Begin typing your search above and press return to search.
దర్శనం కోసం గోడ దూకిన మాజీ డిప్యూటీ సీఎం
By: Tupaki Desk | 7 Feb 2020 9:30 AM GMTతెలంగాణ లో పండుగ వాతావరణం సంతరించుకుంది. మాఘ మాసంలో జరిగే మేడారం జాతర తెలంగాణ కుంభమేళ గా ప్రసిద్ధి చెందింది. నాలుగు రోజుల పాటు ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని మేడారం లో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆసియా ఖండంలోనే జరిగే అతి పెద్ద జాతర కు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, కర్నాటకతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో మేడారం ప్రాంతం ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. సారలమ్మ, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం భక్తులు తండాపోతండాలుగా వస్తూ దర్శించుకుంటున్నారు.
గద్దెలపై దేవరలు కొలువుదీరడంతో శుక్రవారం భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అమ్మలను, అయ్యలను దర్శించుకోవడానికి ఆదివాసీలతో పాటు సాధారణ ప్రజలు తరలివచ్చారు. అందరూ కొలువై ఉండడంతో ప్రముఖులు కూడా దర్శించుకునేందుకు పోటెత్తారు. అయితే జనాల తాకిడితో ప్రముఖులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పటిష్ట బందోబస్తు, కిలోమీటర్ల దర్శనం కోసం క్యూలు ఉండడంతో సాధారణ భక్తులతో పాటు వీఐపీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో వీటి నుంచి తప్పించుకుని ఏకంగా గోడ దూకి అమ్మవార్లను మాజీ ఉప ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. ఆయనే తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీ హరి. ఉమ్మడి వరంగల్ జిల్లాకే చెందిన వ్యక్తి, గతం లో ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నోసార్లు మేడారం జాతర ఉత్సవాలు జరిగాయి. అయితే ఇప్పుడు భక్తుల రద్దీ తీవ్రంగా ఉండడం తో అమ్మ వార్లను దర్శించుకోవడమే ధ్యేయంగా ఏకంగా ఆయన గోడ దూకి సమ్మక్కను దర్శించుకున్నారు. దీంతో అక్కడున్న వారందరూ అవాక్కయ్యారు.
గద్దెలపై దేవరలు కొలువుదీరడంతో శుక్రవారం భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అమ్మలను, అయ్యలను దర్శించుకోవడానికి ఆదివాసీలతో పాటు సాధారణ ప్రజలు తరలివచ్చారు. అందరూ కొలువై ఉండడంతో ప్రముఖులు కూడా దర్శించుకునేందుకు పోటెత్తారు. అయితే జనాల తాకిడితో ప్రముఖులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పటిష్ట బందోబస్తు, కిలోమీటర్ల దర్శనం కోసం క్యూలు ఉండడంతో సాధారణ భక్తులతో పాటు వీఐపీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో వీటి నుంచి తప్పించుకుని ఏకంగా గోడ దూకి అమ్మవార్లను మాజీ ఉప ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. ఆయనే తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీ హరి. ఉమ్మడి వరంగల్ జిల్లాకే చెందిన వ్యక్తి, గతం లో ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నోసార్లు మేడారం జాతర ఉత్సవాలు జరిగాయి. అయితే ఇప్పుడు భక్తుల రద్దీ తీవ్రంగా ఉండడం తో అమ్మ వార్లను దర్శించుకోవడమే ధ్యేయంగా ఏకంగా ఆయన గోడ దూకి సమ్మక్కను దర్శించుకున్నారు. దీంతో అక్కడున్న వారందరూ అవాక్కయ్యారు.