Begin typing your search above and press return to search.
హైదరాబాద్ మేయర్ గా మాజీ ఎంపీ కవిత?
By: Tupaki Desk | 17 March 2020 1:05 PM GMTకల్వకుంట్ల కవిత....తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా - నిజామాబాద్ ఎంపీగా తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించిన మహిళా నాయకురాలు. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన వారిలో కవిత కూడా ఒకరు. టీఆర్ ఎస్ లో సీఎం కేసీఆర్ - కేటీఆర్ - హరీష్ రావుల తర్వాత కీలకమైన వ్యక్తి కవిత. అయితే, 2019 లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బరిలోకి దిగిన కవిత అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కవితను ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా చేసేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కవితను రాజ్యసభకు పంపుతున్నారని...ఊహాగానాలు వచ్చాయి. తాజాగా కేసీఆర్ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థులు జాబితాలో కవిత పేరు లేకపోవడంతో ఆ పుకార్లకు చెక్ పడింది. దీంతో, రాబోయే నాలుగేళ్ల పాటు కవిత సైలెంట్ గా ఉండి...2024 ఎన్నికల బరిలో దిగనుందని టాక్ వచ్చింది. అయితే, తాజాగా తన చెల్లెలు కవిత కోసం కేటీఆర్ ...ఓ పదవిని సిద్ధంగా ఉంచారని ప్రచారం జరుగుతోంది. మరో ఏడాదిలో జరగబోయే గ్రేటర్ మునిసిపల్ ఎన్నికల్లో కవిత పోటీ చేయబోతున్నారని - కవితను మేయర్ ను చేయాలని కేటీఆర్ భావిస్తున్నారని టాక్ వస్తోంది.
2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత రాజకీయ భవిష్యత్తు ఏంటనే దానిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. కవితను ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరిగింది. ఇప్పటికే కేసీఆర్ మంత్రివర్గంలో కేటీఆర్ - హరీశ్ రావు ఉండటంతో కుటుంబ కోటాలో కవితను తీసుకోవడం సరికాదని కేసీఆర్ సైలెంట్ అయ్యారని టాక్. ఇక, రాజ్యసభకు పంపేందుకు కూడా కుటుంబ పాలన అంటూ విమర్శలు వస్తాయని కేసీఆర్ గమ్మునున్నారట. దీంతో, త్వరలోనే కవితను పొలిటికల్ గా యాక్టివ్ చేసే బాధ్యతను కేటీఆర్ తీసుకున్నారట. హైదరాబాద్ మేయర్ పీఠంపై కవితను కూర్చోబెట్టాలని కేటీఆర్ స్కెచ్ వేశారట. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఘన విజయం సాధించింది. దీంతో, గ్రేటర్ ఎన్నికల్లో కూడా గులాబీ జెండా ఎగురుతుందని కేటీఆర్ ధీమాగా ఉన్నారట. దీంతో కవితను మేయర్ చేయాలని, ఆమెను అప్పటి వరకు సైలెంట్ గా ఉండమని కేటీఆర్ చెప్పారట. కవితను ఆ పదవిలో కూర్చోబెట్టి హైదరాబాద్ లో పట్టు పెంచుకుందామని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. దీనికి కవిత కూడా సుముఖంగానే ఉన్నారని అంటున్నారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు దీనిపై ప్రకటన చెయ్యాలని తండ్రీకొడుకులు భావిస్తున్నారట. ఇప్పటికే హైదరాబాద్ లో ఉండే కీలక నాయకులతో ఈ విషయంపై చర్చలు కూడా జరిపారట. మరి, ఎంపీగా చేసిన కవిత మేయర్ పదవి చేపడతారా లేదా...ఈ ప్రచారం కేవలం ప్రచారంగానే మిగిలిపోతుందా అన్నది తెలియాలంటే మరో ఏడాది వెయిట్ చేయక తప్పదు.
2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత రాజకీయ భవిష్యత్తు ఏంటనే దానిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. కవితను ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరిగింది. ఇప్పటికే కేసీఆర్ మంత్రివర్గంలో కేటీఆర్ - హరీశ్ రావు ఉండటంతో కుటుంబ కోటాలో కవితను తీసుకోవడం సరికాదని కేసీఆర్ సైలెంట్ అయ్యారని టాక్. ఇక, రాజ్యసభకు పంపేందుకు కూడా కుటుంబ పాలన అంటూ విమర్శలు వస్తాయని కేసీఆర్ గమ్మునున్నారట. దీంతో, త్వరలోనే కవితను పొలిటికల్ గా యాక్టివ్ చేసే బాధ్యతను కేటీఆర్ తీసుకున్నారట. హైదరాబాద్ మేయర్ పీఠంపై కవితను కూర్చోబెట్టాలని కేటీఆర్ స్కెచ్ వేశారట. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఘన విజయం సాధించింది. దీంతో, గ్రేటర్ ఎన్నికల్లో కూడా గులాబీ జెండా ఎగురుతుందని కేటీఆర్ ధీమాగా ఉన్నారట. దీంతో కవితను మేయర్ చేయాలని, ఆమెను అప్పటి వరకు సైలెంట్ గా ఉండమని కేటీఆర్ చెప్పారట. కవితను ఆ పదవిలో కూర్చోబెట్టి హైదరాబాద్ లో పట్టు పెంచుకుందామని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. దీనికి కవిత కూడా సుముఖంగానే ఉన్నారని అంటున్నారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు దీనిపై ప్రకటన చెయ్యాలని తండ్రీకొడుకులు భావిస్తున్నారట. ఇప్పటికే హైదరాబాద్ లో ఉండే కీలక నాయకులతో ఈ విషయంపై చర్చలు కూడా జరిపారట. మరి, ఎంపీగా చేసిన కవిత మేయర్ పదవి చేపడతారా లేదా...ఈ ప్రచారం కేవలం ప్రచారంగానే మిగిలిపోతుందా అన్నది తెలియాలంటే మరో ఏడాది వెయిట్ చేయక తప్పదు.