Begin typing your search above and press return to search.

భారత్ లో కరోనా విజృంభణ .. కొత్తగా మరో 92,071 పాజిటివ్ కేసులు

By:  Tupaki Desk   |   14 Sept 2020 12:45 PM IST
భారత్ లో కరోనా విజృంభణ .. కొత్తగా  మరో 92,071 పాజిటివ్ కేసులు
X
భారత్ ‌లో‌ కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకి పెరుగుతూనే ఉంది. భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ , దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 48 లక్షల 46 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌ లో మరోసారి రికార్డ్ స్థాయిలో 92,071 కేసులు నమోదు కాగా, 1136 మంది ప్రాణాలు విడిచారు. తాజాగా గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 77,512 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

ఇక , వీటితో కలిపి దేశంలో మొత్తం 48,46,428 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,86,595 ఉండగా, 37,80,107 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అలాగే , 79,722 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78.00 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.64 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 20.36 శాతంగా ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 9,78,500 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 5,72,39,4285 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.