Begin typing your search above and press return to search.
చెప్పులు కుట్టి నిరసన తెలిపిన మంత్రి
By: Tupaki Desk | 1 July 2017 10:21 AM GMTమాదిగ రిజర్వేషన్ అంశం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దళితుల వర్గీకరణ చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తన రెండో దశ పోరాటానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్కు అన్ని పార్టీల మద్దతును కోరుతున్న మందకృష్ణ గతంలో తమ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ప్రత్యేక ఒత్తిడి తెస్తున్నారు. ఎన్నికల సమయంలో వర్గీకరణకు మద్దతు ఇచ్చి తాను పెద్దమాదిగ వలే మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పుతున్నారని ఆరోపిస్తున్న మందకృష్ణ ఈ క్రమంలో నిరసనకు దిగారు. తన సత్తా చాటేందుకు జూలై 7న అమరావతిలో జరగనున్న మాదిగల కురుక్షేత్ర మహాసభకు శ్రీకారం చుట్టారు.
ఈ నేపథ్యంలో మందకృష్ణకు తీరుకు నిరసనగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ రంగంలోకి దిగారు. వినూత్నశైలిలో మందకృష్ణకు నిరసన తెలిపారు. ఏలూరు పాత బస్టాండ్ సమీపంలో చెప్పులు కుట్టి మందకృష్ణ వైఖరిపై మండిపడ్డారు. దళితుల మధ్య చిచ్చు పెడుతున్న మందకృష్ణ మాదిగ తీరుకు నిరసనగా తాను ఈ చర్య చేపట్టినట్లు మంత్రి కేఎస్ జవహర్ తెలిపారు. తన మనుగడ కోసం అన్నదమ్ముల వలే కలిసి ఉన్న దళితుల మధ్య చిచ్చుపెట్టడం మందకృష్ణకు సరికాదని మండిపడ్డారు. కాగా, అనంతరం వనం-మనం కార్యాలక్రమంలో భాగంగా ఏలూరులో వనమహోత్సవం కార్యక్రమంలో సహచర మంత్రులు మాణిక్యాలరావు - పితాని సత్యనారాయణతో కలిసి మంత్రి జవహర్ పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలు నాటడం - వాటిని సంరక్షించడం వల్ల మన తరంతో పాటు భవిష్యత్ తరాలు బాగుంటాయని తెలిపారు.
ఇదిలాఉండగా... ఎస్సీ వర్గీకరణకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మద్దతు కోరుతున్న ఎంఆర్ పీఎస్ నేత మందకృష్ణ సైతం వినూత్న రీతిలో ముందుకు సాగుతున్నారు. మాదిగల కురుక్షేత్ర సభను విజయవంతం చేయాలని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తూ కృష్ణాజిల్లాలోని పలు దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరోమాట మాట్లాడుతున్నారని మందకృష్ణ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మాదిగల పెద్ద కొడుకును అవుతానని మాదిగల డప్పుకొట్టి మరీ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయకుండా తాత్సారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. డప్పు కొట్టి మరీ ఇచ్చిన హామీని వదిలేశారేమని ప్రశ్నించారు. తన సత్తా చాటేందుకు జూలై 7న అమరావతిలో జరగనున్న మాదిగల కురుక్షేత్ర మహాసభకు శ్రీకారం చుట్టామని మందకృష్ణ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
ఈ నేపథ్యంలో మందకృష్ణకు తీరుకు నిరసనగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ రంగంలోకి దిగారు. వినూత్నశైలిలో మందకృష్ణకు నిరసన తెలిపారు. ఏలూరు పాత బస్టాండ్ సమీపంలో చెప్పులు కుట్టి మందకృష్ణ వైఖరిపై మండిపడ్డారు. దళితుల మధ్య చిచ్చు పెడుతున్న మందకృష్ణ మాదిగ తీరుకు నిరసనగా తాను ఈ చర్య చేపట్టినట్లు మంత్రి కేఎస్ జవహర్ తెలిపారు. తన మనుగడ కోసం అన్నదమ్ముల వలే కలిసి ఉన్న దళితుల మధ్య చిచ్చుపెట్టడం మందకృష్ణకు సరికాదని మండిపడ్డారు. కాగా, అనంతరం వనం-మనం కార్యాలక్రమంలో భాగంగా ఏలూరులో వనమహోత్సవం కార్యక్రమంలో సహచర మంత్రులు మాణిక్యాలరావు - పితాని సత్యనారాయణతో కలిసి మంత్రి జవహర్ పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలు నాటడం - వాటిని సంరక్షించడం వల్ల మన తరంతో పాటు భవిష్యత్ తరాలు బాగుంటాయని తెలిపారు.
ఇదిలాఉండగా... ఎస్సీ వర్గీకరణకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మద్దతు కోరుతున్న ఎంఆర్ పీఎస్ నేత మందకృష్ణ సైతం వినూత్న రీతిలో ముందుకు సాగుతున్నారు. మాదిగల కురుక్షేత్ర సభను విజయవంతం చేయాలని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తూ కృష్ణాజిల్లాలోని పలు దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరోమాట మాట్లాడుతున్నారని మందకృష్ణ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మాదిగల పెద్ద కొడుకును అవుతానని మాదిగల డప్పుకొట్టి మరీ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయకుండా తాత్సారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. డప్పు కొట్టి మరీ ఇచ్చిన హామీని వదిలేశారేమని ప్రశ్నించారు. తన సత్తా చాటేందుకు జూలై 7న అమరావతిలో జరగనున్న మాదిగల కురుక్షేత్ర మహాసభకు శ్రీకారం చుట్టామని మందకృష్ణ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/