Begin typing your search above and press return to search.
ఇక్కడా..అక్కడా రెండుచోట్ల ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్? ఎందుకు?
By: Tupaki Desk | 11 Nov 2020 4:30 AM GMTఓవైపు అమెరికాలో.. మరోవైపు బిహార్ లో.. ఇంకోవైపు దేశంలోని పదకొండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో తొలుత అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాలు వచ్చాయి. కాస్త ఆలస్యంగా నిన్నమొదలైన ఓట్ల లెక్కింపుసాయంత్రానికి లెక్క తేలిపోయింది. అయితే.. ఈ ఎన్నికల ఫలితాల్ని చూసినప్పుడు ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమయ్యే విషయం ఒక్కటే. అమెరికాలో ఎగ్జిట్ పోల్స్ ఓటర్ల మైండ్ సెట్ ను ప్రతిబింబించేలా ఉంటే.. మన దేశంలో జరిగిన ఎన్నికల విషయంలో విజేతల్ని గుర్తించే విషయంలో ఎగ్జిట్ పోల్స్ తప్పులో కాలేశాయని చెప్పక తప్పదు.
ముఖ్యంగా బిహార్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన మీడియా సంస్థల్లో ఏబీపీ న్యూస్ మాత్రమే దగ్గరకు వచ్చింది. ఆ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీయేకు104-128 సీట్లువస్తాయని అంచనా వేసింది. అదే సమయంలో మహాకూటమికి 108-131 సీట్లు వస్తాయని పేర్కొంది. రెండింటిలోనూ మహాకూటమికే గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా చెప్పాయి. అంతేకాదు.. ఎన్డీయే విజయం సాధిస్తుందన్న విషయాన్ని చెప్పలేకపోయాయి. కాకుంటే.. మిగిలిన వారితో పోలిస్తే.. వీరి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని చెప్పాలి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్న విషయాన్ని చెప్పిన ఎగ్జిట్ పోల్స్.. బిహార్ ఎన్నికల్లో ఎందుకు చెప్పలేకపోయాయి? అంటే.. గ్రౌండ్ లెవెల్లో సరిగా పని చేయకపోవటం.. శాస్త్రీయంగా విశ్లేషించే విషయంలో జరుగుతున్న పొరపాట్లుగా చెప్పక తప్పదు. ఇందుకు ఉదాహరణగా తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంగా చెప్పొచ్చు. మొనగాడు మీడియా సంస్థలు సైతం దుబ్బాకలో గెలిచేది టీఆర్ఎస్సేనని.. కనాకష్టంగా అయితే పాతిక వేల మెజార్టీ తగ్గదని అంచనా వేశారు. కానీ.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.
ఎందుకిలా అన్న విషయాన్ని చూస్తే.. గ్రౌండ్ లెవెల్లో పని చేసే వారు లేకపోవటం.. స్థానిక నెట్ వర్క నుంచి వచ్చే సమాచారం ఆధారంగా చేసుకొని ఏసీ రూముల్లో ఫలితంపై ఒక అంచనాకు రావటమే కారణంగా చెప్పొచ్చు. ఇలాంటి తీరు మీడియా సంస్థలకు.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించే వారికి రానున్న రోజుల్లో సవాలుగా మారుతుందని చెప్పక తప్పదు. దుబ్బాక ఫలితంలో వచ్చిన తేడాతో అయినా.. తాము చేస్తున్న తప్పులపై మీడియా సంస్థలు.. సర్వే సంస్థలు కళ్లు తెరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా బిహార్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన మీడియా సంస్థల్లో ఏబీపీ న్యూస్ మాత్రమే దగ్గరకు వచ్చింది. ఆ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీయేకు104-128 సీట్లువస్తాయని అంచనా వేసింది. అదే సమయంలో మహాకూటమికి 108-131 సీట్లు వస్తాయని పేర్కొంది. రెండింటిలోనూ మహాకూటమికే గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా చెప్పాయి. అంతేకాదు.. ఎన్డీయే విజయం సాధిస్తుందన్న విషయాన్ని చెప్పలేకపోయాయి. కాకుంటే.. మిగిలిన వారితో పోలిస్తే.. వీరి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని చెప్పాలి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్న విషయాన్ని చెప్పిన ఎగ్జిట్ పోల్స్.. బిహార్ ఎన్నికల్లో ఎందుకు చెప్పలేకపోయాయి? అంటే.. గ్రౌండ్ లెవెల్లో సరిగా పని చేయకపోవటం.. శాస్త్రీయంగా విశ్లేషించే విషయంలో జరుగుతున్న పొరపాట్లుగా చెప్పక తప్పదు. ఇందుకు ఉదాహరణగా తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంగా చెప్పొచ్చు. మొనగాడు మీడియా సంస్థలు సైతం దుబ్బాకలో గెలిచేది టీఆర్ఎస్సేనని.. కనాకష్టంగా అయితే పాతిక వేల మెజార్టీ తగ్గదని అంచనా వేశారు. కానీ.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.
ఎందుకిలా అన్న విషయాన్ని చూస్తే.. గ్రౌండ్ లెవెల్లో పని చేసే వారు లేకపోవటం.. స్థానిక నెట్ వర్క నుంచి వచ్చే సమాచారం ఆధారంగా చేసుకొని ఏసీ రూముల్లో ఫలితంపై ఒక అంచనాకు రావటమే కారణంగా చెప్పొచ్చు. ఇలాంటి తీరు మీడియా సంస్థలకు.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించే వారికి రానున్న రోజుల్లో సవాలుగా మారుతుందని చెప్పక తప్పదు. దుబ్బాక ఫలితంలో వచ్చిన తేడాతో అయినా.. తాము చేస్తున్న తప్పులపై మీడియా సంస్థలు.. సర్వే సంస్థలు కళ్లు తెరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.