Begin typing your search above and press return to search.
టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎం - వీవీ ఫ్యాట్స్
By: Tupaki Desk | 6 April 2021 11:20 AM GMTమొన్న అస్సాం ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తన కారులో ఈవీఎంలను పట్టుకోవడం పెను దుమారం రేపింది. అది మరిచిపోకముందే పశ్చిమ బెంగాల్ మూడో దశ పోలింగ్ వేళ అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.తాజాగా బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో ఈవీఎంలు బయటపడడం కలకలం రేపింది. హౌరా జిల్లా ఉలుబెరియాలో టీఎంసీ నేత గౌతమ్ ఘోష్ ఇంట్లో నాలుగు ఈవీఎంలు దర్శనమిచ్చాయి. ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని ఎన్నికల అధికారులకు సమాచారం అందించారు. అయితే ఈవీఎంలను చెక్ చేసిన అధికారులు.. అవి ఎన్నికల్లో ఉపయోగించినవి కాదని.. రిజర్వ్ లో ఉన్న ఈవీఎంలని గుర్తించారు. సెక్టార్ ఆఫీసర్ వీటిని తృణమూల్ నేత ఇంట్లో పెట్టినట్టు తెలిపారు.
తృణమూల్ నేత గౌతమ్ ఘోష్, తపన్ సర్కార్ కు బంధువు కావడంతో వారి ఇంట్లో రాత్రి నిద్రించేందుకు వచ్చారు. అయితే తనతోపాటు నాలుగు ఈవీఎంలు, వీవీ ప్యాడ్లు తీసుకెళ్లాడు. ఇది చట్టా రీత్యానేరం. స్టోర్ రూంలోనే భద్రపరచాలి. కానీ తపన్ తీసుకెళ్లడం నేరం కాబట్టి అతడిని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. అతడితోపాటు సెక్యూరిటీగా వెళ్లిన వారిని సస్పెండ్ చేశాడు. వీరికి జరిమానా విధించారు.
పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని ఎన్నికల అధికారులకు సమాచారం అందించారు. అయితే ఈవీఎంలను చెక్ చేసిన అధికారులు.. అవి ఎన్నికల్లో ఉపయోగించినవి కాదని.. రిజర్వ్ లో ఉన్న ఈవీఎంలని గుర్తించారు. సెక్టార్ ఆఫీసర్ వీటిని తృణమూల్ నేత ఇంట్లో పెట్టినట్టు తెలిపారు.
తృణమూల్ నేత గౌతమ్ ఘోష్, తపన్ సర్కార్ కు బంధువు కావడంతో వారి ఇంట్లో రాత్రి నిద్రించేందుకు వచ్చారు. అయితే తనతోపాటు నాలుగు ఈవీఎంలు, వీవీ ప్యాడ్లు తీసుకెళ్లాడు. ఇది చట్టా రీత్యానేరం. స్టోర్ రూంలోనే భద్రపరచాలి. కానీ తపన్ తీసుకెళ్లడం నేరం కాబట్టి అతడిని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. అతడితోపాటు సెక్యూరిటీగా వెళ్లిన వారిని సస్పెండ్ చేశాడు. వీరికి జరిమానా విధించారు.