Begin typing your search above and press return to search.
రేవంత్ కళ్ళలో ఈటెల ముల్లు...కేసీయార్ ఫుల్ ఖుషీ
By: Tupaki Desk | 22 April 2023 8:40 PM GMTరాజకీయాల్లో ప్రత్యర్ధులు ఎంత బలంగా ఉంటే అధికారంలో ఉన్న వారు కంగారు పడతారు. కానీ వారిలో వారే కలహించుకుంటూ కవ్వించుకుంటూ రచ్చ చేసుకుంటే ఏలిన వారికి హ్యాపీ కాకుండా మరేముంటుంది. ఇపుడు తెలంగాణా రాజకీయాల్లో అదే జరుగుతోంది. కాళ్లరిగేలా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర పేరిట మండుటెండలలో తిరిగారు. కాంగ్రెస్ ని ఏదో విధంగా ఒడ్డున పడేయాడానికి ఆయన తన వంతుగా తాపత్రయపడుతున్నారు.
ఆయనకు సొంత పార్టీలో సీనియర్ల నుంచి సహకారం చూస్తే అంతంతమాత్రంగా ఉంది. అయినా సరే తానుగా జోక్యం చేసుకుని వారిని కలుపుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ నేపధ్యంలో ఆయనకు బీజేపీ నుంచి పోటీ కూడా ఎదురవుతోంది. తెలంగాణాలో ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి. ముక్కోణపు పోటీ కచ్చితంగా ఉంటుంది.
కేంద్రంలోని బీజేపీ ఈసారి తెలంగాణా మీద ఆశలు బాగానే పెట్టుకుంది. మొత్తం 119 సీట్లలో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్ధులు ఉన్నా లేకపోయినా సై అంటోంది. అయితే చివరి నిముషంలో అధికార పార్టీ నుంచి బాగానే జనాలు వచ్చి బీజేపీ తీర్ధం పుచ్చుకోవచ్చు అని అంటున్నారు. అది కూడా బీయారెస్ కి లాభమే తమ నేతలు వేరే పార్టీ నుంచి పోటీ చేసి వ్యతిరేక ఓట్లు ఎన్నో కొన్ని చీలిస్తే అది తమకు లాభ అవుతుందని బీయారెస్ నేతలు అంచనా కడుతున్నారు.
ఇక కాంగ్రెస్ కి క్యాడర్ బాగా ఉంది. గ్రౌండ్ లెవెల్ లో పార్టీ పటిష్టంగా ఉంది. లేనిదల్ల నేతలలో ఐక్యత. ఆ సమస్య అలా ఉంటే ఇపుడు సాటి విపక్షం బేజేపీ కూడా కాంగ్రెస్ మీదనే గురి పెట్టి ఆరోపణలు చేస్తోంది. బీయారెస్ లో సుదీర్ఘ కాల్మ ఉండి బీజేపీలోకి వచ్చిన ఈటెల రాజేందర్ తాజాగా రేవంత్ రెడ్డి మీద చేసిన సంచలన ఆరోపణలతో ఇపుడు తెలంగాణా రాజకీయం హీటెక్కిపోయింది.
భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వచ్చి అమ్మవారి సాక్షిగా తాను బీయారెస్ నేతల నుంచి పైసా కూడా ముట్టలేదని రేవంత్ రెడ్డి కన్నీళ్ళు పెట్టుకుని మరీ ప్రమాణం చేశారు. తన జీవితం వడ్డించిన విస్తరి అన్నారు. తాను కేసీయార్ ఎన్ని బాధలు పెట్టినా పంటి బిగువున భరించాను అని ఆయన అన్నారు. గడచిన తొమ్మిదేళ్ళుగా కేసీయార్ పాలన మీద పోరాటం చేస్తూ నిద్ర లేని రాత్రులు ఎన్నో చూశానని రేవంత్ అన్నారు.
తనను కేసీయార్ నిలువెత్తు ధనం పోసినా తన వెంట్రుక కూడా కొనలేరని హాట్ కామెంట్స్ చేశారు.కేసీయర్ ఫ్యామిలీతో రెండు తరాలుగా పోరాడుతున్నానని, మరో నాలుగు తరాలు వచ్చినా పోరాడుతాను అని రేవంత్ రెడ్డి అంటున్నరు. తన మీద ఈటెల చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాను పాతిక కోట్లు కేసీయార్ నుంచి తీసుకున్నానని నిరూపించకపోతే ఆయన క్షమాపణ చెప్పాలని కోరారు.
తన కంట నీరు తెప్పించిన ఈటెల చేస్తున్నది ఫక్తు నీచ రాజకీయం అని రేవంత్ దుయ్యబెడుతున్నారు. ఇక్కడ చూస్తే రేవంత్ కేసీయార్ కి వ్యతిరేకం, అలాగే ఈటెల కూడా వ్యతిరేకం. నిజానికి ఈ ఇద్దరూ కలసి కేసీయార్ పాలన మీద పోరాడాలి. కానీ జరుగుతుంది వేరు. రేవంత్ రెడ్డి మీద ఈటెల ఆరోపణలు చేస్తే రేవంత్ ఈటెల మీద చేస్తున్నారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఫుల్ ఖుషీ అవుతోంది మాత్రం కచ్చితంగా కేసీయార్ అనే చెప్పాలి. అధికారం కోసం పోటీ పడుతూ ప్రతిపక్షాలు రెండూ పరస్పరం విమర్శలు చేసుకోవడం అంటే అది బీయారెస్ కి సరిగ్గా ఈ టైం లో కలసివచ్చే పరిణామం అంటున్నారు. దీని మీద బీజేపీ నేత విజయశాంతి కూడా ఒక సలహా ఇస్తూ ఇద్దరు నేతలూ కేసీయార్ మీద పోరాటం చేయాలని అన్నారు. అలా కాకుండా ఎవరిని వారు విమర్శలు చేసుకుంటే అది బీయారెస్ కే లాభం అని అంటున్నారు.
నిజానికి వచ్చే ఎన్నికల్లో జరగబోయేది అదే అని బీయారెస్ అంచనా కడుతోంది. విపక్షాల మధ్య ఉన్న భయంకరమైన చీలిక వల్ల సులువుగా తాము మూడవసారి అధికారంలోకి వస్తామని ధీమాను వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ కి ఒక ఆశ అయితే ఉంది. కర్నాటక ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధిస్తే దాని ప్రభావం కచ్చితంగా తెలంగాణా మీద ఉంటుంది.
పక్కనే ఉన్న తెలంగాణాను అన్ని రకాలుగా ఆదుకునేందుకు రాజకీయంగా దన్నుగా నిలిచేందుకు కర్నాటక కాంగ్రెస్ నేతలు ముందుకు వస్తారు. దాంతో అనైక్యంగా ఉన్న కాంగ్రెస్ అప్పటికి సర్దుకుని ముందుకు దూసుకుని వస్తే కచ్చితంగా ఓట్ల చీలిక లేకుండా జనాలు తీర్పు ఇచ్చే చాన్స్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
ఆయనకు సొంత పార్టీలో సీనియర్ల నుంచి సహకారం చూస్తే అంతంతమాత్రంగా ఉంది. అయినా సరే తానుగా జోక్యం చేసుకుని వారిని కలుపుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ నేపధ్యంలో ఆయనకు బీజేపీ నుంచి పోటీ కూడా ఎదురవుతోంది. తెలంగాణాలో ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి. ముక్కోణపు పోటీ కచ్చితంగా ఉంటుంది.
కేంద్రంలోని బీజేపీ ఈసారి తెలంగాణా మీద ఆశలు బాగానే పెట్టుకుంది. మొత్తం 119 సీట్లలో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్ధులు ఉన్నా లేకపోయినా సై అంటోంది. అయితే చివరి నిముషంలో అధికార పార్టీ నుంచి బాగానే జనాలు వచ్చి బీజేపీ తీర్ధం పుచ్చుకోవచ్చు అని అంటున్నారు. అది కూడా బీయారెస్ కి లాభమే తమ నేతలు వేరే పార్టీ నుంచి పోటీ చేసి వ్యతిరేక ఓట్లు ఎన్నో కొన్ని చీలిస్తే అది తమకు లాభ అవుతుందని బీయారెస్ నేతలు అంచనా కడుతున్నారు.
ఇక కాంగ్రెస్ కి క్యాడర్ బాగా ఉంది. గ్రౌండ్ లెవెల్ లో పార్టీ పటిష్టంగా ఉంది. లేనిదల్ల నేతలలో ఐక్యత. ఆ సమస్య అలా ఉంటే ఇపుడు సాటి విపక్షం బేజేపీ కూడా కాంగ్రెస్ మీదనే గురి పెట్టి ఆరోపణలు చేస్తోంది. బీయారెస్ లో సుదీర్ఘ కాల్మ ఉండి బీజేపీలోకి వచ్చిన ఈటెల రాజేందర్ తాజాగా రేవంత్ రెడ్డి మీద చేసిన సంచలన ఆరోపణలతో ఇపుడు తెలంగాణా రాజకీయం హీటెక్కిపోయింది.
భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వచ్చి అమ్మవారి సాక్షిగా తాను బీయారెస్ నేతల నుంచి పైసా కూడా ముట్టలేదని రేవంత్ రెడ్డి కన్నీళ్ళు పెట్టుకుని మరీ ప్రమాణం చేశారు. తన జీవితం వడ్డించిన విస్తరి అన్నారు. తాను కేసీయార్ ఎన్ని బాధలు పెట్టినా పంటి బిగువున భరించాను అని ఆయన అన్నారు. గడచిన తొమ్మిదేళ్ళుగా కేసీయార్ పాలన మీద పోరాటం చేస్తూ నిద్ర లేని రాత్రులు ఎన్నో చూశానని రేవంత్ అన్నారు.
తనను కేసీయార్ నిలువెత్తు ధనం పోసినా తన వెంట్రుక కూడా కొనలేరని హాట్ కామెంట్స్ చేశారు.కేసీయర్ ఫ్యామిలీతో రెండు తరాలుగా పోరాడుతున్నానని, మరో నాలుగు తరాలు వచ్చినా పోరాడుతాను అని రేవంత్ రెడ్డి అంటున్నరు. తన మీద ఈటెల చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాను పాతిక కోట్లు కేసీయార్ నుంచి తీసుకున్నానని నిరూపించకపోతే ఆయన క్షమాపణ చెప్పాలని కోరారు.
తన కంట నీరు తెప్పించిన ఈటెల చేస్తున్నది ఫక్తు నీచ రాజకీయం అని రేవంత్ దుయ్యబెడుతున్నారు. ఇక్కడ చూస్తే రేవంత్ కేసీయార్ కి వ్యతిరేకం, అలాగే ఈటెల కూడా వ్యతిరేకం. నిజానికి ఈ ఇద్దరూ కలసి కేసీయార్ పాలన మీద పోరాడాలి. కానీ జరుగుతుంది వేరు. రేవంత్ రెడ్డి మీద ఈటెల ఆరోపణలు చేస్తే రేవంత్ ఈటెల మీద చేస్తున్నారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఫుల్ ఖుషీ అవుతోంది మాత్రం కచ్చితంగా కేసీయార్ అనే చెప్పాలి. అధికారం కోసం పోటీ పడుతూ ప్రతిపక్షాలు రెండూ పరస్పరం విమర్శలు చేసుకోవడం అంటే అది బీయారెస్ కి సరిగ్గా ఈ టైం లో కలసివచ్చే పరిణామం అంటున్నారు. దీని మీద బీజేపీ నేత విజయశాంతి కూడా ఒక సలహా ఇస్తూ ఇద్దరు నేతలూ కేసీయార్ మీద పోరాటం చేయాలని అన్నారు. అలా కాకుండా ఎవరిని వారు విమర్శలు చేసుకుంటే అది బీయారెస్ కే లాభం అని అంటున్నారు.
నిజానికి వచ్చే ఎన్నికల్లో జరగబోయేది అదే అని బీయారెస్ అంచనా కడుతోంది. విపక్షాల మధ్య ఉన్న భయంకరమైన చీలిక వల్ల సులువుగా తాము మూడవసారి అధికారంలోకి వస్తామని ధీమాను వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ కి ఒక ఆశ అయితే ఉంది. కర్నాటక ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధిస్తే దాని ప్రభావం కచ్చితంగా తెలంగాణా మీద ఉంటుంది.
పక్కనే ఉన్న తెలంగాణాను అన్ని రకాలుగా ఆదుకునేందుకు రాజకీయంగా దన్నుగా నిలిచేందుకు కర్నాటక కాంగ్రెస్ నేతలు ముందుకు వస్తారు. దాంతో అనైక్యంగా ఉన్న కాంగ్రెస్ అప్పటికి సర్దుకుని ముందుకు దూసుకుని వస్తే కచ్చితంగా ఓట్ల చీలిక లేకుండా జనాలు తీర్పు ఇచ్చే చాన్స్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.