Begin typing your search above and press return to search.
చచ్చాక 50 లక్షలిస్తారా? నన్ను బతికించండి చాలు!
By: Tupaki Desk | 4 Jun 2021 2:53 PM GMT''నేను చనిపోయిన తర్వాత రూ.50 లక్షలు ఇస్తారా? నన్ను బతికించండి చాలు.. మీరు ఇచ్చే డబ్బులు పైసా వద్దు. నా కుటుంబాన్ని నేనే పోషించుకుంటా. దయచేసి బతికేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి’’ అంటూ.. డీఎస్పీ స్థాయి అధికారి ప్రభుత్వాన్ని వేడుకున్న వీడియో సంచలనం రేకెత్తించింది. పంజాబ్ లో రాజకీయ అలజడిని కూడా సృష్టించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
హర్జిందర్ సింగ్ అనే పోలీసు అధికారి డిప్యూటీ జైలు సూపరింటెండ్ గా పనిచేస్తున్నారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. ఈ మధ్యనే కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నారు. కానీ.. ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. లూథియానాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన లంగ్స్ పూర్తిగా పాడైనట్టు చెప్పిన వైద్యులు.. ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తే బతుకుతారని చెప్పారు.
కానీ.. ఆ చికిత్సకు 80 లక్షలకు పైగా ఖర్చవుతోంది. అంత డబ్బు వెచ్చించే శక్తి హర్జిందర్ సింగ్ కుటుంబానికి లేదు. దీంతో.. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు హర్జిందర్ సింగ్ సోదరుడు అధికారుల చుట్టూ తిరిగారు. మూడువారాలు తిరిగినప్పటికీ.. పని మాత్రం కాలేదు. కారణం.. పంజాబ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంత మొత్తం ఇచ్చే అవకాశం లేదు. చనిపోయిన తర్వాత మాత్రం రూ.50 లక్షలు కుటుంబానికి ఇస్తారు.
దీంతో.. హర్జిందర్ సింగ్ ఆసుపత్రి బెడ్ పై నుంచే దీనంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చనిపోయిన తర్వాత వచ్చే డబ్బుతో ఏం చేసుకోవాలన్న ఆయన.. తనకు బతికేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. తన కుటుంబాన్ని తానే పోషించుకుంటానని చెప్పారు. ఈ వీడియో పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ప్రజలతోపాటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. వెంటనే అతన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశాయి.
తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి వచ్చింది. హర్జిందర్ సింగ్ కు అవసరమయ్యే చికిత్స వ్యయాన్ని భరించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని డీజీపీ దిన్కర్ గుప్తా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. హైదరాబాద్ లేదా చెన్నైలో హర్జిందర్ కు చికిత్స అందిస్తామని సిటీ కమిషనర్ రాకేష్ అగర్వాల్ తెలిపారు.
హర్జిందర్ సింగ్ అనే పోలీసు అధికారి డిప్యూటీ జైలు సూపరింటెండ్ గా పనిచేస్తున్నారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. ఈ మధ్యనే కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నారు. కానీ.. ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. లూథియానాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన లంగ్స్ పూర్తిగా పాడైనట్టు చెప్పిన వైద్యులు.. ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తే బతుకుతారని చెప్పారు.
కానీ.. ఆ చికిత్సకు 80 లక్షలకు పైగా ఖర్చవుతోంది. అంత డబ్బు వెచ్చించే శక్తి హర్జిందర్ సింగ్ కుటుంబానికి లేదు. దీంతో.. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు హర్జిందర్ సింగ్ సోదరుడు అధికారుల చుట్టూ తిరిగారు. మూడువారాలు తిరిగినప్పటికీ.. పని మాత్రం కాలేదు. కారణం.. పంజాబ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంత మొత్తం ఇచ్చే అవకాశం లేదు. చనిపోయిన తర్వాత మాత్రం రూ.50 లక్షలు కుటుంబానికి ఇస్తారు.
దీంతో.. హర్జిందర్ సింగ్ ఆసుపత్రి బెడ్ పై నుంచే దీనంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చనిపోయిన తర్వాత వచ్చే డబ్బుతో ఏం చేసుకోవాలన్న ఆయన.. తనకు బతికేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. తన కుటుంబాన్ని తానే పోషించుకుంటానని చెప్పారు. ఈ వీడియో పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ప్రజలతోపాటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. వెంటనే అతన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశాయి.
తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి వచ్చింది. హర్జిందర్ సింగ్ కు అవసరమయ్యే చికిత్స వ్యయాన్ని భరించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని డీజీపీ దిన్కర్ గుప్తా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. హైదరాబాద్ లేదా చెన్నైలో హర్జిందర్ కు చికిత్స అందిస్తామని సిటీ కమిషనర్ రాకేష్ అగర్వాల్ తెలిపారు.