Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్తగా కేసులు తగ్గుముఖం

By:  Tupaki Desk   |   7 April 2020 4:40 PM IST
ఏపీలో కొత్తగా కేసులు తగ్గుముఖం
X
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త కేసులు తగ్గిపోతున్నాయి. ఇన్నాళ్లు కేసుల నమోదు భారీగా ఉండగా తాజాగా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 15గంటల్లో ఒకే ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదవడం విశేషం. నిన్నటి వరకు ఆంధ్రప్రదేనశ్‌లో పదుల సంఖ్యలో నమోదవుతున్న కేసుల్లో తాజాగా విడుదల చేసిన వివరాల్లో కేసులు తగ్గాయి. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.

ఈ సందర్భంగా రాష్ట్రంలో సోమవారం సాయంత్రం 6 నుంచి మంగళవారం ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్ పరీక్షల్లో కొత్తగా గుంటూరు జిల్లాలో ఒకే ఒక కేసు నమోదైందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరాయని వెల్లడించింది. కర్నూలు జిల్లాలో కొవిడ్-19 కారణంగా ఒకరు మృతిచెందారు. ఈ వివరాలు పరిశీలిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రజల తో పాటు అధికార యంత్రాంగం భావిస్తోంది. మర్కజ్ కాంటాక్ట్ కేసులు తగ్గడంతో త్వరలోనే కేసులు అదుపులోకి వస్తాయని పరిణామాలను చూస్తే తెలుస్తోంది.