Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలోకి: మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 2 Feb 2023 10:00 PM GMTఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా వర్సెస్ శిల్పా కుటుంబాల మధ్య రాజకీయం గురించి అందరికీ తెలి సిందే. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఇరు కుటుంబాల మద్య తరతరాలుగా ఉంది. ఇది ఇప్పటికీ కొన సాగుతోంది. ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా రవి చంద్రకిశోర్ కు ఆళ్లగడ్డ మా జీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు మధ్య పొలిటికల్ వివాదాలు కొన్నాళ్లుగా నడుస్తున్నా యి.
ఆళ్లగడ్డ, నంద్యాల రెండు నియోజకవర్గాలపైనా భూమా అఖిల ప్రియ కన్నేసిన విషయం తెలిసిందే. ఈ రెండు చోట్ల కూడా చక్రం తిప్పుతున్నారు. గత ఎన్నికల్లోనూ ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. అయితే... అనూహ్యంగా ఆమె, ఆమె చిన్నాన్న కుమారుడు, వరసకు సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి ఇద్దరూ కూడా ఓడిపోయారు. ఇక, నంద్యాల నుంచి గెలిచిన శిల్పా రవికి.. భూమా అఖిల ప్రియకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా భూమా శిల్పాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే శిల్పా రవిచంద్ర టీడీపీ బాట పడుతున్నారని.. ఆయన టీడీపీ నేతలకు టచ్లో ఉన్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే కనుక నిజమైతే.. వైసీపీకి ఇబ్బంది తప్పదనేది అఖిల ప్రియ మాట. ఇప్పటికే నెల్లూరు రగడ మరింత రాజుకుంది. నాయకుల మధ్య పంతాలు.. పట్టింపులతో సవాళ్ల రాజకీయం రోడ్డెక్కింది.
ఇలాంటి సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ ఇలాంటి తరహా రాజకీయాలే తెరమీదికి వస్తే.. ఇబ్బంది తప్పదని అంటున్నారు పరిశీలకులు. మరి నిజంగానే శిల్పాకు ఆ అవసరం ఏం వచ్చిందనేది ఇక్కడ గమనార్హం. నిజానికి గతంలో శిల్పా కుటుంబం టీడీపీలోనే ఉంది. 2014లో నంద్యాల నుంచి శిల్పా కుటుంబమే పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత జరిగిన రాజకీయ జంపింగుల్లో వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలోకి, టీడీపీలో ఉన్న శిల్పా ఫ్యామిలీ వైసీపీలోకి జంప్ చేశారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
ఆళ్లగడ్డ, నంద్యాల రెండు నియోజకవర్గాలపైనా భూమా అఖిల ప్రియ కన్నేసిన విషయం తెలిసిందే. ఈ రెండు చోట్ల కూడా చక్రం తిప్పుతున్నారు. గత ఎన్నికల్లోనూ ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. అయితే... అనూహ్యంగా ఆమె, ఆమె చిన్నాన్న కుమారుడు, వరసకు సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి ఇద్దరూ కూడా ఓడిపోయారు. ఇక, నంద్యాల నుంచి గెలిచిన శిల్పా రవికి.. భూమా అఖిల ప్రియకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా భూమా శిల్పాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే శిల్పా రవిచంద్ర టీడీపీ బాట పడుతున్నారని.. ఆయన టీడీపీ నేతలకు టచ్లో ఉన్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే కనుక నిజమైతే.. వైసీపీకి ఇబ్బంది తప్పదనేది అఖిల ప్రియ మాట. ఇప్పటికే నెల్లూరు రగడ మరింత రాజుకుంది. నాయకుల మధ్య పంతాలు.. పట్టింపులతో సవాళ్ల రాజకీయం రోడ్డెక్కింది.
ఇలాంటి సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ ఇలాంటి తరహా రాజకీయాలే తెరమీదికి వస్తే.. ఇబ్బంది తప్పదని అంటున్నారు పరిశీలకులు. మరి నిజంగానే శిల్పాకు ఆ అవసరం ఏం వచ్చిందనేది ఇక్కడ గమనార్హం. నిజానికి గతంలో శిల్పా కుటుంబం టీడీపీలోనే ఉంది. 2014లో నంద్యాల నుంచి శిల్పా కుటుంబమే పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత జరిగిన రాజకీయ జంపింగుల్లో వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలోకి, టీడీపీలో ఉన్న శిల్పా ఫ్యామిలీ వైసీపీలోకి జంప్ చేశారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.