Begin typing your search above and press return to search.

ఏపీకి వెళ్లాలంటే ఈ పాస్ కావాల్సిందే ...ప్రభుత్వం కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   1 Jun 2020 10:15 AM IST
ఏపీకి వెళ్లాలంటే ఈ పాస్ కావాల్సిందే ...ప్రభుత్వం కీలక నిర్ణయం !
X
లాక్ ‌డౌన్ 5.0లో అంతర్ రాష్ట్ర రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఎలాంటి అనుమతి లేకుండానే వేరే రాష్ట్రాలకి వెళ్లొచ్చని స్పష్టంచేసింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌ మాత్రం రాకపోకలపై షరతులు కొనసాగుతాయని తెలిపింది. ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే వరకు అంతర్ రాష్ట్ర రాకపోకలపై ఇప్పటికే కొనసాగుతున్న షరతులు కొనసాగుతాయి అని ఏపీ డీజీపీ సవాంగ్ తెలిపారు.

వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం కరోనా వైరస్ ప్రభావం తక్కువ ఉన్న రాష్ట్రాలు, ఎక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి వస్తోన్న ప్రయాణికులను విభజించి క్వారంటైన్ ‌కు తరలిస్తామని ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా రాష్ట్రంలోకి రావాలంటే స్పందన పోర్టల్ ద్వారా ఆప్లై చేసి.. ఈ పాస్ తీసుకోవాలని సూచించారు. లాక్ డౌన్ 5.0 నిబంధనల్లో ఈ పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

ఇక ఇతర రాష్ట్రాల నుంచి వస్తోన్న వారు తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైరస్ ప్రభావం తక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి వస్తోన్న ప్రయాణికులు విధిగా హోం క్వారంటైన్ ‌లో ఉండాలని తెలిపారు. వైరస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వస్తోన్న వారు ఏడురోజులు ఇన్‌ స్టిట్యూషనరల్ క్వారంటైన్‌ లో ఉండాలని పేర్కొన్నారు. పరీక్షలు చేసే సమయంలో నెగిటివ్ వస్తే ఏడు రోజులు హోం క్వారంటైన్ తప్పనిసరి అని , పాజిటివ్ వస్తే కోవిడ్ ఆస్పత్రికి తరలిస్తామని తెలిపారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం మాత్రం అంతరాష్ట్ర వాహనాలకు అనుమతిస్తున్నట్టు ప్రకటించింది.