Begin typing your search above and press return to search.
శబరిమల విమానాశ్రయానికి పర్యావరణశాఖ అనుమతి!
By: Tupaki Desk | 21 Jun 2023 12:00 PM GMTకేరళలోని కొట్టాయం జిల్లాలో శబరిమల గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్యావరణ అనుమతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో... శబరిమల విమానాశ్రయం విషయంలో అయ్యప్ప భక్తులకు ఉన్న ఆ టెన్షన్ కూడా తీరిపోయినట్లయ్యింది. ఫలితంగా... ఇది భక్తులకు పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి!
శబరిమల అయ్యప్ప భక్తులకు కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. శబరిమల సమీపంలోని కొట్టాయం దగ్గర గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ విధానం ప్రకారం.. రెండు దశల ప్రక్రియ ద్వారా అనుమతులు ఇస్తారు. ఇందులో భాగంగా తాజాగా అతిముఖ్యమైన పర్యావరణ అనుమతులు కూడా ఈ విమానాశ్రయానికి తాజాగా లభించాయి.
ఇక, 2263.18 ఎకరాల ప్రభుత్వ భూమి విమానాశ్రయ అభివృద్ధికి గుర్తించారు. ఈ ప్రాంతాన్ని సాధారణంగా చెరువల్లి ఎస్టేట్ గా పిలుస్తారు. దీనికి తోడు మరో మూడువందల ఎకరాల ప్రైవేటు భూమిని కూడా కలపనున్నారు. ఇంకా, ప్రాజెక్ట్ టెక్నో - ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ నివేదిక ప్రకారం.. విమానాశ్రయం పీపీపీ మోడల్ లో రూ.3,411 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్న సంగతి తెలిసిందే.
ప్రతి సంవత్సరం దాదాపు కోటి మంది భక్తులు శబరిమలను సందర్శిస్తారు. వారిలో ఎక్కువ మంది నవంబర్-జనవరి మధ్య జరిగే మండల పూజకు హాజరై స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక ఆ కోటిమందిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 15 లక్షల మంది ఉంటారు.
శబరిమల అయ్యప్ప భక్తులకు కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. శబరిమల సమీపంలోని కొట్టాయం దగ్గర గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ విధానం ప్రకారం.. రెండు దశల ప్రక్రియ ద్వారా అనుమతులు ఇస్తారు. ఇందులో భాగంగా తాజాగా అతిముఖ్యమైన పర్యావరణ అనుమతులు కూడా ఈ విమానాశ్రయానికి తాజాగా లభించాయి.
ఇక, 2263.18 ఎకరాల ప్రభుత్వ భూమి విమానాశ్రయ అభివృద్ధికి గుర్తించారు. ఈ ప్రాంతాన్ని సాధారణంగా చెరువల్లి ఎస్టేట్ గా పిలుస్తారు. దీనికి తోడు మరో మూడువందల ఎకరాల ప్రైవేటు భూమిని కూడా కలపనున్నారు. ఇంకా, ప్రాజెక్ట్ టెక్నో - ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ నివేదిక ప్రకారం.. విమానాశ్రయం పీపీపీ మోడల్ లో రూ.3,411 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్న సంగతి తెలిసిందే.
ప్రతి సంవత్సరం దాదాపు కోటి మంది భక్తులు శబరిమలను సందర్శిస్తారు. వారిలో ఎక్కువ మంది నవంబర్-జనవరి మధ్య జరిగే మండల పూజకు హాజరై స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక ఆ కోటిమందిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 15 లక్షల మంది ఉంటారు.