు డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో ఏపీ రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడిపై ఆరోపణలు రావటం తెలిసిందే. మావోల మాటలకు మంత్రిగారబ్బాయ్ రియాక్ట్ అయ్యారు.
తన మీద మావోలు చేస్తున్న ఆరోపణలు నిజం కాదని వెల్లడించాడు అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్. ఈ మేరకు తాజాగా మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న తనపై మావోయిస్టులు ఈ విధంగా ప్రకటన విడుదల చేయటం బాధ కలిగించినట్లుగా పేర్కొన్నారు.
ఏపీ రాష్ట్రంలో ఎక్కడా మైనింగ్ వ్యాపారాలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. విశాఖ జిల్లా జీకే వీధి మండలంలోని సరుగుడు క్వారీ వెలికితీతలో మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడికి పెద్ద ఎత్తున షేర్లు ఉన్నాయని.. దాన్ని అడ్డుకోవాలంటూ మావోల నుంచి హెచ్చరికలు అందాయి. దీనిపై విజయ్ స్పందిస్తూ.. తనకూ అక్రమ మైనింగ్ కు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. మరి.. మంత్రిగారబ్బాయ్ ఖండనలకు మావోల రియాక్షన్ ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
తన మీద మావోలు చేస్తున్న ఆరోపణలు నిజం కాదని వెల్లడించాడు అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్. ఈ మేరకు తాజాగా మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న తనపై మావోయిస్టులు ఈ విధంగా ప్రకటన విడుదల చేయటం బాధ కలిగించినట్లుగా పేర్కొన్నారు.
ఏపీ రాష్ట్రంలో ఎక్కడా మైనింగ్ వ్యాపారాలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. విశాఖ జిల్లా జీకే వీధి మండలంలోని సరుగుడు క్వారీ వెలికితీతలో మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడికి పెద్ద ఎత్తున షేర్లు ఉన్నాయని.. దాన్ని అడ్డుకోవాలంటూ మావోల నుంచి హెచ్చరికలు అందాయి. దీనిపై విజయ్ స్పందిస్తూ.. తనకూ అక్రమ మైనింగ్ కు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. మరి.. మంత్రిగారబ్బాయ్ ఖండనలకు మావోల రియాక్షన్ ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/