Begin typing your search above and press return to search.
#కరోనా: అంత్యక్రియలపై కేంద్రం మార్గదర్శకాలివీ
By: Tupaki Desk | 15 March 2020 8:14 AM GMTకర్ణాటకలో కరోనా కారణంగా ఓ వృద్ధుడు మరణించాడు. దేశంలోనే తొలి కరోనా మృతుడు ఇతడే. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 68ఏళ్ల ఓ మహిళ కరోనా కారణంగా మృతి చెందింది.
అయితే కరోనాతో మృతి చెందిన మహిళ అంత్యక్రియలపై వివాదం చెలరేగింది. ఈ మృత శరీరం నుంచి ఇతరులకు వ్యాధి సోకే అవకాశం లేకపోయినప్పటికీ ఆ కాలనీవాసులు ఆమె అంత్యక్రియలు చేయవద్దని ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలోనే కరోనా మృతుల అంతిమ సంస్కారాలపై కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా మార్గదర్శకాలు రూపొందించింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, అపోహలు తొలగించేందుకు ఈ మార్గదర్శకాలు దోహదం చేస్తాయి.
అయితే కేంద్రం కరోనా మృతుల వల్ల వైరస్ వ్యాపించిందని స్పష్టం చేసింది. మార్చురీలోని శవం ద్వారా, మృతదేహం నుంచి వైరస్ వ్యాపించే అవకాశం లేదని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్ వైరస్ దగ్గు - తమ్ముల వల్ల బయటకు వస్తుందని.. ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తోందని తెలిపింది.
ఇక కరోనా మృతుల శరీరాలను తాకడం ద్వారా కరోనా రాదని కేంద్రం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం శరీరాన్ని తగు విధంగా చుట్టి దహనం ఖననం చేయవచ్చునని కేంద్రం సూచించింది. కరోనా మృతుల శరీరాలకు అంత్యక్రియలు చేయవచ్చనని తెలిపారు.
అయితే కరోనాతో మృతి చెందిన మహిళ అంత్యక్రియలపై వివాదం చెలరేగింది. ఈ మృత శరీరం నుంచి ఇతరులకు వ్యాధి సోకే అవకాశం లేకపోయినప్పటికీ ఆ కాలనీవాసులు ఆమె అంత్యక్రియలు చేయవద్దని ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలోనే కరోనా మృతుల అంతిమ సంస్కారాలపై కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా మార్గదర్శకాలు రూపొందించింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, అపోహలు తొలగించేందుకు ఈ మార్గదర్శకాలు దోహదం చేస్తాయి.
అయితే కేంద్రం కరోనా మృతుల వల్ల వైరస్ వ్యాపించిందని స్పష్టం చేసింది. మార్చురీలోని శవం ద్వారా, మృతదేహం నుంచి వైరస్ వ్యాపించే అవకాశం లేదని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్ వైరస్ దగ్గు - తమ్ముల వల్ల బయటకు వస్తుందని.. ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తోందని తెలిపింది.
ఇక కరోనా మృతుల శరీరాలను తాకడం ద్వారా కరోనా రాదని కేంద్రం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం శరీరాన్ని తగు విధంగా చుట్టి దహనం ఖననం చేయవచ్చునని కేంద్రం సూచించింది. కరోనా మృతుల శరీరాలకు అంత్యక్రియలు చేయవచ్చనని తెలిపారు.