Begin typing your search above and press return to search.

అహోబిలం ఆలయ పూజారికి కరోనా.. దర్శనాలకు బ్రేక్

By:  Tupaki Desk   |   22 Jun 2020 11:45 AM IST
అహోబిలం ఆలయ పూజారికి కరోనా.. దర్శనాలకు బ్రేక్
X
ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వైరస్ కారణంగా విధించిన లాక్ ‌డౌన్ నుండి సడలింపులు ఇచ్చిన తరువాత రోజురోజుకు వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలోని ప్రముఖ అహోబిలం ఆలయంలోని పూజారికి వైరస్ పాజిటివ్ అని తేలింది అని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. ఇటీవల జరిపిన పరీక్షల్లో పూజారికి వైరస్ పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది అని , దీంతో అహోబిలం పీఠాధిపతి ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ మేనేజర్ వైకుంఠం వెల్లడించారని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.

మళ్లీ తిరిగి దర్శనానికి ఎప్పుడు అనుమతిని ఇస్తామన్నది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో ఇదివరకే దాదాపు రెండు నెలల పాటు దర్శనాలకు అనుమతి ఇవ్వకపోగా.. తాజాగా మరోసారి దర్శనాలకు బ్రేక్ పడింది. కాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,929కి చేరింది. వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 106 మంది మరణించగా, 4,307 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,516 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో వైరస్‌ విస్తరిస్తుండటంతో ప్రకాశం జిల్లా ఒంగోలు, అనంతపురం జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌ డౌన్‌ కొనసాగుతోంది.