Begin typing your search above and press return to search.
వాడుకోవడంలో కాంగ్రెస్ కి ముత్తాత బీజేపీ
By: Tupaki Desk | 18 March 2020 10:45 AM GMTఈ దేశంలో రాజకీయంగా సమస్త దరిద్రాలకు.. అరిష్టాలకు కేరాఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ ను వేలెత్తి చూపించే వాళ్లకు కొదవ లేదు. అయితే.. రాజకీయాల్ని ఒక స్థాయికి దిగజార్చే విషయంలో తమకు మించినోళ్లు వస్తారని కాంగ్రెస్ నేతలు కూడా ఎప్పుడూ ఆలోచించి ఉండరేమో? కానీ.. ఆ కొరతను తీర్చేస్తున్నారు నరేంద్రమోడీ అన్న ఘాటు విమర్శ గడిచిన రోజుగా పలువురి నోట వినిపిస్తోంది. ఎప్పుడైతే.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందో రాజకీయ వర్గాలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించి.. తర్వాతి కాలంలో వివిధ పదవులు చేపట్టిన వారు తక్కువేం కాదు.
అప్పుడెప్పుడో 1983లో జస్టిస్ జహరుల్ ఇస్లాం అనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన పదవికి రాజీనామా చేసి.. రాజ్యసభకు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి గెలిచారు. అక్కడిదాకా ఎందుకు రంగనాథ్ మిశ్రా పదవీ విరమణ చేసిన ఏడేళ్లకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు రాజ్యాసభకు టికెట్ ఇచ్చి.. ఎమ్మెల్యేల ద్వారా గెలిపించిన వైనాన్ని మర్చిపోలేం.
కాకుంటే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్న కీలక స్థానం నుంచి పదవీ విరమణ పొందిన అతి తక్కువ వ్యవధిలోనే రాజ్యసభకు ప్రభుత్వం నామినేట్ చేయటం ఇప్పుడుసంచలనంగా మారింది. న్యాయవ్యవస్థను కావాలనే భ్రష్టు పట్టించటానికి బీజేపీ కంకణం కట్టుకుందని కాంగ్రెస్ అరిచి గోల చేసినా.. ఇలాంటి సర్వ దరిద్రాలకు కారణం వారేనన్నది మర్చిపోకూడదు. కాకుంటే వారు ఇలాంటివి కాస్త మొహమాటంతో.. మరికాస్త భయంతో చేస్తే.. తాజాగా ప్రధాని మోడీ మాత్రం అలాంటివేమీ పట్టించుకోకుండా.. తాను చేయాల్సిన పనుల్ని.. చేయాల్సిన వేళలో చేసుకుంటూ పోతున్నారు. ఆ సమయంలో తన నిర్ణయాన్ని తప్పు పట్టే వారి వాదనను వినేందుకు ఏ మాత్రం ఆసక్తిని ప్రదర్శించరు.
తాజాగా రంజన్ ఎపిసోడ్ ను తీసుకోండి. విపక్షాలు అరిచి గీ పెడుతున్నాయి. కానీ.. తాను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్న విషయం.. నిన్నటి కమలనాథుల తీరును చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఇంతకీ ఎందుకింత ఆందోళన? ఎందుకింత సంచలనం? అంటే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి అంటే మామూలు విషయం కాకపోవటం.
ఆ స్థానంలో ఉన్న వారు రాష్ట్రపతి పదవికి ఎన్నికైన వ్యక్తితో ప్రమాణస్వీకారం చేయించే సమున్నత అధికార హోదా ఆ స్థానానికి సొంతం. అంతేకాదు.. అత్యున్నత స్థానం నుంచి రిటైర్ అయిన ఆయన.. రేపొద్దున రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న వేళ.. ఆయన పేరు ముందు గౌరవసూచకంగా వ్యవహరించే ‘జస్టిస్’ పదాన్ని తరచూ ప్రస్తావించాలా? లేదా? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. ఇలాంటి పరిస్థితిని రాజ్యాంగనిర్మాతలు ఊహించలేదేమో?
ఎందుకంటే.. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలన్నది రాజ్యంగం చెప్పకపోవటమే కారణం. దేశ అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ గా వ్యవహరించిన ఆయన.. పదవి నుంచి రిటైర్ అయిన నాలుగు నెలల్లోనే రాజ్యసభకు నామినేట్ కావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యవస్థల్ని తమకు తోచినట్లుగా మార్పులు చేర్పులు చేయటంలో ఘనమైన రికార్డు ఉన్న కాంగ్రెస్ లాంటి పార్టీలు సైతం మోడీ తాజాగా తీసుకున్న నిర్ణయానికి అవాక్కు అవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో మరెలాంటి పరిస్థితి ఉంటుందో? ఈ పరిణామాలన్ని చూస్తున్నప్పుడు అనిపించేది ఒక్కటే.. దేశంలో అత్యున్నత స్థానానికి ఉండాల్సిన మర్యాద..దక్కాల్సిన గౌరవం రాన్రాను తగ్గివటాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదేమో? ఇప్పటి వరకూ ఎవరైనా సరే వాడుకోవటం లో కాంగ్రెస్ పార్టీకి మించిన తోపులు లేరనే భావన మోడీ నిర్ణయాలు చూసినప్పుడు..వెంటనే తొలిగిపోవటం ఖాయం.
అప్పుడెప్పుడో 1983లో జస్టిస్ జహరుల్ ఇస్లాం అనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన పదవికి రాజీనామా చేసి.. రాజ్యసభకు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి గెలిచారు. అక్కడిదాకా ఎందుకు రంగనాథ్ మిశ్రా పదవీ విరమణ చేసిన ఏడేళ్లకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు రాజ్యాసభకు టికెట్ ఇచ్చి.. ఎమ్మెల్యేల ద్వారా గెలిపించిన వైనాన్ని మర్చిపోలేం.
కాకుంటే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్న కీలక స్థానం నుంచి పదవీ విరమణ పొందిన అతి తక్కువ వ్యవధిలోనే రాజ్యసభకు ప్రభుత్వం నామినేట్ చేయటం ఇప్పుడుసంచలనంగా మారింది. న్యాయవ్యవస్థను కావాలనే భ్రష్టు పట్టించటానికి బీజేపీ కంకణం కట్టుకుందని కాంగ్రెస్ అరిచి గోల చేసినా.. ఇలాంటి సర్వ దరిద్రాలకు కారణం వారేనన్నది మర్చిపోకూడదు. కాకుంటే వారు ఇలాంటివి కాస్త మొహమాటంతో.. మరికాస్త భయంతో చేస్తే.. తాజాగా ప్రధాని మోడీ మాత్రం అలాంటివేమీ పట్టించుకోకుండా.. తాను చేయాల్సిన పనుల్ని.. చేయాల్సిన వేళలో చేసుకుంటూ పోతున్నారు. ఆ సమయంలో తన నిర్ణయాన్ని తప్పు పట్టే వారి వాదనను వినేందుకు ఏ మాత్రం ఆసక్తిని ప్రదర్శించరు.
తాజాగా రంజన్ ఎపిసోడ్ ను తీసుకోండి. విపక్షాలు అరిచి గీ పెడుతున్నాయి. కానీ.. తాను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్న విషయం.. నిన్నటి కమలనాథుల తీరును చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఇంతకీ ఎందుకింత ఆందోళన? ఎందుకింత సంచలనం? అంటే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి అంటే మామూలు విషయం కాకపోవటం.
ఆ స్థానంలో ఉన్న వారు రాష్ట్రపతి పదవికి ఎన్నికైన వ్యక్తితో ప్రమాణస్వీకారం చేయించే సమున్నత అధికార హోదా ఆ స్థానానికి సొంతం. అంతేకాదు.. అత్యున్నత స్థానం నుంచి రిటైర్ అయిన ఆయన.. రేపొద్దున రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న వేళ.. ఆయన పేరు ముందు గౌరవసూచకంగా వ్యవహరించే ‘జస్టిస్’ పదాన్ని తరచూ ప్రస్తావించాలా? లేదా? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. ఇలాంటి పరిస్థితిని రాజ్యాంగనిర్మాతలు ఊహించలేదేమో?
ఎందుకంటే.. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలన్నది రాజ్యంగం చెప్పకపోవటమే కారణం. దేశ అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ గా వ్యవహరించిన ఆయన.. పదవి నుంచి రిటైర్ అయిన నాలుగు నెలల్లోనే రాజ్యసభకు నామినేట్ కావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యవస్థల్ని తమకు తోచినట్లుగా మార్పులు చేర్పులు చేయటంలో ఘనమైన రికార్డు ఉన్న కాంగ్రెస్ లాంటి పార్టీలు సైతం మోడీ తాజాగా తీసుకున్న నిర్ణయానికి అవాక్కు అవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో మరెలాంటి పరిస్థితి ఉంటుందో? ఈ పరిణామాలన్ని చూస్తున్నప్పుడు అనిపించేది ఒక్కటే.. దేశంలో అత్యున్నత స్థానానికి ఉండాల్సిన మర్యాద..దక్కాల్సిన గౌరవం రాన్రాను తగ్గివటాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదేమో? ఇప్పటి వరకూ ఎవరైనా సరే వాడుకోవటం లో కాంగ్రెస్ పార్టీకి మించిన తోపులు లేరనే భావన మోడీ నిర్ణయాలు చూసినప్పుడు..వెంటనే తొలిగిపోవటం ఖాయం.