Begin typing your search above and press return to search.
టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్: మాజీ మంత్రి నారాయణకు సుప్రీంలో ఊరట
By: Tupaki Desk | 27 Feb 2023 6:54 PM GMTపదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు పొంగూరు నారాయణకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో హైకోర్టు రద్దు చేసిన బెయిల్ ఆదేశాలపై స్టే విధించింది. అంతేకాదు.. ఈ కేసు విచారణను సెషన్స్ కోర్టులోనూ.. తదుపరి హైకోర్టులోనూ కొనసాగించుకోవచ్చని తేల్చి చెప్పింది. అంతేకాదు.. అప్పటి వరకు కూడా నారాయణపై ఎలాంటి చర్యలూ తీసుకోరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో మాజీ మంత్రి నారాయణకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించినట్టు అయింది.
ఏం జరిగింది?
గత ఏడాది ఏపీలో నిర్వహించిన పదోతరగతి పరీక్షలకు సంబంధించి..చిత్తూరు జిల్లాలో ప్రశ్నపత్రం ఒకటి వాట్సాప్లో ముందుగానే బయటకు వచ్చింది. దీంతో ఆ పరీక్షను అధికారులు రద్దు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారించగా.. అది నారాయణ విద్యా సంస్థల నుంచే లీకైందని తేల్చారు. ఈ క్రమంలోనే గతేడాది హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్న నారాయణను పోలీసులు అక్కడే అరెస్టు చేసి రోడ్డు మార్గంలోనే చిత్తూరుకు తీసుకువచ్చారు. తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పినా వినలేదని.. తర్వాత ఆయన ఆరోపించారు.
ఇక, ఈ క్రమంలోనే ఆయన బెయిల్కు అప్లయి చేసుకోగా నారాయణకు చిత్తూరు జిల్లాలోని సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. పోలీసులు దీనిని సవాల్ చేస్తూ.. హైకోర్టుకువెళ్లారు. అక్కడ పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు నారాయణకు బెయిల్ రద్దు చేస్తూ రిమాండ్కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై నారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం నారాయణ బెయిల్పై బయట ఉన్నారు.
తాజాగా జరిగిన విచారణలో ఈ కేసుకు సంబంధించి సెషన్స్ కోర్టులోనే విచారణ చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. మెరిట్ ఆధారంగానే విచారణ కొనసాగించాలని సుప్రీం స్పష్టం చేసింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కల్పిస్తున్నామని... అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. నారాయణ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం ముగించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
ఏం జరిగింది?
గత ఏడాది ఏపీలో నిర్వహించిన పదోతరగతి పరీక్షలకు సంబంధించి..చిత్తూరు జిల్లాలో ప్రశ్నపత్రం ఒకటి వాట్సాప్లో ముందుగానే బయటకు వచ్చింది. దీంతో ఆ పరీక్షను అధికారులు రద్దు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారించగా.. అది నారాయణ విద్యా సంస్థల నుంచే లీకైందని తేల్చారు. ఈ క్రమంలోనే గతేడాది హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్న నారాయణను పోలీసులు అక్కడే అరెస్టు చేసి రోడ్డు మార్గంలోనే చిత్తూరుకు తీసుకువచ్చారు. తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పినా వినలేదని.. తర్వాత ఆయన ఆరోపించారు.
ఇక, ఈ క్రమంలోనే ఆయన బెయిల్కు అప్లయి చేసుకోగా నారాయణకు చిత్తూరు జిల్లాలోని సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. పోలీసులు దీనిని సవాల్ చేస్తూ.. హైకోర్టుకువెళ్లారు. అక్కడ పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు నారాయణకు బెయిల్ రద్దు చేస్తూ రిమాండ్కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై నారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం నారాయణ బెయిల్పై బయట ఉన్నారు.
తాజాగా జరిగిన విచారణలో ఈ కేసుకు సంబంధించి సెషన్స్ కోర్టులోనే విచారణ చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. మెరిట్ ఆధారంగానే విచారణ కొనసాగించాలని సుప్రీం స్పష్టం చేసింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కల్పిస్తున్నామని... అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. నారాయణ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం ముగించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.