Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎఫెక్ట్ ....షేక్ అవుతున్న వాట్సాప్ !

By:  Tupaki Desk   |   28 March 2020 3:30 AM GMT
లాక్ డౌన్ ఎఫెక్ట్ ....షేక్ అవుతున్న వాట్సాప్ !
X
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ ఇళ్ల నుండి బయటకి రావడంలేదు. గడప దాటి కాళ్లు బయటపెట్టలేని పరిస్థితి కారణంగా ప్రజలంతా సోషల్ మీడియా వాడకం ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. వాట్సప్‌, ఫేస్‌ బుక్‌ ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో సోషల్‌ మీడియా దిగ్గజం వాట్సప్‌ లో నెటిజన్లు గడిపే కాలం అమాంతం ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది.

వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మొదట్లో 27 శాతం పెరిగిన యూజర్ల సంఖ్య.. కరోనా మొదట దశ ని దాటే సమయానికి ఆ సంఖ్య 41 శాతానికి పెరిగింది. ఇక వైరస్‌ రెండోదశకు చేరుకుని తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ.. ఏకంగా 51శాతానికి పెరిగిందని ఓ సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది. వీరిలో 40శాతానికిపైగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల వారేకావడం గమనార్హం. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌ వాడకం 50శాతం పెరిగిందని ఆ సంస్థ తన సర్వేలో తెలిపింది.

వాట్సప్‌ తో పాటు మెస్సెంజర్‌ వాడకంలో 70శాతం ఇటలీ తొలిస్థానంలో నిలవగా.. వీడియో కాల్స్‌ మాట్లడం ఒక్కసారిగా 1000శాతం పెరిగింది. భారత్‌ తో పాటు ప్రపంప వ్యాప్తంగా పలు దేశాల్లో లాక్‌ డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. వీరంత సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేస్తూ గడుపుతున్నారు. ఇక సెలబ్రెటీలు సైతం సోషల్‌ మీడియా ద్వారా కరోనాపై ప్రజలకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. దీంతో వారిని అనుసరించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మరోవైపు పలు సాఫ్ట్‌ వేర్‌ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇవ్వడం తో ఉద్యోగులంతా సమాచారం కోసం వాట్సప్‌ గ్రూపులు, వీడియోలు కాల్స్‌ చేయడం ఎక్కువగా జరుగుతోంది. ఇక సాధారణంగా యువత వాట్సాప్ లో చాటిం‍గ్స్‌ కూడా ఎక్కువే చేస్తుంటుంది.