Begin typing your search above and press return to search.

దృశ్యం రిపీట్.. కసాయి కూతురు క్రైం కథ..

By:  Tupaki Desk   |   1 Nov 2019 5:31 AM GMT
దృశ్యం రిపీట్.. కసాయి కూతురు క్రైం కథ..
X
నిజమైన క్రైమ్ థ్రిల్లర్ ను తలపించేలా రజిత మర్డర్ మిస్టరీ చోటుచేసుకుంది. దృశ్యం సినిమాను తలదన్నేలా హైదరాబాద్ హయత్ నగర్ లో హత్యకు గురైన ‘రజిత’ ఉదంతం చోటుచేసుకుంది. రీల్ లైఫ్ స్టోరీ రియల్ లైఫ్ లో కూడా అలానే జరగడం గమనార్హం. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చెప్పిన వివరాల ప్రకారం తల్లిని చంపిన కూతురు కర్కషత్వం మానవత్వం మంటగలిసేలా ఉంది.

* కన్నతల్లినే మట్టుబెట్టి..

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన రజిత హత్య కేసులో కూతురు కీర్తి ఘాతుకాలు అన్నీ కావని రాచకొండ సిపీ మహేష్ భగవత్ తెలిపారు. ప్రియుల మోజులో పడి కన్నతల్లిని చంపిన కర్కషురాలు కీర్తి అని సీపీ తెలిపారు. ఒక ప్రియుడితో కడుపు చేయించుకొని మరో ప్రియుడితో కలిసి ఆస్తి కోసం తల్లిని హత్య చేసిందని తెలిపాడు.. ఈ రియల్ క్రైమ్ కథ ఇదీ..

* ఇద్దరితో ఎఫైర్.. ఒకరితో కడుపు..

హైదరాబాద్ లోని హయత్ నగర్ ఠాణా పరిధిలో కీర్తి అనే యువతి తల్లినే దారుణంగా చంపేసింది. కీర్తి ఇంటర్ చదువుతున్న సమయంలోనే తన స్నేహితురాలు అన్నయ్య అయిన బాల్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఎంజాయ్ చేసే వరకు వెళ్లింది. అదే క్రమంలో కీర్తికి ప్రెగేన్సీ అయ్యింది. బాల్ రెడ్డికి ఏమీ తోచకపోవడంతో కంగారుపడిన కీర్తి ఈ విషయాన్ని తన ఇంటిపక్కనే ఉండే స్నేహితుడు శశికుమార్ కు విషయం చెప్పింది. కీర్తిని, బాల్ రెడ్డిని అమన్ గల్ తీసుకెళ్లిన శశికుమార్ అక్కడే అబార్షన్ చేయించాడు. అప్పటికే కీర్తి అంటే ఇష్టంతో ఉన్న శశికుమార్ ఈ అబార్షన్ విషయాన్ని అవకాశంగా మలుచుకున్నాడు. కీర్తిని బెదిరించాడు. మీ తల్లిదండ్రులకు చెప్తానని బెదిరించాడు. కీర్తిని భయపెట్టి ఇతడు కూడా లోబరుచుకున్నాడు. ఇద్దరు న్యూడ్ గా ఉన్నప్పుడు శశి కొన్ని ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. వాటిని అడ్డం పెట్టుకొని కీర్తిని 10 లక్షలు కావాలని బ్లాక్ మెయిల్ చేశాడు.

*కీర్తి కడుపు విషయం తెలిసి...

కీర్తి అబార్షన్, కడుపు విషయం తెలిసి బాల్ రెడ్డితో ప్రేమాయణంపై తల్లిదండ్రులు ప్రశ్నించారు. బాల్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేసేందుకు కీర్తి తల్లిదండ్రులు నిర్ణయించారు. ఇరు కుటుంబాలు పంచాయితీ పెట్టుకొని వీరిద్దరి పెళ్లికి అంగీకరించారు.

* తల్లిని కిరాతకంగా చంపేసింది..

అయితే పెళ్లికి సిద్ధమైనా కీర్తి మాత్రం మారలేదు. బాల్ రెడ్డితోపాటు శశితోనూ సన్నిహితంగా ఉండడం చూసి కీర్తి తల్లి రజిత మందలించింది. శశికి సైతం కీర్తిని వదిలేయాలని హెచ్చరించింది. దీంతో రజితపై కసి పెంచుకున్న శశి.. తన ప్రియురాలు కీర్తిని హెచ్చరించాడు. మద్యం తాగించి తల్లిని చంపాలని పురిగొల్పాడు. మద్యం మత్తులో మొదట తల్లి రజితకు నిద్రమాత్రలు వేసిన కీర్తి అయినా తల్లి చనిపోకపోవడంతో ఆమె కళ్లలో కారం కొట్టి తల్లి గుండెలపై కూర్చుంది. ప్రియుడు శశి రజిత మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. మూడు రోజుల పాటు తల్లి శవం పక్కనే వీరు ఎంజాయ్ చేశారు. దుర్వాసన రావడంతో భరించలేక రైలు పట్టాలపై పడేశారు. నాన్న చంపేశాడని కీర్తి నాటకాలాడింది. చివరకు పోలీసుల విచారణలో ఈ దారుణం చెప్పుకొచ్చింది.

*ఇలాంటి కూతురు ఉంటే ఎంత పోతే ఎంత?

ఇలా చెడు వ్యసనాలకు అలవాటు పడిన కీర్తి ఏకంగా కన్నతల్లినే కసాయిగా మారి హత్య చేసింది. ఇలాంటి కూతురు ఉంటే ఏంటి పోతే ఏంటి ఆ తండ్రి పడ్డ ఆవేదన అందరినీ కంటతడి పెట్టించింది.