Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో ఫ్రిజ్జ్ లో బాడీ పార్ట్స్.. ఢిల్లీలో లాగానే మహిళను చంపి ఘాతుకం!
By: Tupaki Desk | 24 May 2023 9:23 PM GMTస్టాక్ మార్కెట్లో పెట్టుబడి కొందరిని నిండా ముంచుతోంది. హత్యకు, ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తుంది. ఇలాంటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ ట్రేడింగ్ కోసం భారీగా అప్పు చేసిన ఓ వ్యక్తి నష్టాల పాలయ్యాడు. లక్షల్లో అప్పుల పాలయ్యాడు. అప్పు చెల్లించాల్సిందిగా నిలదీయడంతో రుణం ఇచ్చిన వారినే దారుణంగా చంపేశాడు. ఆపై ఆమె శరీరాన్ని ముక్కలుగా కోశాడు.
ఎర్రం అనురాధ(55) ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేసేది. ఈమె పని చేసే ఆస్పత్రిలోనే చంద్రమోహన్ తన తండ్రికి ఓ సర్జరీ చేయించాడు. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్లోని చైతన్యపురిలో ఉన్న చంద్రమోహన్ ఇంట్లో అనురాధ అద్దెకు ఉండేది.
ఈ క్రమంలో ఆమె నుంచి నిందితుడు రూ.7 లక్షల దాకా అప్పు తీసుకున్నాడు. ఆన్లైన్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయాడు. అప్పు తీర్చవలసిందిగా అనురాధ నిలదీయడంతో ఆమె హత్యకు పన్నాగం పన్నాడు.
ఈ నెల 12న మధ్యాహ్నం ఆమెతో గొడవ పడి హతమార్చాడు. శరీర భాగాలను కత్తి, టైల్స్ కట్టర్ తో ముక్కలుగా నరికాడు. శరీరం నుండి తల వేరు చేసి ఆటోలో తీసుకొచ్చి మలక్పేట మూసీ పరివాహక ప్రాంతంలో పడేశాడు. మిగిలిన భాగాలను బకెట్లో, కాళ్లను ఫ్రిజ్ దాచిపెట్టాడు. శరీర భాగాలను ఎలా మాయం చేయాలో తెలుసుకునేందుకు సామాజిక మాద్యమాల్లో కొన్ని వీడియోలు చూశాడు. వాసన రాకుండా కొన్ని కెమికల్స్ వాడాడు.
నిందితుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోలీసులు మాత్రం కేసును చేధించారు. మూసీ సమీపంలో మొండెం లేని తల ప్లాస్టిక్ కవర్లో కనిపించడం గుర్తించిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. 8 బృందాలుగా దర్యాప్తు మొదలు పెట్టారు.
ఎట్టకేలకు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చంద్రమోహన్ ఇంట్లో మహిళ చేతులు, కాళ్లు, ఇతర అవయవాలు దొరికినట్లు పోలీసులు తెలిపారు. శారీర భాగాలను సీజ్ చేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సిసి పుటేజీలు ఈ కేసులో కీలక ఆధారాలుగా నిలిచినట్లు తెలుస్తోంది.
ఎర్రం అనురాధ(55) ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేసేది. ఈమె పని చేసే ఆస్పత్రిలోనే చంద్రమోహన్ తన తండ్రికి ఓ సర్జరీ చేయించాడు. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్లోని చైతన్యపురిలో ఉన్న చంద్రమోహన్ ఇంట్లో అనురాధ అద్దెకు ఉండేది.
ఈ క్రమంలో ఆమె నుంచి నిందితుడు రూ.7 లక్షల దాకా అప్పు తీసుకున్నాడు. ఆన్లైన్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయాడు. అప్పు తీర్చవలసిందిగా అనురాధ నిలదీయడంతో ఆమె హత్యకు పన్నాగం పన్నాడు.
ఈ నెల 12న మధ్యాహ్నం ఆమెతో గొడవ పడి హతమార్చాడు. శరీర భాగాలను కత్తి, టైల్స్ కట్టర్ తో ముక్కలుగా నరికాడు. శరీరం నుండి తల వేరు చేసి ఆటోలో తీసుకొచ్చి మలక్పేట మూసీ పరివాహక ప్రాంతంలో పడేశాడు. మిగిలిన భాగాలను బకెట్లో, కాళ్లను ఫ్రిజ్ దాచిపెట్టాడు. శరీర భాగాలను ఎలా మాయం చేయాలో తెలుసుకునేందుకు సామాజిక మాద్యమాల్లో కొన్ని వీడియోలు చూశాడు. వాసన రాకుండా కొన్ని కెమికల్స్ వాడాడు.
నిందితుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోలీసులు మాత్రం కేసును చేధించారు. మూసీ సమీపంలో మొండెం లేని తల ప్లాస్టిక్ కవర్లో కనిపించడం గుర్తించిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. 8 బృందాలుగా దర్యాప్తు మొదలు పెట్టారు.
ఎట్టకేలకు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చంద్రమోహన్ ఇంట్లో మహిళ చేతులు, కాళ్లు, ఇతర అవయవాలు దొరికినట్లు పోలీసులు తెలిపారు. శారీర భాగాలను సీజ్ చేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సిసి పుటేజీలు ఈ కేసులో కీలక ఆధారాలుగా నిలిచినట్లు తెలుస్తోంది.