Begin typing your search above and press return to search.

శ‌త్రువుకి ఇలాంటి క‌ష్టం వ‌ద్ద‌న్న చిరు

By:  Tupaki Desk   |   10 May 2017 10:08 AM GMT
శ‌త్రువుకి ఇలాంటి క‌ష్టం వ‌ద్ద‌న్న చిరు
X
ఏపీ మంత్రి నారాయ‌ణ కుమారుడు నిషీత్ మ‌ర‌ణంపై ప్ర‌ముఖులు తీవ్రంగా క‌దిలిపోతున్నారు. అమిత‌మైన వేగంతో కారును న‌డిపి.. మెట్రో ఫిల్ల‌ర్‌ను గుద్దేసి.. ఘ‌ట‌నాస్థ‌లంలోనే మ‌ర‌ణించిన నిషీత్ ఉదంతంపై ప్ర‌ముఖ సినీ న‌టుడు.. రాజ్య‌స‌భ స‌భ్యుడు చిరంజీవి తీవ్రంగా స్పందించారు. నిషీత్ మ‌ర‌ణ‌వార్త‌పై ఆయ‌న తీవ్రంగా క‌దిలిపోయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితి శ‌త్రువుకు కూడా రాకూడ‌ద‌న్న ఆయ‌న‌.. నారాయ‌ణ కుటుంబ స‌భ్యుల్ని ప‌రామ‌ర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఎదిగి వ‌చ్చిన కొడుకు మ‌ర‌ణించ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మైన ఘ‌ట‌న‌గా అభివ‌ర్ణించిన ఆయ‌న‌.. కొడుకు పోయిన బాధ నుంచి నారాయ‌ణ కుటుంబం త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు.

రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన మంత్రి నారాయ‌ణ కుమారుడు నిషిత్ ఉదంతంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. అపోలో ఆసుప‌త్రికి వెళ్లిన ఆయ‌న‌.. నారాయ‌ణ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. తీవ్ర ఆవేద‌న‌లో ఉన్న వారిని ఓదార్చి.. ధైర్యం చెప్పారు. నారాయ‌ణ కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేసిన ప‌వ‌న్‌.. ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌న్న విష‌యాన్ని పోలీసుల‌ను అడిగి తెలుసుకున్నారు. ప్ర‌మాదాలు చోటు చేసుకోకుండా ఉండేలా యువ‌త జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.