Begin typing your search above and press return to search.
జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ అయినా టికెట్ కోసం చూడాల్సిందేనా...?
By: Tupaki Desk | 25 Feb 2023 9:35 AM GMTవైసీపీలో పార్టీ పదవులు ఎక్కడా ఖాళీ లేవు. టాప్ టూ బాటమ్ నింపేశారు. మరి ఆ పదవులలో ఉన్న వారు ఏమి చేస్తారు అంటే హోదాను అనుభవిస్తారు అంతే. మీడియాలో వారి పేరు ముందు రాస్తారు అంతే. అసలైన అధికారాలు వారికి ఉన్నాయా అంటే డౌటే.
వైసీపీ మోజు పడిన విశాఖలో ఆ పార్టీ ప్రెసిడెంట్ గా పంచకర్ల రమేష్ బాబుని ఈ మధ్యనే నియమించారు. ఆయన పూర్వాశ్రమంలో తెలుగుదేశంలో పనిచేశారు. దానికంటే ముందు ప్రజారాజ్యంలో పుట్టారు. 2009లో ఫస్ట్ టైం పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నాటికి టీడీపీలో చేరి ఎలమంచిలి నుంచి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో అదే సీటు నుంచి పోటీ చేసి ఓడారు. ఆ మధ్యలో ఆయన విశాఖ రూరల్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా పనిచేశారు.
టీడీపీ పోకడలు నచ్చక పార్టీని వదిలేశారు. ఇపుడు ఆయన వైసీపీలో కీలకమైన పార్టీ పదవిలో ఉన్నారు. అయినా వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా అన్న చర్చ అయితే ఉంది. ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం టికెట్ ని కోరుకుంటున్నారు అయితే అక్కడ జగన్ మెచ్చిన నాయకుడు కేకే రాజు ఉన్నారు. మళ్ళీ ఆయనకే టికెట్ అని కన్ ఫర్మ్ చేసేశారు.
దాంతో పంచకర్ల చూపు పెందుర్తి మీద పడింది. ఆయన గతంలో గెలిచిన సీటు, పాత పరిచయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఉన్నారు. ఈ మధ్యనే ఆయన జగన్ నుంచి భరోసా పొంది తనకే టికెట్ అనిపించుకున్నారు. తన నియోజకవర్గంలో ప్రతీ దానికీ అడ్డుగా ఉన్న సీనియర్ నేత, వర్గ పోరుకు తెర తీసిన శరగడం అప్పలనాయుడుని పార్టీ నుంచ్ సస్పెండ్ చేయించిన అదీప్ రాజు నేనే పోటీ చేస్తాఉ అని చెప్పేస్తున్నారు.
ఇక ఇదే సీటు మీద కన్నేసిన యువ మంత్రి గుడివాడ అమరనాధ్ ని సైతం ఆయన తనదైన వ్యూహంతో ఎదుర్కొన్నారు. చివరికి అమరనాధ్ అనకాపల్లి నుంచే పోటీ చేస్తాను అని చెప్పేసుకున్నారు. ఇపుడు ఆయనకు ఒకే ఒక పోటీ ఉంది. అదే జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబుతోనే. రమేష్ బాబు ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి రావాలని చూస్తున్నారు. సీనియర్ నేతగా ఉన్నారు.
బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నేత. గతంలో తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి పాత పరిచయాలు ఉన్నాయి. దాంతో తనకు టికెట్ ఇస్తే ఆ సీటుని గెలుచుకుని వస్తాను అని చెబుతున్నారు పైగా అక్కడ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పోటీకి దిగుతున్నారు అని అంటున్నారు. ఆయన్ని 2009లో ఓడించిన పంచకర్ల మరోమారు తానే ఓడిస్తాను అంటున్నారు.
మరి పంచకర్ల విషయంలో జగన్ ఏమంటారో చూడాల్సి ఉంది. తాజాగా ఎంపిక చేసిన ఎమ్మెల్సీ సీట్లలో పంచకర్లకు స్థానం కల్పిస్తారు అనుకున్నా అది జరగలేదు. మరి జగన్ ఆలోచన ఏంటో తెలియదు కానీ పంచకర్ల వర్గీయులలో మాత్రం టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్నికలు ఏడాదికి దగ్గరగా వచ్చేశాయి. తమ నేతకు సీటు చూపిస్తే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటామని అంటున్నారు
అయితే అటు అదీప్ రాజ్ వంటి యువ ఎమ్మెల్యే ఉన్నారు. ఇపుడు సీనియర్ నేత పంచకర్ల ఉన్నారు. దాంతో అధినాయకత్వం ఏమీ చెప్పలేకపోతోంది అంటున్నారు. ఇక పంచకర్లను విశాఖ నుంచి కానీ అనకాపల్లి నుంచి కానీ ఎంపీగా పోటీ చేయిస్తారు అన్న టాక్ కూడా ఉంది. అయితే దానికి ఆయన ఇష్టపడకపోవచ్చు అంటున్నారు. ఏది ఏమైనా పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి టికెట్ తెచ్చుకోకపోతే ఇబ్బందే అని అంటున్నారు. చూడాలి మరి పంచకర్ల రాజకీయ జాతకం ఎలా ఉందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
వైసీపీ మోజు పడిన విశాఖలో ఆ పార్టీ ప్రెసిడెంట్ గా పంచకర్ల రమేష్ బాబుని ఈ మధ్యనే నియమించారు. ఆయన పూర్వాశ్రమంలో తెలుగుదేశంలో పనిచేశారు. దానికంటే ముందు ప్రజారాజ్యంలో పుట్టారు. 2009లో ఫస్ట్ టైం పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నాటికి టీడీపీలో చేరి ఎలమంచిలి నుంచి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో అదే సీటు నుంచి పోటీ చేసి ఓడారు. ఆ మధ్యలో ఆయన విశాఖ రూరల్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా పనిచేశారు.
టీడీపీ పోకడలు నచ్చక పార్టీని వదిలేశారు. ఇపుడు ఆయన వైసీపీలో కీలకమైన పార్టీ పదవిలో ఉన్నారు. అయినా వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా అన్న చర్చ అయితే ఉంది. ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం టికెట్ ని కోరుకుంటున్నారు అయితే అక్కడ జగన్ మెచ్చిన నాయకుడు కేకే రాజు ఉన్నారు. మళ్ళీ ఆయనకే టికెట్ అని కన్ ఫర్మ్ చేసేశారు.
దాంతో పంచకర్ల చూపు పెందుర్తి మీద పడింది. ఆయన గతంలో గెలిచిన సీటు, పాత పరిచయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఉన్నారు. ఈ మధ్యనే ఆయన జగన్ నుంచి భరోసా పొంది తనకే టికెట్ అనిపించుకున్నారు. తన నియోజకవర్గంలో ప్రతీ దానికీ అడ్డుగా ఉన్న సీనియర్ నేత, వర్గ పోరుకు తెర తీసిన శరగడం అప్పలనాయుడుని పార్టీ నుంచ్ సస్పెండ్ చేయించిన అదీప్ రాజు నేనే పోటీ చేస్తాఉ అని చెప్పేస్తున్నారు.
ఇక ఇదే సీటు మీద కన్నేసిన యువ మంత్రి గుడివాడ అమరనాధ్ ని సైతం ఆయన తనదైన వ్యూహంతో ఎదుర్కొన్నారు. చివరికి అమరనాధ్ అనకాపల్లి నుంచే పోటీ చేస్తాను అని చెప్పేసుకున్నారు. ఇపుడు ఆయనకు ఒకే ఒక పోటీ ఉంది. అదే జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబుతోనే. రమేష్ బాబు ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి రావాలని చూస్తున్నారు. సీనియర్ నేతగా ఉన్నారు.
బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నేత. గతంలో తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి పాత పరిచయాలు ఉన్నాయి. దాంతో తనకు టికెట్ ఇస్తే ఆ సీటుని గెలుచుకుని వస్తాను అని చెబుతున్నారు పైగా అక్కడ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పోటీకి దిగుతున్నారు అని అంటున్నారు. ఆయన్ని 2009లో ఓడించిన పంచకర్ల మరోమారు తానే ఓడిస్తాను అంటున్నారు.
మరి పంచకర్ల విషయంలో జగన్ ఏమంటారో చూడాల్సి ఉంది. తాజాగా ఎంపిక చేసిన ఎమ్మెల్సీ సీట్లలో పంచకర్లకు స్థానం కల్పిస్తారు అనుకున్నా అది జరగలేదు. మరి జగన్ ఆలోచన ఏంటో తెలియదు కానీ పంచకర్ల వర్గీయులలో మాత్రం టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్నికలు ఏడాదికి దగ్గరగా వచ్చేశాయి. తమ నేతకు సీటు చూపిస్తే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటామని అంటున్నారు
అయితే అటు అదీప్ రాజ్ వంటి యువ ఎమ్మెల్యే ఉన్నారు. ఇపుడు సీనియర్ నేత పంచకర్ల ఉన్నారు. దాంతో అధినాయకత్వం ఏమీ చెప్పలేకపోతోంది అంటున్నారు. ఇక పంచకర్లను విశాఖ నుంచి కానీ అనకాపల్లి నుంచి కానీ ఎంపీగా పోటీ చేయిస్తారు అన్న టాక్ కూడా ఉంది. అయితే దానికి ఆయన ఇష్టపడకపోవచ్చు అంటున్నారు. ఏది ఏమైనా పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి టికెట్ తెచ్చుకోకపోతే ఇబ్బందే అని అంటున్నారు. చూడాలి మరి పంచకర్ల రాజకీయ జాతకం ఎలా ఉందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.