Begin typing your search above and press return to search.

ఆత్మాహుతి దాడి: క్రికెట్ అంపైర్ మృతి

By:  Tupaki Desk   |   4 Oct 2020 11:02 PM IST
ఆత్మాహుతి దాడి: క్రికెట్ అంపైర్ మృతి
X
ఆఫ్గనిస్తాన్ దేశంలో జరిగిన ఉగ్రవాదుల ఆత్మహుతి దాడిలో అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ భీష్మిల్ల జాన్ షిన్వారి మృతి చెందాడు. స్థానిక మీడియా ప్రసార, చేసిన సమాచారం ప్రకారం..

అప్ఘనిస్తాన్ లోని నంగర్హర్ ప్రావిన్స్ లోని ఘానికిల్ జిల్లా గవర్నర్ ఇంటి వద్ద శనివారం మధ్యాహం ఉగ్రవాదులు కారు బాంబు పేల్చారు. ఈ ఆత్మహుతి దాడిలో ఆయన అసువులు బాసారు.

ఈ దాడిలో 15మంది మృతి చెందగా మరో 30మంది గాయాలపాలయ్యారు. షిన్వారి పలు అంతర్జాతీయ దేశీయ మ్యాచ్ లకు అంపైర్ గా వ్యవహరించారు.

ఈ ఘటనలో షిన్వారితో కలిపి 15మంది మరణించగా.. 30మంది వరకు గాయపడినట్టు సమాచారం. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.