Begin typing your search above and press return to search.
బీజేపీని టెన్షన్ పెట్టేసిన ఈవిఎంలు
By: Tupaki Desk | 11 Nov 2020 10:10 AM GMTనాలుగు ఈవిఎంలు బీజేపీని టెన్షన్ పెట్టేశాయి. తెలంగాణాలో చరిత్ర సృష్టించిన దుబ్బాక ఉపఎన్నికలో చివరకు బీజేపీ అభ్యర్ధి రఘునందనరావు గెలిచిన విషయం తెలిసిందే. అధికారులిచ్చిన వివరాల ప్రకారం రఘు టీఆర్ఎస్ అభ్యర్ధి సుజాతపై 1118 ఓట్లతో గెలిచినట్లు మీడియాలో వచ్చేసింది. అయితే 4 ఈవీఎంలలో ఓట్లు లెక్కించాల్సుందని ఎన్నికల అధికారులు చల్లగా చెప్పారు. దాంతో ఒక్కసారిగా అందరిలోను టెన్షన్ పెరిగిపోయింది. ఈ పరిస్ధితుల్లో బీజేపీ నేత రఘునందనరావు పరిస్దితి అయితే ఇక చెప్పాల్సిన పనేలేదు.
ఎందుకంటే బీజేపి అభ్యర్ధి గెలిచినట్లు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు కూడా మొదలైపోయాయి. టీఆర్ఎస్ అభ్యర్ధితో పాటు ఇతర నేతలు మెల్లిగా కౌంటింగ్ సెంటర్ నుండి ఒక్కక్కరో వెళ్ళిపోతున్నారు. ఈ దశలో నాలుగు ఈవిఎంల్లో ఓట్లను లెక్కించాలని అధికారులు చేసిన ప్రకటన అందరినీ ఉలిక్కిపడేట్లు చేసింది. ఎందుకంటే 24 రౌండ్ల లెక్కింపులో రౌండు రౌండుకు మెజారిటిల్లో తేడా వచ్చిన విషయం తెలిసిందే. అలాంటిది నాలుగు ఈవిఎంల్లోని ఓట్లంటే సుమారు 3 వేల ఓట్లుంటాయని అంచనా వేశారు.
అప్పటికే బీజేపీ అభ్యర్ధికి వచ్చిన మెజారిటి 1118 కావటంతో నాలుగు ఈవిఎంల్లోని ఓట్లను లెక్కపెడితే ఫలితం తారు మారయ్యే అవకాశలున్నాయి. ఈ విషయాలను లెక్కేసుకోవటంతో రెండు పార్టీల నేతల్లో ఒక్కసారిగా బీపీ పెరిగిపోయింది. నేతలను పిలిపించిన అధికారులు ఈవిఎంలను ఓపెన్ చేయటానికి ప్రయత్నించారు. అయితే ఎంత ప్రయత్నించినా సాంకేతిక సమస్యలతో అవి ఓపెన్ కాలేదు. దాంతో పార్టీల అనుమతితో ఈవిఎం లలోని వీవీ ప్యాట్లను లెక్కించాలని డిసైడ్ చేశారు.
ఈవీఎంల్లోని వివి ప్యాట్ స్లిప్పుల ఆధారంగా ఓట్లన లెక్కించారు. స్లిప్పులను లెక్కించిన తర్వాత కూడా మెజారిటి ఓట్లు బీజేపీకే పడటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అంటే ఇద్దరికీ పడిన ఓట్లను లెక్కించిన తర్వాత రఘునందనరావు పైనల్ మెజారిటి 1079 గా లెక్క తేలింది. ఆ తర్వాత ఎలక్షన్ కమీషన్ అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 1,98,807. ఇందులో పోలైన ఓట్లు 1,64,192. బీజేపీ అభ్యర్ధికి 63,352 ఓట్లు పోలయ్యాయి.
ఇక టీఆర్ఎస్ అభ్యర్ధికి 62,273. మూడో స్ధానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి చెఱకు శ్రీనివాసరెడ్డికి 22,196 ఓట్లొచ్చాయి. స్వతంత్ర అభ్యర్ధులుగా చాలామంది పోటి చేసిన బండారు నాగరాజు కు మాత్రం 3570 ఓట్లు పోలయ్యాయి. చివరగా నోటాకు కూడా 557 ఓట్లు రావటం ఆశ్చర్యం. బీజేపికి 38.47 శాతం ఓట్లొస్తే, టీఆర్ఎస్ కు 37.82 శాతం ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీ అభ్యర్ధి గెలిచింది కేవలం 0.7 ఓట్ల శాతం తేడాతోనే కావటం గమనార్హం.
ఎందుకంటే బీజేపి అభ్యర్ధి గెలిచినట్లు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు కూడా మొదలైపోయాయి. టీఆర్ఎస్ అభ్యర్ధితో పాటు ఇతర నేతలు మెల్లిగా కౌంటింగ్ సెంటర్ నుండి ఒక్కక్కరో వెళ్ళిపోతున్నారు. ఈ దశలో నాలుగు ఈవిఎంల్లో ఓట్లను లెక్కించాలని అధికారులు చేసిన ప్రకటన అందరినీ ఉలిక్కిపడేట్లు చేసింది. ఎందుకంటే 24 రౌండ్ల లెక్కింపులో రౌండు రౌండుకు మెజారిటిల్లో తేడా వచ్చిన విషయం తెలిసిందే. అలాంటిది నాలుగు ఈవిఎంల్లోని ఓట్లంటే సుమారు 3 వేల ఓట్లుంటాయని అంచనా వేశారు.
అప్పటికే బీజేపీ అభ్యర్ధికి వచ్చిన మెజారిటి 1118 కావటంతో నాలుగు ఈవిఎంల్లోని ఓట్లను లెక్కపెడితే ఫలితం తారు మారయ్యే అవకాశలున్నాయి. ఈ విషయాలను లెక్కేసుకోవటంతో రెండు పార్టీల నేతల్లో ఒక్కసారిగా బీపీ పెరిగిపోయింది. నేతలను పిలిపించిన అధికారులు ఈవిఎంలను ఓపెన్ చేయటానికి ప్రయత్నించారు. అయితే ఎంత ప్రయత్నించినా సాంకేతిక సమస్యలతో అవి ఓపెన్ కాలేదు. దాంతో పార్టీల అనుమతితో ఈవిఎం లలోని వీవీ ప్యాట్లను లెక్కించాలని డిసైడ్ చేశారు.
ఈవీఎంల్లోని వివి ప్యాట్ స్లిప్పుల ఆధారంగా ఓట్లన లెక్కించారు. స్లిప్పులను లెక్కించిన తర్వాత కూడా మెజారిటి ఓట్లు బీజేపీకే పడటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అంటే ఇద్దరికీ పడిన ఓట్లను లెక్కించిన తర్వాత రఘునందనరావు పైనల్ మెజారిటి 1079 గా లెక్క తేలింది. ఆ తర్వాత ఎలక్షన్ కమీషన్ అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 1,98,807. ఇందులో పోలైన ఓట్లు 1,64,192. బీజేపీ అభ్యర్ధికి 63,352 ఓట్లు పోలయ్యాయి.
ఇక టీఆర్ఎస్ అభ్యర్ధికి 62,273. మూడో స్ధానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి చెఱకు శ్రీనివాసరెడ్డికి 22,196 ఓట్లొచ్చాయి. స్వతంత్ర అభ్యర్ధులుగా చాలామంది పోటి చేసిన బండారు నాగరాజు కు మాత్రం 3570 ఓట్లు పోలయ్యాయి. చివరగా నోటాకు కూడా 557 ఓట్లు రావటం ఆశ్చర్యం. బీజేపికి 38.47 శాతం ఓట్లొస్తే, టీఆర్ఎస్ కు 37.82 శాతం ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీ అభ్యర్ధి గెలిచింది కేవలం 0.7 ఓట్ల శాతం తేడాతోనే కావటం గమనార్హం.