Begin typing your search above and press return to search.

ఢిల్లీ మున్సిపల్ లో ఆట ముగియలేదు.. ఆప్ గెలిచినా బీజేపీకే ఛాన్స్?

By:  Tupaki Desk   |   8 Dec 2022 3:16 AM GMT
ఢిల్లీ మున్సిపల్ లో ఆట ముగియలేదు.. ఆప్ గెలిచినా బీజేపీకే ఛాన్స్?
X
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఆట ముగిసిందని, ఆప్ స్పష్టమైన మెజారిటీ సాధించిందని ఇక ఢిల్లీదే కార్పొరేషన్ పీఠం అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఆట ఇంకా ముగియలేదు. నిజానికి, మేయర్ పీఠం కోసం గేమ్ ఇంకా తెరిచి ఉంది. రన్నరప్ అయినప్పటికీ బిజెపి ఇప్పటికీ మేయర్ పీఠాన్ని గెలిచే చాన్స్ ఉంది. బీజేపీ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది.

250 మంది సభ్యులున్న ఎంసీడీలో ఆప్ 134 సీట్లు గెలుచుకుంది. అంటే అవసరమైన మెజారిటీ కంటే కేవలం తొమ్మిది సీట్లు మాత్రమే ఎక్కువ. ఒక పార్టీకి మేయర్‌గా ఎన్నిక కావాలంటే 126 ఓట్లు కావాలి. బీజేపీకి 104, మరో 22 ఓట్లు కావాలి. కావాలనుకుంటే 9 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, మరో ముగ్గురు, ఆప్ నుండి కొద్దిమంది నుండి బిజెపి ఈ సంఖ్యలను పొందవచ్చు.

మేయర్ ఎన్నికకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించకపోవడమే బీజేపీకి అతిపెద్ద ప్రయోజనం. కౌన్సిలర్లు బిజెపికి ఓటు వేయవచ్చు. విప్ జారీ చేసే అవకాశం ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో లేదు. వారి వారి పార్టీలలో ఉండి ఇతర పార్టీ మేయర్ అభ్యర్థికి ఓటు వేయవచ్చు. కాబట్టి అవసరమైన సంఖ్యలు లేకపోయినా, మేయర్ అభ్యర్థిని ఎన్నుకోవడానికి బిజెపి ఈ నిబంధనను ఉపయోగించుకోవచ్చు.

అయితే ఈ అవకాశాన్ని బీజేపీ ఉపయోగించుకుంటుందా అనేది ప్రశ్న. బిజెపి వేచి ఉండే గేమ్‌ను ఆడటానికి ఇష్టపడవచ్చు. ఢిల్లీ మున్సిపాలిటీని కొంతకాలం పాలించడానికి ఆప్ ను అనుమతించి, ఆపై ఆప్ కాళ్ళ క్రింద నుండి మేయర్ పీఠాన్ని లాగవచ్చు. విశేషమేమిటంటే బిజెపి ఢిల్లీ విభాగం చీఫ్ ఆదేశ్ గుప్తా ఇప్పటికే గేమ్ ఇంకా తెరిచి ఉందని చెప్పారు. కాబట్టి మేయర్ ఎన్నికలు జరిగినప్పుడు కొంత డ్రామాను అయితే సహజంగానే జరిగే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.