Begin typing your search above and press return to search.
షాకింగ్ నిజం: ప్రెగ్నెన్సీ సమస్యలతో 2 నిమిషాలకో మరణం
By: Tupaki Desk | 24 Feb 2023 9:42 AM GMTఅమ్మతనానికి తొలిమెట్టు గర్భధారణ. అయితే.. ఈ దశలో సమస్యల్ని ఎదుర్కొనే వారికి గర్భధారణ ప్రాణం మీదకు తీసుకొస్తుంది. గర్భధారణ సమయంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని తెలియజేసే రిపోర్టు ఒకటి తాజాగా వెలుగు చూసింది.
ప్రెగ్నెన్సీపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది. గర్భధారణ సమయంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల కారణంగా ప్రతి రెండు నిమిషాలకు ఒకరు చొప్పున ప్రాణాల్ని విడిస్తున్న వైనాన్ని తాజాగా వెల్లడైన ఒక రిపోర్టు స్పష్టం చేస్తోంది.
2020లో ప్రపంచవ్యాప్తంగా 2.87లక్షల మంది మహిళలు మరణించిన వైనం బయటకు వచ్చింది.తీవ్రమైన రక్తస్రావం.. అధిక రక్తపోటు.. గర్భధారణ సమయంలో వచ్చే అంటువ్యాధులు.. హెచ్ఐవీ లాంటి ఆరోగ్య సమస్యలతో ప్రాణాల్ని విడుస్తున్నట్లుగా గుర్తించారు. ప్రసూతి మరణాల్ని కట్టడి చేయాలంటే పటిష్టమైన చర్యలు చేపట్టాలని సదరు నివేదిక స్పష్టం చేస్తోంది. ఐక్యరాజ్య సమితి వెల్లడించిన ఈ రిపోర్టు ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది.
ట్రెండ్స్ ఇన్ మెటెర్నల్ మోర్టాలిటీ పేరుతో చేసిన పరిశోధన ఈ కఠోర వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేసింది. గర్బధారణ సమయంలో ఎదురయ్యే సమస్యలపై మరింత ఫోకస్ పెట్టని పక్షంలో 2030నాటికి ఈ మరణాల సంఖ్య 10లక్షలకు పెరుగుతాయని అంచనా వేశారు.
ప్రతి మహిళకు గర్బధారణ సమయం నుంచి డెలివరీ అయ్యే వరకు మెరుగైన వైద్య సేవల అవసరం చాలా ఉంది. వారికి అవసరమైన పోషకాహారం.. వైద్య సేవలు.. మందులు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. ఏమైనా.. ప్రెగ్నెన్సీ వేళ.. ఇంత భారీగా మరణిస్తున్న వైనంపై ప్రభుత్వాలు సైతం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
ప్రెగ్నెన్సీపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది. గర్భధారణ సమయంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల కారణంగా ప్రతి రెండు నిమిషాలకు ఒకరు చొప్పున ప్రాణాల్ని విడిస్తున్న వైనాన్ని తాజాగా వెల్లడైన ఒక రిపోర్టు స్పష్టం చేస్తోంది.
2020లో ప్రపంచవ్యాప్తంగా 2.87లక్షల మంది మహిళలు మరణించిన వైనం బయటకు వచ్చింది.తీవ్రమైన రక్తస్రావం.. అధిక రక్తపోటు.. గర్భధారణ సమయంలో వచ్చే అంటువ్యాధులు.. హెచ్ఐవీ లాంటి ఆరోగ్య సమస్యలతో ప్రాణాల్ని విడుస్తున్నట్లుగా గుర్తించారు. ప్రసూతి మరణాల్ని కట్టడి చేయాలంటే పటిష్టమైన చర్యలు చేపట్టాలని సదరు నివేదిక స్పష్టం చేస్తోంది. ఐక్యరాజ్య సమితి వెల్లడించిన ఈ రిపోర్టు ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది.
ట్రెండ్స్ ఇన్ మెటెర్నల్ మోర్టాలిటీ పేరుతో చేసిన పరిశోధన ఈ కఠోర వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేసింది. గర్బధారణ సమయంలో ఎదురయ్యే సమస్యలపై మరింత ఫోకస్ పెట్టని పక్షంలో 2030నాటికి ఈ మరణాల సంఖ్య 10లక్షలకు పెరుగుతాయని అంచనా వేశారు.
ప్రతి మహిళకు గర్బధారణ సమయం నుంచి డెలివరీ అయ్యే వరకు మెరుగైన వైద్య సేవల అవసరం చాలా ఉంది. వారికి అవసరమైన పోషకాహారం.. వైద్య సేవలు.. మందులు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. ఏమైనా.. ప్రెగ్నెన్సీ వేళ.. ఇంత భారీగా మరణిస్తున్న వైనంపై ప్రభుత్వాలు సైతం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.