Begin typing your search above and press return to search.

ఏపీలో మరో ఇద్దరికీ.. 5కు చేరిన కరోనా కేసులు

By:  Tupaki Desk   |   22 March 2020 9:55 AM IST
ఏపీలో మరో ఇద్దరికీ.. 5కు చేరిన కరోనా కేసులు
X
కరోనా వైరస్ తెలంగాణతోపాటు ఏపీలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఏపీలో మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఏపీలో మొత్తం ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.

తాజాగా నమోదైన రెండు కేసులు విజయవాడకు చెందిన వ్యక్తి ఒకరు, రాజమండ్రికి చెందిన వ్యక్తికి మరొకటి నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ కేసులు విదేశాల నుంచి వచ్చి యువకులే కావడం గమనార్హం.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు లండన్ నుంచి హైదరాబాద్ కు.. అక్కడి నుంచి రాజమండ్రికి వచ్చాడు.

విజయవాడ కు చెందిన 24 ఏళ్ల యువకుడు పారిస్ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి విజయవాడ కు వచ్చాడు. వీళ్లిద్దరికీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు అధికారులు ప్రకటించారు.

వీరిద్దరినీ బోధనాస్పత్రుల్లో ఉంచి ప్రత్యేకంగా వైద్యం చేస్తున్నారు. ఇక వీరు హైదరాబాద్ టు ఏపీకి వచ్చేముందు ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరితో కలిశారు..? వారి బంధువులను సైతం వైద్యపరీక్షలు నిమిత్తం తీసుకు వచ్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.