Begin typing your search above and press return to search.

పార్టీ ఊపు + సెంటిమెంటు = మునుగోడు విజ‌యం: కాంగ్రెస్ ఈ క్వేష‌న్ ఇదే

By:  Tupaki Desk   |   20 Sep 2022 2:30 AM GMT
పార్టీ ఊపు + సెంటిమెంటు = మునుగోడు విజ‌యం:  కాంగ్రెస్ ఈ క్వేష‌న్ ఇదే
X
మునుగోడు ఉపఎన్నిక ప్రచార బరిలో కాంగ్రెస్‌ జోరు పెంచింది. 'మీ ఇంటిబిడ్డను ఆశీర్వదించండి' అంటూ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటికి వెళ్తూ ఓటర్లను కలుస్తున్నారు. నేతలు, కార్యకర్తలతో భట్టి విక్రమార్క భేటీ అవుతున్నారు. ఇతర కాంగ్రెస్ నాయకులు మునుగోడులో కాంగ్రెస్‌తో గెలుపుతో... టీఆర్ ఎస్‌, బీజేపీ ప్రజావ్యతిరేక పాలనకు నాంది పడుతుందని పిలుపునిస్తున్నారు. అంతేకాదు.. పార్టీలో సీనియ‌ర్ల‌ను క‌లుపుకొని పోవ‌డం+ త‌న కుటుంబానికి ఉన్న సెంటిమెంటును క‌లిపి.. మునుగోడులో విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు స్ర‌వంతి తెలిపారు.

ప్రధాన పార్టీల దూకుడుతో మునుగోడులో నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ ప్రచారంలో వేగం పెంచింది. ఇతర ప్రధాన పార్టీల కంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించిన ఆ పార్టీ.. నియోజకవర్గాన్ని చుట్టేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. `మీ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించండి` అంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ, ఆడపడుచులకు బొట్టుపెట్టి గాజులు, కుంకుమ ఇచ్చి కాంగ్రెస్‌కు ఓటువేయాలని కోరుతున్నారు.

మునుగోడులో కార్యకర్తల సమన్వయ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ధరల పెంపుతో పేదలపై పెనుభారం మోపిన బీజేపీ మునుగోడులో గెలిచి.. తమ పార్టీకి ఎంతోబలం ఉందని భ్రమలు కల్పించే పనిలో ఉందని సీతక్క ఆరోపించారు. మరోసారి టీఆర్ ఎస్, బీజేపీలు గెలిస్తే పేదల భూములు లాక్కొని కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తారని విమర్శించారు.

బీజేపీ, టీఆర్ ఎస్ ప్రజావ్యతిరేక పాలనకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మునుగోడు ఉపఎన్నిక‌ల్లో యూత్ జోడో -బూత్ జోడో కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర యువ‌జ‌న కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు గాంధీభ‌వ‌న్‌లో జరిగిన యువ‌జ‌న కాంగ్రెస్ కార్యవ‌ర్గ స‌మావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భార‌త్ జోడో పాద‌యాత్ర, యూత్ జోడో... బూత్ జోడో, మునుగోడు ఉపఎన్నిక‌లపై చర్చించారు.

ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ చేసిందేమి లేదని స్ర‌వంతి అన్నారు. ఏ ఊరికి వెళ్లినా కానీ గోవర్ధన్రెడ్డి ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తర్వాత ఏ ఊరిలో కూడా అభివృద్ధి కాలేదన్నారు. ప్రతి గ్రామంలో మహిళల, సోదరుల దగ్గరకి వెళ్లి ఓటు వేయమని వారిని అడుగుతున్నానన్నారు. వారి నుంచి అన్యూహమైన స్పందన వస్తోందని స్ర‌వంతి ఆశాభావం వ్య‌క్తం చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.