Begin typing your search above and press return to search.
ప్రమాణస్వీకారం చేశాక విమర్శలకు ఫుల్ క్లారిటీ ఇస్తారట
By: Tupaki Desk | 17 March 2020 10:45 AM GMTగతంలో ఎప్పుడూ లేని (అవగాహన ఉన్నంత మేర) విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన వారు.. రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ కావటం తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా ఉన్న ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేస్తూ మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారటమే కాదు.. విపక్ష నేతలు పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాల్ని.. ఆరోపణల్ని సంధిస్తున్నారు.
మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మదన్ లోకూర్ సైతం రియాక్ట్ అయ్యారు. ఇలాంటివాటి కారణంగా న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బ తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజానికి ఆయన ఒక్కరే కాదు.. పలువురు న్యాయమూర్తులు సైతం ఈ అంశంపై భిన్నమైన అభిప్రాయంతో ఉన్నారు. ఇలాంటివి న్యాయవ్యవస్థకు ఉండే గౌరవాన్ని.. మర్యాదను తగ్గించే వీలుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అయితే.. ఇంత పెద్ద చర్చకు కారణమైన బీజేపీ విపక్షలు.. న్యాయ నిపుణుల విమర్శలపై మౌనంగా ఉంది. ఇక.. ఆరోపణలు.. విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మాత్రం తాజాగా రియాక్ట్ అయ్యారు. తనపై వస్తున్న ఆరోపణలకు తాను సమాధానం ఇస్తానని చెబుతున్నారు. అయితే.. తాను రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన తర్వాత తన మీద వస్తున్న ఆరోపణలకు తాను బదులిస్తానని చెప్పటం గమనార్హం.
మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా పలు కీలక కేసుల్లో తీర్పులు ఇచ్చినందుకే ఆయనకు రాజ్యసభకు నామినేట్ చేశారంటూ కాంగ్రెస్ తో సహా పలు పార్టీలు విమర్శలు చేస్తున్న వేళ.. గొగోయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంతకూ ఆయన ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చెప్పే అంశాలు ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మదన్ లోకూర్ సైతం రియాక్ట్ అయ్యారు. ఇలాంటివాటి కారణంగా న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బ తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజానికి ఆయన ఒక్కరే కాదు.. పలువురు న్యాయమూర్తులు సైతం ఈ అంశంపై భిన్నమైన అభిప్రాయంతో ఉన్నారు. ఇలాంటివి న్యాయవ్యవస్థకు ఉండే గౌరవాన్ని.. మర్యాదను తగ్గించే వీలుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అయితే.. ఇంత పెద్ద చర్చకు కారణమైన బీజేపీ విపక్షలు.. న్యాయ నిపుణుల విమర్శలపై మౌనంగా ఉంది. ఇక.. ఆరోపణలు.. విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మాత్రం తాజాగా రియాక్ట్ అయ్యారు. తనపై వస్తున్న ఆరోపణలకు తాను సమాధానం ఇస్తానని చెబుతున్నారు. అయితే.. తాను రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన తర్వాత తన మీద వస్తున్న ఆరోపణలకు తాను బదులిస్తానని చెప్పటం గమనార్హం.
మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా పలు కీలక కేసుల్లో తీర్పులు ఇచ్చినందుకే ఆయనకు రాజ్యసభకు నామినేట్ చేశారంటూ కాంగ్రెస్ తో సహా పలు పార్టీలు విమర్శలు చేస్తున్న వేళ.. గొగోయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంతకూ ఆయన ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చెప్పే అంశాలు ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.