Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ 30 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం !

By:  Tupaki Desk   |   31 Aug 2020 1:30 PM GMT
సెప్టెంబర్ 30 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం !
X
కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌ డౌన్ కారణంగా మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. తాజాగా, మరో నెల రోజుల పాటు సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే సంబంధిత అధికార యంత్రాంగం ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ విమానాలను అనుమతిస్తామని డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశీయ విమాన ప్రయాణాలను మే 25 నుంచి పునరుద్దరించినా, అంతర్జాతీయ సర్వీసులను మాత్రం ప్రారంభించలేదు. గతంలో విధించిన ఈ నిషేధం ఆగస్ట్ తో ముగిసింది.

కాగా , కొన్ని దేశాల పరస్పర ఒప్పందాలతో పాటు వందే భారత్‌ మిషన్‌ కింద కొద్ది నెలలుగా ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను ప్రభుత్వం తిప్పుతుంది. ఇక కార్గో కార్యకలాపాలకు, డీజీసీఏ నిర్ధిష్టంగా అనుమతించిన విమానాలకు ఈ ఉత్తర్వులు వర్తించవని ప్రకటన పేర్కొంది.అన్‌లాక్‌ 4.0లో భాగంగా దేశవ్యాప్తంగా మెట్రో రైళ్ల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. స్కూళ్లు, విద్యాసంస్ధల మూసివేతను సెప్టెంబర్‌ 30 వరకూ పొడిగించింది. మరోవైపు సినిమా థియేటర్లు, బార్లు తెరవడానికి మరికొంత సమయం పట్టనుండగా, కంటైన్‌మెంట్‌ జోన్లలలో ఆంక్షలు యధావిధిగా కొనసాగనున్నాయి.

అన్‌లాక్‌ 4.0 గైడ్ ‌లైన్స్‌ :

సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రోరైళ్లకు అనుమతి

సెప్టెంబర్‌ 30 వరకు స్కూళ్లు, మాల్స్‌ బంద్‌

సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ బంద్‌

100 మందికి మించకుండా స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజకీయ సమావేశాలకు అనుమతి

సభలు నిర్వహించే సమయంలో భౌతికదూరం, మాస్క్‌, శానిటైజర్‌ తప్పనిసరి

సెప్టెంబర్‌ 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి

అంతరాష్ట్ర ప్రయాణాలకు నిబంధనలను తొలగింపు

అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు

చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలన్న కేంద్రం

అత్యవసరమైతేనే బయటకు రావాలి

సెప్టెంబర్‌ 30 వరకు కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షలు కొనసాగింపు.