Begin typing your search above and press return to search.
బడ్జెట్ సమావేశాలపైనే అందరి దృష్టి.. రాజధానిపై నిర్ణయం ఉండేనా?
By: Tupaki Desk | 10 March 2023 10:00 PM GMTఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఎందుకంటే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది. వచ్చే ఏడాది వేసవిలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఇంకా ముందుగానే అంటే ఈ ఏడాది చివరలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండొచ్చు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ జగన్ ప్రభుత్వానికి దాదాపు చివరి బడ్జెట్ కానుంది. ఈ క్రమంలో బడ్జెట్ సందర్భంగా కొన్ని ఎన్నికల తాయిలాలను ప్రవేశపెట్టొచ్చని చర్చ జరుగుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా విశాఖను రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఎప్పటి నుంచి అక్కడ పరిపాలన మొదలవుతుందో ప్రభుత్వం శాసనసభలో స్పష్టమైన ప్రకటన చేయొచ్చని చెబుతున్నారు. దీంతో సర్వత్రా ఏపీ శాసనసభ సమావేశాలపైన అందరి దృష్టీ ఉంది.
శాసనసభ సమావేశాల్లో భాగంగా నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం తరువాత అసెంబ్లీ బీఏసీ సమావేశం కానుంది. అందులో సమావేశాలు ఎన్ని రోజుల నిర్వహించాలి? సమావేశాల అజెండా వంటి అంశాల పైన నిర్ణయం తీసుకుంటారు. ఏపీ ప్రభుత్వం 2022–23 వార్షిక బడ్జెట్ రూ 2.56 లక్షల కోట్లతో ప్రవేశపెట్టింది. ఈసారి ఆ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే విశాఖ నుంచి పాలన ఎప్పుడనేదానిపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుందని తెలుస్తోంది.
ఏపీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి 29 వరకు నిర్వహించే అవకాశం ఉంది. ఆదివారాలు, పండుగ సెలవులు పోనూ దాదాపు 11 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా మార్చి 28, 29 తేదీల్లో విశాఖలో జీ20 సన్నాహక సదస్సు ఉంది. ఈ నేపథ్యంలో సదస్సుకు రెండు మూడు రోజుల ముందే శాసనసభ సమావేశాలు ముగించాలని తొలుత ప్రభుత్వం భావించింది. అయితే ఎన్నికల ఏడాది కావడం, ఇదే చివరి పూర్తి బడ్జెట్ కావడం వంటి కారణాలతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలపైనే దృష్టి సారించిందని చెబుతున్నారు. దీనిపైన అధికారికంగా బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా మార్చి 17న ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2023–24 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. ఆ తర్వాత 18, 19 తేదీలు శనివారం, ఆదివారం కావడంతో సెలవులు ప్రకటించనుంది. ఇక 25, 26 తేదీలు కూడా శని, ఆదివారాలు. 22న తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ. దీంతో ఆ రోజు కూడా శాసనసభ సమావేశాలకు సెలవు ఉంటుంది. మార్చి 30న శ్రీరామ నవమి. ఆ రోజు ఎలాగూ సెలవే. దీంతో మార్చి 29నే అసెంబ్లీ సమావేశాలు ముగిసే చాన్సు ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ జగన్ ప్రభుత్వానికి దాదాపు చివరి బడ్జెట్ కానుంది. ఈ క్రమంలో బడ్జెట్ సందర్భంగా కొన్ని ఎన్నికల తాయిలాలను ప్రవేశపెట్టొచ్చని చర్చ జరుగుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా విశాఖను రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఎప్పటి నుంచి అక్కడ పరిపాలన మొదలవుతుందో ప్రభుత్వం శాసనసభలో స్పష్టమైన ప్రకటన చేయొచ్చని చెబుతున్నారు. దీంతో సర్వత్రా ఏపీ శాసనసభ సమావేశాలపైన అందరి దృష్టీ ఉంది.
శాసనసభ సమావేశాల్లో భాగంగా నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం తరువాత అసెంబ్లీ బీఏసీ సమావేశం కానుంది. అందులో సమావేశాలు ఎన్ని రోజుల నిర్వహించాలి? సమావేశాల అజెండా వంటి అంశాల పైన నిర్ణయం తీసుకుంటారు. ఏపీ ప్రభుత్వం 2022–23 వార్షిక బడ్జెట్ రూ 2.56 లక్షల కోట్లతో ప్రవేశపెట్టింది. ఈసారి ఆ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే విశాఖ నుంచి పాలన ఎప్పుడనేదానిపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుందని తెలుస్తోంది.
ఏపీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి 29 వరకు నిర్వహించే అవకాశం ఉంది. ఆదివారాలు, పండుగ సెలవులు పోనూ దాదాపు 11 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా మార్చి 28, 29 తేదీల్లో విశాఖలో జీ20 సన్నాహక సదస్సు ఉంది. ఈ నేపథ్యంలో సదస్సుకు రెండు మూడు రోజుల ముందే శాసనసభ సమావేశాలు ముగించాలని తొలుత ప్రభుత్వం భావించింది. అయితే ఎన్నికల ఏడాది కావడం, ఇదే చివరి పూర్తి బడ్జెట్ కావడం వంటి కారణాలతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలపైనే దృష్టి సారించిందని చెబుతున్నారు. దీనిపైన అధికారికంగా బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా మార్చి 17న ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2023–24 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. ఆ తర్వాత 18, 19 తేదీలు శనివారం, ఆదివారం కావడంతో సెలవులు ప్రకటించనుంది. ఇక 25, 26 తేదీలు కూడా శని, ఆదివారాలు. 22న తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ. దీంతో ఆ రోజు కూడా శాసనసభ సమావేశాలకు సెలవు ఉంటుంది. మార్చి 30న శ్రీరామ నవమి. ఆ రోజు ఎలాగూ సెలవే. దీంతో మార్చి 29నే అసెంబ్లీ సమావేశాలు ముగిసే చాన్సు ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.