Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు రేవంత్ టీం గుడ్ బై..ఇదే ఆధారం
By: Tupaki Desk | 15 Nov 2018 6:25 PM GMTకూటమి పేరుతో ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి.... ఎన్నికల ముందు వరకూ సర్కారుకు సారథ్యం వహించిన టీఆర్ ఎస్ పార్టీకి షాక్ ఇవ్వాలని యోచించిన కాంగ్రెస్ పార్టీకి తన సొంత పార్టీలోని పరిణామాలే చుక్కలు చూపిస్తున్నాయి. ఓ వైపు కూటమిలోని పార్టీలు దుమ్మెత్తిపోస్తూ కాంగ్రెస్ పెద్దన్న పాత్రపై విరుచుకుపడుతుంటే...మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రెబెల్స్ గా మారి సొంత పార్టీకే చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో రెబెల్స్ రచ్చరచ్చ చేస్తుండగా....తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బ్యాచ్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే యోచనలో ఉందనే వార్తలు చర్చనీయాంశంగా మారింది.
టికెట్ల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్లో కాక రేపుతున్న సంగతి తెలిసిందే. చేవెళ్ల చెల్లమ్మగా పేరొందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. మరోవైపు సికింద్రాబాద్ టికెట్ కోసం హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ఏకంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నివాసం ముందు ధర్నాకు దిగడం గమనార్హం. పొత్తుల వల్ల రాజకీయంగా తన గొంతు కోశారని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్యాచ్ కాంగ్రెస్కు చుక్కలు చూపించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకు ఆయన వర్గానికి చెందిన చెందిన నాయకులు బంజారాహిల్స్ లో రహస్యంగా సమావేశం అయ్యారనే వార్త ఆజ్యం పోస్తోంది. రేవంత్ వర్గానికి చెందిన మాజీ మంత్రి బోడ జనార్దన్ నేతృత్వంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారనే వార్త కాంగ్రెస్ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
కాగా, ఈ భేటీ గురించి బోడ జనార్దన్ స్పందిస్తూ తెలంగాణ కాంగ్ర్రెస్ పెద్దలు పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కారని - సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాశనానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో తామంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించామని బోడ జనార్దన్ తెలిపారు.ఎప్పటినుంచో పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా నిన్నకాక మొన్న పార్టీలో చేరి ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడాన్ని రేవంత్ బ్యాచ్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిర్పూర్ - చెన్నూరు - కోరుట్ల - ధర్మపురి నియోజకవర్గాల్లో కొత్తగా కాంగ్రెస్లో చేరిన వారికి టికెట్లు ఇవ్వడం బాధాకరమని అన్నారు. కాగా, రేవంత్ టీం కీలక నిర్ణయం తీసుకోనుందా? కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనుందా? అనే చర్చ జోరందుకుంది.
టికెట్ల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్లో కాక రేపుతున్న సంగతి తెలిసిందే. చేవెళ్ల చెల్లమ్మగా పేరొందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. మరోవైపు సికింద్రాబాద్ టికెట్ కోసం హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ఏకంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నివాసం ముందు ధర్నాకు దిగడం గమనార్హం. పొత్తుల వల్ల రాజకీయంగా తన గొంతు కోశారని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్యాచ్ కాంగ్రెస్కు చుక్కలు చూపించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకు ఆయన వర్గానికి చెందిన చెందిన నాయకులు బంజారాహిల్స్ లో రహస్యంగా సమావేశం అయ్యారనే వార్త ఆజ్యం పోస్తోంది. రేవంత్ వర్గానికి చెందిన మాజీ మంత్రి బోడ జనార్దన్ నేతృత్వంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారనే వార్త కాంగ్రెస్ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
కాగా, ఈ భేటీ గురించి బోడ జనార్దన్ స్పందిస్తూ తెలంగాణ కాంగ్ర్రెస్ పెద్దలు పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కారని - సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాశనానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో తామంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించామని బోడ జనార్దన్ తెలిపారు.ఎప్పటినుంచో పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా నిన్నకాక మొన్న పార్టీలో చేరి ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడాన్ని రేవంత్ బ్యాచ్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిర్పూర్ - చెన్నూరు - కోరుట్ల - ధర్మపురి నియోజకవర్గాల్లో కొత్తగా కాంగ్రెస్లో చేరిన వారికి టికెట్లు ఇవ్వడం బాధాకరమని అన్నారు. కాగా, రేవంత్ టీం కీలక నిర్ణయం తీసుకోనుందా? కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనుందా? అనే చర్చ జోరందుకుంది.