Begin typing your search above and press return to search.
వివేకా హత్య తర్వాత సాక్ష్యాల ధ్వంసం ఎలా జరిగిందంటే?
By: Tupaki Desk | 23 Feb 2023 9:42 AM GMTదివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు.. ఆయన అమితంగా అభిమానించే వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా ఆయన ఇంట్లోనే చంపేసిన దుర్మార్గం ఎంతటి సంచలనంగా మారిందన్నది తెలిసిందే. సొంత బాబాయ్ ను పొట్టనబెట్టుకున్న వారి సంగతి తేల్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏదేదో జరిగిపోతుందన్న ప్రచారం జరిగింది. అందుకు భిన్నంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ సరిగా జరగకపోవటమే కాదు.. ఈ కేసులో వైసీపీ కడప ఎంపీ అవినాశ్ రెడ్డి.. ఆయన తండ్రిభాస్కర్ రెడ్డి పాత్ర ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తూ కోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.
ఈ కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ.. పలు షాకింగ్ నిజాల్ని ప్రస్తావించింది. వైఎస్ వివేకా హత్యకు ఎలా ప్లాన్ చేసింది.. హత్య సందర్భంగా ఏమేం జరిగింది? ఎవరి పాత్ర ఎంత? అన్న విషయంతో పాటు.. హత్య తర్వాత ఆధారాల్ని.. సాక్ష్యాల్ని తొలగించేందుకు భారీగా సాగిన కసరత్తును పూసగుచ్చినట్లుగా సీబీఐ పేర్కొంది. ఈ వివరాల్ని చూస్తే.. వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణ కాస్త ఆలస్యంగా సాగినట్లుగా కనిపించినా.. సాక్ష్యాల్ని పక్కాగా సేకరించినట్లుగా సీబీఐ కౌంటర్ ను చూస్తే అర్థమవుతుంది.
ఇక.. వివేకా హత్య తర్వాత ఏం జరిగింది? ఎవరు ఏమేం చేశారు? హత్య తర్వాత కీలకమైన సాక్ష్యాల ధ్వంసం ఎపిసోడ్ లో ఎవరికి ఎంత భాగస్వామ్యం ఉందన్న వివరాల్ని పేర్కొంది. ఈ కేసులో పలువురు ఇచ్చిన సాక్ష్యాల్ని ఆధారంగా చేసుకొని.. ఈ వాదనను సిద్ధం చేశారు. ఇంతకూ సీబీఐ వాదన ఏమిటంటే..
- హత్య జరిగిన రోజుకు కొద్ది గంటల ముందే శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డిలు తదితరులు భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిల ఇంట్లోనే ఉన్నారు. హత్య సందర్భంగా ఏర్పడే సాక్ష్యాల్ని ధ్వంసం చేసేందుకు వారు అక్కడే ఉన్నారు. వివేకా హత్య జరిగిన విషయాన్ని తెల్లవారుజాము ప్రాంతంలో సమాచారం అందింది.
- వివేకా ఇంటికి ఉదయం 5.20గంటల వేళలో వెళ్లిన శివప్రకాశ్ రెడ్డి.. ఉమాశంకర్ రెడ్డిలు సాక్ష్యాల్ని ధ్వంసం చేశారు. శివప్రకాశ్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చిన తర్వాత అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డి.. ఉదయ్ కుమార్రెడ్డి.. సురేందర్రెడ్డి.. ప్రశాంత్ రెడడ్ి.. రాఘవరెడ్డి.. రమణా రెడ్డి పీఏలు వివేకా ఇంటికి వెళ్లిన వారిలో ఉన్నారు.
- వివేకాను హత్య చేసిన రోజు ఉదయం స్థానికంగా ఉండే వైసీపీనేత శశికళ.. ఇంటికి వచ్చారు. వివేకాకు గుండెపోటు వచ్చిందని అవినాశ్ రెడ్డి ఆమెకు చెప్పారు. అవినాశ్ రరెడ్డి తన ఫోన్ నుంచి మరో నెంబరుకుకాల్ చేశాడు. ఆ తర్వాత మరో రెండు కాల్స్ చేశాడు. తర్వాత పీఏ రాఘవరెడ్డి ఫోన్ తో సీఐ శంకరయ్యకు కాల్చేసి.. వివేకానందరెడ్డి గుండెపోటుతో రక్తపు వాంతులు చేసుకొని చనిపోయినట్లుగా
పేర్కొన్నారు. సెక్యురిటీ కోసం పోలీసుల్ని పంపాలని చెప్పారు.
- వివేకా మరణం గురించి సమాచారం అందుకున్న సీఐ శంకరయ్య భద్రత కోసం పోలీసుల్ని పంపినా.. ఆయన మాత్రం ఘటనాస్థలానికి చేరుకోలేదు. హత్య విషయాన్ని ఉద్దేశపూర్వకంగా సీక్రెట్ గా ఉంచారు. సహజ మరణంగా కట్టుకథ అల్లారు. హత్య జరిగిన ఘటనాస్థలాన్ని నిందితులు శుభ్రం చేయటంతో పాటు.. వివేకా గాయాలకు కట్లు కట్టి ఆసుపత్రికి తరలించారు.
- వివేకా హత్యలో కీలక భూమిక పోషించిన సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వటం సరైనది కాదని సీబీఐ స్పష్టం చేసింది. సునీల్ యాదవ్ ను వాచ్ మన్ రంగన్న గుర్తించిన వైనాన్ని పరస్తావించింది. అంతేకాదు.. దస్తగిరి కుటుంబం మీద దాడులు జరుగుతున్నాయని.. సునీల్ యాదవ్ కు బెయిల్ ఇస్తే.. ఈ కేసులో సాక్ష్యం ఇవ్వటానికి ఎవరూ ముందుకు రారని స్పష్టం చేసింది. హత్య తర్వాత సునీల్ యాదవ్ గోవాకు పారిపోయాడని.. బెయిల్ ఇస్తే పారిపోయే వీలుందని సీబీఐ స్పష్టం చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
ఈ కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ.. పలు షాకింగ్ నిజాల్ని ప్రస్తావించింది. వైఎస్ వివేకా హత్యకు ఎలా ప్లాన్ చేసింది.. హత్య సందర్భంగా ఏమేం జరిగింది? ఎవరి పాత్ర ఎంత? అన్న విషయంతో పాటు.. హత్య తర్వాత ఆధారాల్ని.. సాక్ష్యాల్ని తొలగించేందుకు భారీగా సాగిన కసరత్తును పూసగుచ్చినట్లుగా సీబీఐ పేర్కొంది. ఈ వివరాల్ని చూస్తే.. వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణ కాస్త ఆలస్యంగా సాగినట్లుగా కనిపించినా.. సాక్ష్యాల్ని పక్కాగా సేకరించినట్లుగా సీబీఐ కౌంటర్ ను చూస్తే అర్థమవుతుంది.
ఇక.. వివేకా హత్య తర్వాత ఏం జరిగింది? ఎవరు ఏమేం చేశారు? హత్య తర్వాత కీలకమైన సాక్ష్యాల ధ్వంసం ఎపిసోడ్ లో ఎవరికి ఎంత భాగస్వామ్యం ఉందన్న వివరాల్ని పేర్కొంది. ఈ కేసులో పలువురు ఇచ్చిన సాక్ష్యాల్ని ఆధారంగా చేసుకొని.. ఈ వాదనను సిద్ధం చేశారు. ఇంతకూ సీబీఐ వాదన ఏమిటంటే..
- హత్య జరిగిన రోజుకు కొద్ది గంటల ముందే శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డిలు తదితరులు భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిల ఇంట్లోనే ఉన్నారు. హత్య సందర్భంగా ఏర్పడే సాక్ష్యాల్ని ధ్వంసం చేసేందుకు వారు అక్కడే ఉన్నారు. వివేకా హత్య జరిగిన విషయాన్ని తెల్లవారుజాము ప్రాంతంలో సమాచారం అందింది.
- వివేకా ఇంటికి ఉదయం 5.20గంటల వేళలో వెళ్లిన శివప్రకాశ్ రెడ్డి.. ఉమాశంకర్ రెడ్డిలు సాక్ష్యాల్ని ధ్వంసం చేశారు. శివప్రకాశ్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చిన తర్వాత అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డి.. ఉదయ్ కుమార్రెడ్డి.. సురేందర్రెడ్డి.. ప్రశాంత్ రెడడ్ి.. రాఘవరెడ్డి.. రమణా రెడ్డి పీఏలు వివేకా ఇంటికి వెళ్లిన వారిలో ఉన్నారు.
- వివేకాను హత్య చేసిన రోజు ఉదయం స్థానికంగా ఉండే వైసీపీనేత శశికళ.. ఇంటికి వచ్చారు. వివేకాకు గుండెపోటు వచ్చిందని అవినాశ్ రెడ్డి ఆమెకు చెప్పారు. అవినాశ్ రరెడ్డి తన ఫోన్ నుంచి మరో నెంబరుకుకాల్ చేశాడు. ఆ తర్వాత మరో రెండు కాల్స్ చేశాడు. తర్వాత పీఏ రాఘవరెడ్డి ఫోన్ తో సీఐ శంకరయ్యకు కాల్చేసి.. వివేకానందరెడ్డి గుండెపోటుతో రక్తపు వాంతులు చేసుకొని చనిపోయినట్లుగా
పేర్కొన్నారు. సెక్యురిటీ కోసం పోలీసుల్ని పంపాలని చెప్పారు.
- వివేకా మరణం గురించి సమాచారం అందుకున్న సీఐ శంకరయ్య భద్రత కోసం పోలీసుల్ని పంపినా.. ఆయన మాత్రం ఘటనాస్థలానికి చేరుకోలేదు. హత్య విషయాన్ని ఉద్దేశపూర్వకంగా సీక్రెట్ గా ఉంచారు. సహజ మరణంగా కట్టుకథ అల్లారు. హత్య జరిగిన ఘటనాస్థలాన్ని నిందితులు శుభ్రం చేయటంతో పాటు.. వివేకా గాయాలకు కట్లు కట్టి ఆసుపత్రికి తరలించారు.
- వివేకా హత్యలో కీలక భూమిక పోషించిన సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వటం సరైనది కాదని సీబీఐ స్పష్టం చేసింది. సునీల్ యాదవ్ ను వాచ్ మన్ రంగన్న గుర్తించిన వైనాన్ని పరస్తావించింది. అంతేకాదు.. దస్తగిరి కుటుంబం మీద దాడులు జరుగుతున్నాయని.. సునీల్ యాదవ్ కు బెయిల్ ఇస్తే.. ఈ కేసులో సాక్ష్యం ఇవ్వటానికి ఎవరూ ముందుకు రారని స్పష్టం చేసింది. హత్య తర్వాత సునీల్ యాదవ్ గోవాకు పారిపోయాడని.. బెయిల్ ఇస్తే పారిపోయే వీలుందని సీబీఐ స్పష్టం చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.