Begin typing your search above and press return to search.
వివేకా హత్య కేసు చుట్టూ ఏపీ రాజకీయం మొత్తం
By: Tupaki Desk | 17 April 2023 1:17 PM GMTకడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురి అయి నాలుగేళ్ళు పై దాటింది. అప్పట్లో ఇది సంచలనం. మరో నెల రోజులలో ఎన్నికలు ఉంటాయనగా జరిగిన ఈ దారుణ హత్య ఏపీ రాజకీయాలను కుదిపేసింది. నాటి విపక్ష నేత జగన్ ఇది పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం చేయించిన హత్యగా ఆరోపించారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.
ఆ తరువాత ఏపీలో ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం మారింది. జగన్ సీఎం అయ్యారు. కానీ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో అసలైన దోషులు ఎవరో తేలకుండానే కాలం గడచిపోయింది. ఈ మధ్యలో ఎన్నో మలుపులు ట్విస్టులు చోటు చేసుకున్నాయి. మొత్తానికి సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ ఈ కేసులో జోరు పెంచింది. వైఎస్ జగన్ కి సమీప బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్ట్ చేసింది.
ఈ కేసులో మరిన్ని కీలకమైన అరెస్టులు ఉంటాయని కూడా అంతా ఊహిస్తున్న నేపధ్యంలో ఏపీ పాలిటిక్స్ లో వివేకా హత్య కేసు మరో మారు హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ కేసు చుట్టే ఏపీ రాజకీయం మొత్తం తిరుగుతోంది. ఎందుకంటే ఏపీ రాజకీయం దశాబ్దాలుగా రెండు ప్రముఖ కుటుంబాల చుట్టూ తిరుగుతోంది. నారా చంద్రబాబు ఒక వైపు వైఎస్సార్ మరోవైపు మోహరించి రాజకీయంగా ఢీ కొడుతూ వచ్చారు.
వైఎస్సార్ మరణం తరువాత ఆయన కుమారుడు జగన్ వైసీపీని ఏర్పాటు చేసి తెలుగుదేశాన్ని బాబుని సవాల్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రెండు కుటుంబాల రాజకీయం అంటే జనాలలో కూడా ఎంతో ఆసక్తి ఉంటుంది. ఈ కుటుంబాల్లో ఏమి జరిగినా కూడా ప్రజలు లోతుగా చర్చించుకుంటారు. ఆ మాటకు వస్తే వైఎస్సార్ ని ఎన్టీఆర్ ని ఆరాధ్య నేతలుగా జనాలు చూడబట్టే ఆ వారసులకు రాజకీయ అవకాశాలు అందుతున్నాయి.
అలాంటిది వైఎస్సార్ కుటుంబంలో నాలుగేళ్ళ క్రితం జరిగిన ఒక దారుణ హత్య ఘటన అప్పట్లోనే తీవ్రమైన కలవరం సృష్టించింది. అయితే తరువాత కాలంలో కడప జిల్లా సంగతి ఎలా ఉన్నా ఏపీ ప్రజలు మాత్రం ఈ విషయం మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇపుడు సడెన్ గా కీలక నేత అరెస్ట్ తో మరో మారు చర్చకు వస్తోంది ఈ అంశం.
వైఎస్ జగన్ కి బంధువులుగా ఉన్న వారినే సీబీఐ అరెస్ట్ చేయడంతో అసలు ఈ హత్య ఎందుకు జరిగింది, దీని వెనక ఎవరు ఉన్నారు. సీబీఐ అభియోగాలు మోపుతున్న వైఎస్ భాస్కరరెడ్డి ప్రమేయం ఎంతవరకూ ఉంది వంటి కీలకమైన ప్రశ్నలు జనం మెదళ్ళలో వస్తున్నాయి. వైఎస్సార్ ఫ్యామిలీకి ఏపీలో ఎంతో విలువ గౌరవం ఉన్నాయి. అలాంటి కుటుంబలో హత్యలు అరెస్టులు వంటివి చోటు చేసుకోవడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది.
సీబీఐ మరింత లోతులకు వెళ్తే ఇంకెన్ని అరెస్టులు ఉంటాయో అన్నది కూడా జనాల్లో ఉన్న సందేహంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా వైఎస్ వివేకా మీద ఏపీ జనంలో మంచి అభ్హిప్రాయం ఉంది. సౌమ్యుడిగా వివాదరహితులుగా కడప బయట జనాలు అంతా చూస్తారు, భావిస్తారు. అలాంటి నేతను హత్య చేయడం అందులో దగ్గర వారిదే జోక్యం ఉందని సీబీఐ అనుమానించడం ఏపీ రాజకీయాలను అతలాకుతలం చేసే పరిణామంగానే చూస్తున్నారు.
ఇక ఏపీలో వైసీపీని ఢీ కొడుతున్న విపక్షాలు అన్నీ ముక్తకంఠంతో ఈ హత్యా రాజకీయాలను ఖండిస్తున్నాయి. ఈ హత్యను కేవలం రాజకీయాల కోసం ఆధిపత్యం కోసం చేయడం అంటే అంతకంటే దారుణం మరోటి లేదని ఇప్పటికే కర్నూల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అఖిలప్రియ పేర్కొన్నారు.
తెలుగుదేశం సీనియర్ నేతలు, మాజీ మంత్రులు అయితే ఇపుడు జగన్ ఏమి సమాధానం చెబుతారు అని ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరావు అయితే జగన్ ఇంతకాలం ముద్దాయిలను కాపాడే ప్రయత్నం చేశారని నిందించారు. మొత్తానికి ఈ హత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్ నే తలపించేలా ఉంది అంటున్నారు
ముందు ముందు ఏమి జరుగుతుంది అన్న ఆసక్తి అయితే ఏపీ ప్రజానీకంలో కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల వేళలో తప్ప జనాలు పెద్దగా ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టరు. ఇపుడు ఏపీ రాజకీయ పరిణామాల మీద అంతా ఆసక్తిని చూపుతున్నారు అంటే వివేకా హత్యానంతరం జరిగిన అతి కీలకమైన అరెస్ట్ కారణం అంటున్నారు.
ఆ తరువాత ఏపీలో ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం మారింది. జగన్ సీఎం అయ్యారు. కానీ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో అసలైన దోషులు ఎవరో తేలకుండానే కాలం గడచిపోయింది. ఈ మధ్యలో ఎన్నో మలుపులు ట్విస్టులు చోటు చేసుకున్నాయి. మొత్తానికి సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ ఈ కేసులో జోరు పెంచింది. వైఎస్ జగన్ కి సమీప బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్ట్ చేసింది.
ఈ కేసులో మరిన్ని కీలకమైన అరెస్టులు ఉంటాయని కూడా అంతా ఊహిస్తున్న నేపధ్యంలో ఏపీ పాలిటిక్స్ లో వివేకా హత్య కేసు మరో మారు హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ కేసు చుట్టే ఏపీ రాజకీయం మొత్తం తిరుగుతోంది. ఎందుకంటే ఏపీ రాజకీయం దశాబ్దాలుగా రెండు ప్రముఖ కుటుంబాల చుట్టూ తిరుగుతోంది. నారా చంద్రబాబు ఒక వైపు వైఎస్సార్ మరోవైపు మోహరించి రాజకీయంగా ఢీ కొడుతూ వచ్చారు.
వైఎస్సార్ మరణం తరువాత ఆయన కుమారుడు జగన్ వైసీపీని ఏర్పాటు చేసి తెలుగుదేశాన్ని బాబుని సవాల్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రెండు కుటుంబాల రాజకీయం అంటే జనాలలో కూడా ఎంతో ఆసక్తి ఉంటుంది. ఈ కుటుంబాల్లో ఏమి జరిగినా కూడా ప్రజలు లోతుగా చర్చించుకుంటారు. ఆ మాటకు వస్తే వైఎస్సార్ ని ఎన్టీఆర్ ని ఆరాధ్య నేతలుగా జనాలు చూడబట్టే ఆ వారసులకు రాజకీయ అవకాశాలు అందుతున్నాయి.
అలాంటిది వైఎస్సార్ కుటుంబంలో నాలుగేళ్ళ క్రితం జరిగిన ఒక దారుణ హత్య ఘటన అప్పట్లోనే తీవ్రమైన కలవరం సృష్టించింది. అయితే తరువాత కాలంలో కడప జిల్లా సంగతి ఎలా ఉన్నా ఏపీ ప్రజలు మాత్రం ఈ విషయం మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇపుడు సడెన్ గా కీలక నేత అరెస్ట్ తో మరో మారు చర్చకు వస్తోంది ఈ అంశం.
వైఎస్ జగన్ కి బంధువులుగా ఉన్న వారినే సీబీఐ అరెస్ట్ చేయడంతో అసలు ఈ హత్య ఎందుకు జరిగింది, దీని వెనక ఎవరు ఉన్నారు. సీబీఐ అభియోగాలు మోపుతున్న వైఎస్ భాస్కరరెడ్డి ప్రమేయం ఎంతవరకూ ఉంది వంటి కీలకమైన ప్రశ్నలు జనం మెదళ్ళలో వస్తున్నాయి. వైఎస్సార్ ఫ్యామిలీకి ఏపీలో ఎంతో విలువ గౌరవం ఉన్నాయి. అలాంటి కుటుంబలో హత్యలు అరెస్టులు వంటివి చోటు చేసుకోవడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది.
సీబీఐ మరింత లోతులకు వెళ్తే ఇంకెన్ని అరెస్టులు ఉంటాయో అన్నది కూడా జనాల్లో ఉన్న సందేహంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా వైఎస్ వివేకా మీద ఏపీ జనంలో మంచి అభ్హిప్రాయం ఉంది. సౌమ్యుడిగా వివాదరహితులుగా కడప బయట జనాలు అంతా చూస్తారు, భావిస్తారు. అలాంటి నేతను హత్య చేయడం అందులో దగ్గర వారిదే జోక్యం ఉందని సీబీఐ అనుమానించడం ఏపీ రాజకీయాలను అతలాకుతలం చేసే పరిణామంగానే చూస్తున్నారు.
ఇక ఏపీలో వైసీపీని ఢీ కొడుతున్న విపక్షాలు అన్నీ ముక్తకంఠంతో ఈ హత్యా రాజకీయాలను ఖండిస్తున్నాయి. ఈ హత్యను కేవలం రాజకీయాల కోసం ఆధిపత్యం కోసం చేయడం అంటే అంతకంటే దారుణం మరోటి లేదని ఇప్పటికే కర్నూల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అఖిలప్రియ పేర్కొన్నారు.
తెలుగుదేశం సీనియర్ నేతలు, మాజీ మంత్రులు అయితే ఇపుడు జగన్ ఏమి సమాధానం చెబుతారు అని ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరావు అయితే జగన్ ఇంతకాలం ముద్దాయిలను కాపాడే ప్రయత్నం చేశారని నిందించారు. మొత్తానికి ఈ హత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్ నే తలపించేలా ఉంది అంటున్నారు
ముందు ముందు ఏమి జరుగుతుంది అన్న ఆసక్తి అయితే ఏపీ ప్రజానీకంలో కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల వేళలో తప్ప జనాలు పెద్దగా ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టరు. ఇపుడు ఏపీ రాజకీయ పరిణామాల మీద అంతా ఆసక్తిని చూపుతున్నారు అంటే వివేకా హత్యానంతరం జరిగిన అతి కీలకమైన అరెస్ట్ కారణం అంటున్నారు.