Begin typing your search above and press return to search.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రద్దు పిటీషన్ తీర్పుపై ఉత్కంఠ
By: Tupaki Desk | 7 April 2021 5:30 PM GMTఏపీలో అధికారంలో ఉన్న జగన్ పార్టీ 'వైఎస్ఆర్ సీపీ' గుర్తింపు రద్దు చేయాలంటూ గతంలో ఢిల్లీ హైకోర్టులో పిటీషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. సీఎం జగన్ నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పేరును వాడకుండా చూడాలని.. 'వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ భాషా' దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ కేసులో జగన్ వైసీపీ పార్టీ ని రద్దు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు ఇతరులు వాడకుండా చూడాలని పిటీషనర్ తరుఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరును ఎన్నికల సంఘం తమకు కేటాయించిందని.. దానిని ఇతరులు వినియోగించడానికి వీల్లేదని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
తమకు కేటాయించిన పేరును వైసీపీ వాడుకోవటం వల్ల తమ పార్టీకి నష్టం వాటిల్లుతుంది అంటూ మహబూబ్ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు . ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వైఎస్సార్ పేరును వాడుకుంటున్నారని అన్నారు.అయితే వైఎస్ఆర్ పేరును వాడుకోవడానికి తమకు హక్కు ఉందని జగన్ తరుఫున న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ తీర్పునిస్తుందన్న ఉత్కంఠ అందరిలో ఉంది.
ఈ కేసులో జగన్ వైసీపీ పార్టీ ని రద్దు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు ఇతరులు వాడకుండా చూడాలని పిటీషనర్ తరుఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరును ఎన్నికల సంఘం తమకు కేటాయించిందని.. దానిని ఇతరులు వినియోగించడానికి వీల్లేదని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
తమకు కేటాయించిన పేరును వైసీపీ వాడుకోవటం వల్ల తమ పార్టీకి నష్టం వాటిల్లుతుంది అంటూ మహబూబ్ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు . ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వైఎస్సార్ పేరును వాడుకుంటున్నారని అన్నారు.అయితే వైఎస్ఆర్ పేరును వాడుకోవడానికి తమకు హక్కు ఉందని జగన్ తరుఫున న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ తీర్పునిస్తుందన్న ఉత్కంఠ అందరిలో ఉంది.