Begin typing your search above and press return to search.
ట్రిపుల్ వన్ జీవో రద్దుపై గళం విప్పిన ఈటల
By: Tupaki Desk | 25 May 2023 9:59 AM GMTఒకప్పుడు గులాబీ పార్టీలో బిగ్ బాస్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా.. ఆయన నోట తరచూ ప్రస్తావన వచ్చే నేతల్లో ముఖ్యుడు ఈటల రాజేందర్. అలాంటి ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయటం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల సంగతి తెలిసిందే. కేసీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించటమే లక్ష్యమన్నట్లుగా పని చేస్తున్నారు ఈటల. తాజాగా ఆయన ఒక ప్రత్యేక విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేసీఆర్ ఎన్నికల రాజకీయం మొత్తం రియల్ డబ్బుల చుట్టూనే తిరుగుతుందని వ్యాఖ్యానించటం గమనార్హం.
హైదరాబాద్ చుట్టుపక్కలున్న భూములతో డబ్బులు సంపాదించొచ్చని కేసీఆర్ గుర్తించటంతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్న ఈటల.. 'మియాపూర్ భూ కుంభకోణం ఏమైంది? కుకట్ పల్లి ఎల్లమ్మ బండ భూముల కేసులో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది? చట్టాన్ని.. భూముల్ని కాపాడాల్సిన ప్రభుత్వం డబ్బులు ఉన్న వారికి కొమ్ము కాస్తూ కోర్టుల్లో కేసులు ఓడిపోతోంది. భూముల ద్వారా సంపాదించిన డబ్బుల్నే పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు ఖర్చు చేస్తున్నారు. ఇలా సంపాదించిన డబ్బులతోనే నాలాంటోడ్ని ఓడించేందుకు ఖర్చు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్నారు' అంటూ మండిపడ్డారు.
ఇటీవల కేసీఆర్ సర్కారు రద్దు చేసిన ట్రిపుల్ వన్ జీవో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈటల డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసేందుకు.. దేశంలో ఎన్నికల సందర్భంగా డబ్బు పంపిణీ కోసమే జీవో 111 రద్దు చేసి.. అక్రమ సంపాదనకు తెర తీసినట్లుగా ఈటల ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ మహానగర పర్యావరణ వ్యవస్థను దెబ్బ తీసి.. నగరాన్ని కాంక్రీట్ జంగిల్ గా మార్చేసి.. వరదలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.
కేసీఆర్ కు కావాల్సిన వారి అక్రమ సంపాదనకు.. ఆయనకు డబ్బులు ఇచ్చే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేలా తాజా నిర్ణయం ఉందన్నారు. జీవో 111 పరిధిలో 18 వేల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయన్న ఈటల.. దళితులకు ఇస్తామన్న మూడు ఎకరాల హామీని నెరవేర్చలేదు కానీ.. హైదరాబాద్ శివారులో యాభై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 5800ఎకరాల అసైన్డ్ భూముల్ని లాక్కొని 300-400 గజాల ప్లాట్ లు మాత్రం ఇస్తున్నారన్నారు.
హైదరాబాద్ కు వరద ముప్పు పొంచి ఉందని చెప్పిన ఈటల.. అందుకు ట్రిపుల్ వన్ జీవో రద్దు కారణం కానున్నట్లు హెచ్చరిస్తున్నారు. ''కాళేశ్వరంలో నీళ్లు ముందే నింపి పెట్టారు. వర్షాకాలంలో వరదలకు కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి వరకు పోలాలు మునిగిపోయాయి. జీవో 111 రద్దుతో జంట జలాశయాలను నిర్లక్ష్యం చేస్తే.. హైదరాబాద్ కూడా మునిగిపోతుంది'' అని హెచ్చరించారు.
కేసీఆర్ సర్కారు రాజకీయ విజయాలన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయన్న వాదనను బలంగా వినిపించేలా మాట్లాడిన ఈటల మాటలు హాట్ టాపిక్ గా మారాయి.
హైదరాబాద్ చుట్టుపక్కలున్న భూములతో డబ్బులు సంపాదించొచ్చని కేసీఆర్ గుర్తించటంతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్న ఈటల.. 'మియాపూర్ భూ కుంభకోణం ఏమైంది? కుకట్ పల్లి ఎల్లమ్మ బండ భూముల కేసులో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది? చట్టాన్ని.. భూముల్ని కాపాడాల్సిన ప్రభుత్వం డబ్బులు ఉన్న వారికి కొమ్ము కాస్తూ కోర్టుల్లో కేసులు ఓడిపోతోంది. భూముల ద్వారా సంపాదించిన డబ్బుల్నే పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు ఖర్చు చేస్తున్నారు. ఇలా సంపాదించిన డబ్బులతోనే నాలాంటోడ్ని ఓడించేందుకు ఖర్చు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్నారు' అంటూ మండిపడ్డారు.
ఇటీవల కేసీఆర్ సర్కారు రద్దు చేసిన ట్రిపుల్ వన్ జీవో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈటల డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసేందుకు.. దేశంలో ఎన్నికల సందర్భంగా డబ్బు పంపిణీ కోసమే జీవో 111 రద్దు చేసి.. అక్రమ సంపాదనకు తెర తీసినట్లుగా ఈటల ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ మహానగర పర్యావరణ వ్యవస్థను దెబ్బ తీసి.. నగరాన్ని కాంక్రీట్ జంగిల్ గా మార్చేసి.. వరదలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.
కేసీఆర్ కు కావాల్సిన వారి అక్రమ సంపాదనకు.. ఆయనకు డబ్బులు ఇచ్చే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేలా తాజా నిర్ణయం ఉందన్నారు. జీవో 111 పరిధిలో 18 వేల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయన్న ఈటల.. దళితులకు ఇస్తామన్న మూడు ఎకరాల హామీని నెరవేర్చలేదు కానీ.. హైదరాబాద్ శివారులో యాభై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 5800ఎకరాల అసైన్డ్ భూముల్ని లాక్కొని 300-400 గజాల ప్లాట్ లు మాత్రం ఇస్తున్నారన్నారు.
హైదరాబాద్ కు వరద ముప్పు పొంచి ఉందని చెప్పిన ఈటల.. అందుకు ట్రిపుల్ వన్ జీవో రద్దు కారణం కానున్నట్లు హెచ్చరిస్తున్నారు. ''కాళేశ్వరంలో నీళ్లు ముందే నింపి పెట్టారు. వర్షాకాలంలో వరదలకు కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి వరకు పోలాలు మునిగిపోయాయి. జీవో 111 రద్దుతో జంట జలాశయాలను నిర్లక్ష్యం చేస్తే.. హైదరాబాద్ కూడా మునిగిపోతుంది'' అని హెచ్చరించారు.
కేసీఆర్ సర్కారు రాజకీయ విజయాలన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయన్న వాదనను బలంగా వినిపించేలా మాట్లాడిన ఈటల మాటలు హాట్ టాపిక్ గా మారాయి.