Begin typing your search above and press return to search.

క్రికెటర్లు VS తస్లీమా!

By:  Tupaki Desk   |   7 April 2021 10:33 AM GMT
క్రికెటర్లు VS తస్లీమా!
X
వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్​ ఇటీవల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపాయి. ఇంగ్లాండ్ క్రికెటర్​ మొయిన్​ అలీపై ఆమె సంచలన కామెంట్లు చేశారు. మెయిన్​ ఒకవేళ క్రికెటర్​ కాకపోయి ఉంటే టెర్రరిస్ట్​ అయ్యి ఉండేవాడని.. ఏదో ఓ ఉగ్రవాద సంస్థలో చేరిపోయేవాడని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తస్లీమాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మరోవైపు ఈ అంశం సోషల్​ మీడియాలోనూ చర్చనీయాంశం అయ్యింది.

కొందరు క్రికెటర్ల తస్లీమా అలా అనడం సరికాదని.. ఆమె వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కామెంట్లు చేశారు. మరోవైపు మొయిన్​ అలీకి కూడా నెటిజన్ల మద్దతు దక్కింది. తస్లీమా వ్యాఖ్యలపై మెయిన్​ అలీ తీవ్రంగా నొచ్చుకున్నారట. ఆమెపై అతడు కోర్టులో పరువు నష్టం దావా వేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్ క్రికెటర్లు జోప్రా ఆర్చర్, శామ్ బిల్లింగ్స్‌తో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా మొయిన్ అలీకి మద్దతుగా నలిచారు.

తస్లీమా నస్రీన్​ వ్యాఖ్యలు .. మొయిన్​ అలీ సీరియస్​ గా తీసుకున్నట్టు సమాచారం. అమెపై న్యాయపరమైన చర్యలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్టు టాక్​. ఈ మేరకు అలీ మేనేజ్​మెంట్​ కంపెనీ ఎసెస్​ మిడిల్​ ఈస్ట్​ ఓ ట్వీట్​ చేసింది.‘తస్లీమా వ్యాఖ్యలు చాలా అభ్యంతరకంగా ఉన్నాయి. ఓ వ్యక్తిని టార్గెట్​ చేసి.. నిరాధారంగా మాట్లాడటం చట్ట విరుద్ధం. ఈ విషయంపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని ఓ ట్వీట్​ లో పేర్కొన్నారు.

ఐపీఎల్‌ 14వ సీజన్‌ లో మెయిన్‌ అలీ సీఎస్‌కేకు తరఫున ఆడబోతున్నాడు. సీఎస్‌కే అలీని రూ.7 కోట్లకు దక్కించుకున్నది.