Begin typing your search above and press return to search.
కోవిడ్ టైంలో నిద్రలేమిపై నిపుణుల మాట!
By: Tupaki Desk | 13 Feb 2022 4:30 PM GMTప్రస్తుతం చాలా మందిని వేధించే సమస్య ఒకటే నిద్ర. గతంలో లాగా కంటి నిండా నిద్ర పోయే దానికి చాలా మంది కష్టపడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తే కూడా సుఖమైన నిద్ర పట్టడం లేదు. కరోనా వచ్చిన తర్వాత నిద్రలేమి సమస్యను ఎదుర్కొనే వారికి సంఖ్య మరింత పెరిగింది. ఇలా కంటి నిండా నిద్ర పోనివారికి డిప్రెషన్ సమస్యలు వేధించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
మరో వైపు యాంగ్జైటీకి సంబంధించిన సమస్యలకు కూడా నిద్ర లేమి కారణం అవుతుంది చెప్తున్నారు. సాధారణంగా చేసే ఉద్యోగల ప్రకారం... అంటే షిప్టు సిస్టమ్ ను అనుసరించి చాలా మందికి నిద్ర అనేది తక్కువ పడుతుంది. వారు ఎక్కువగా నిద్రపోవడం కూడా ఉండదు. సమయానికి తిండి లేక కూడా ఇబ్బంది పడతారు. కానీ ఎలాంటివి ఉన్నా కానీ కచ్చితంగా శరీరానికి సంబంధించి తగిన నిద్రను పోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే అనారోగ్య తలెత్తే అవకాశం ఉందని చెప్తున్నారు.
సాధారణంగా నెలలో రెండు లేదా మూడు రోజులు నిద్ర సమస్యలు ఉంటే ఓకే కాని అంతకు మించి ఎక్కువ రోజులు ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రోజు ఇలాంటి సమస్య ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం అని సూచిస్తున్నారు. సాధారణం వైద్యుల వద్ద అందుకు సంబంధించిన ఉత్తమ చికిత్స దొరకపోతే వెంటనే సైకాలజిస్ట్ కు చూపించుకోవాలి అంటున్నారు. కోవిడ్ కారణంగా చాలా మందిని నిద్ర లేమి సమస్యలు వెంటాడుతున్నాయని అందులో భాగంగానే తక్కువ నిద్రపోతున్నారని చెప్తున్నారు.
కరోనా వచ్చిన నాటి నుంచి చాలా మంది ఇంటికి పరిమితం అయ్యారు. ఈ క్రమంలో చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు. ఇదే నిద్ర లేమికి కారణం అవుతుందని సైక్రియార్టిస్ట్ చెప్తున్నారు. చాలా అధ్యయనాల్లో ఇదే విషయం తేలిందని గుర్తు చేశారు. మన జీవితంలో ఉండే అనేక ఒత్తిళ్లు, ఆందోళనలు మనకు నిద్రని దూరం చేస్తాయి. దీంతో దీర్ఘాలోచనలు మొదలవుతాయి. చివరకు ఇవి అనారోగ్యానికి కారణం అవుతాయిని వైద్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా కోవిడ్ వచ్చిన వారిలో నిద్రలేమి అనేది మానసిక సమస్యగా మారిందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తి చేశారు. పోస్ట్ కోవిడ్ లక్షణాల్లో నిద్రలేమి కూడా ఒకటి అని చెప్తున్నారు. సాధారణ మానవునికి సంబంధించిన కనీసం రోజుకు 8 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం సగటు మానవుడు 6 నుంచి 7 గంటల వరకు మాత్రమే బొజ్జుంటున్నాడు.
కోవిడ్ వచ్చిన వారిలో కానీ, ఇతర మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు అయితే మరీ నాలుగు నుంచి మూడు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. ఇది ఆరోగ్యానికి కచ్చితంగా మంచిది కాదని నిపుణుల వాదన. ఇలా జరగడం వల్ల నిద్ర చక్రంలో మార్పులు వస్తాయని.. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో కూడా నిద్ర సమస్యలు ఎక్కువ అవుతాయని పేర్కొన్నారు. నిద్ర లేమిపై ఎప్పటికప్పుడు డాక్టర్ను సంప్రదించడం ఉత్తమమైన పని చెబుతున్నారు నిపుణులు.
నిద్ర లేమి వల్ల చాలా దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. నిద్ర తక్కువ పోయే వారిలో జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. పని చేసే సామర్థ్యం క్రమక్రమంగా క్షీణిస్తుంది. మరి కొంత మందిలో బరువు అమాంత పెరుగుతారు. అందుకే సుఖమైన నిద్ర కోసం కొన్ని పద్ధతులు ఫాలో కావాల్సి ఉంటుంది. నిద్రపోయే ముందు అంటే సరిగ్గా రెండు గంటల ముందు టీ తాగడం పెట్టుకోకూడదు.
ఇదే నియమం కాఫీకి కూడా వర్తిస్తుంది. అంతేగాకుండా ఫోన్ లను, ల్యాప్ టాప్ లను ఉపయోగించడం కూడా తగ్గించాలి. నిద్రపోవడం లేటు అవుతుందని అనిపిస్తే వీలైన వరకు నడవడం ప్రారంభించండి. కొంత సేపటి తర్వాత నిద్ర అదే వస్తుంది. దీనితోపాటు రాత్రిపూట ఆహారాన్ని లైట్ గా తీసుకుంటే చాలా నిద్ర చాలా బాగా వస్తుందని చెబుతున్నారు నిపుణులు.
మరో వైపు యాంగ్జైటీకి సంబంధించిన సమస్యలకు కూడా నిద్ర లేమి కారణం అవుతుంది చెప్తున్నారు. సాధారణంగా చేసే ఉద్యోగల ప్రకారం... అంటే షిప్టు సిస్టమ్ ను అనుసరించి చాలా మందికి నిద్ర అనేది తక్కువ పడుతుంది. వారు ఎక్కువగా నిద్రపోవడం కూడా ఉండదు. సమయానికి తిండి లేక కూడా ఇబ్బంది పడతారు. కానీ ఎలాంటివి ఉన్నా కానీ కచ్చితంగా శరీరానికి సంబంధించి తగిన నిద్రను పోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే అనారోగ్య తలెత్తే అవకాశం ఉందని చెప్తున్నారు.
సాధారణంగా నెలలో రెండు లేదా మూడు రోజులు నిద్ర సమస్యలు ఉంటే ఓకే కాని అంతకు మించి ఎక్కువ రోజులు ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రోజు ఇలాంటి సమస్య ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం అని సూచిస్తున్నారు. సాధారణం వైద్యుల వద్ద అందుకు సంబంధించిన ఉత్తమ చికిత్స దొరకపోతే వెంటనే సైకాలజిస్ట్ కు చూపించుకోవాలి అంటున్నారు. కోవిడ్ కారణంగా చాలా మందిని నిద్ర లేమి సమస్యలు వెంటాడుతున్నాయని అందులో భాగంగానే తక్కువ నిద్రపోతున్నారని చెప్తున్నారు.
కరోనా వచ్చిన నాటి నుంచి చాలా మంది ఇంటికి పరిమితం అయ్యారు. ఈ క్రమంలో చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు. ఇదే నిద్ర లేమికి కారణం అవుతుందని సైక్రియార్టిస్ట్ చెప్తున్నారు. చాలా అధ్యయనాల్లో ఇదే విషయం తేలిందని గుర్తు చేశారు. మన జీవితంలో ఉండే అనేక ఒత్తిళ్లు, ఆందోళనలు మనకు నిద్రని దూరం చేస్తాయి. దీంతో దీర్ఘాలోచనలు మొదలవుతాయి. చివరకు ఇవి అనారోగ్యానికి కారణం అవుతాయిని వైద్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా కోవిడ్ వచ్చిన వారిలో నిద్రలేమి అనేది మానసిక సమస్యగా మారిందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తి చేశారు. పోస్ట్ కోవిడ్ లక్షణాల్లో నిద్రలేమి కూడా ఒకటి అని చెప్తున్నారు. సాధారణ మానవునికి సంబంధించిన కనీసం రోజుకు 8 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం సగటు మానవుడు 6 నుంచి 7 గంటల వరకు మాత్రమే బొజ్జుంటున్నాడు.
కోవిడ్ వచ్చిన వారిలో కానీ, ఇతర మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు అయితే మరీ నాలుగు నుంచి మూడు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. ఇది ఆరోగ్యానికి కచ్చితంగా మంచిది కాదని నిపుణుల వాదన. ఇలా జరగడం వల్ల నిద్ర చక్రంలో మార్పులు వస్తాయని.. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో కూడా నిద్ర సమస్యలు ఎక్కువ అవుతాయని పేర్కొన్నారు. నిద్ర లేమిపై ఎప్పటికప్పుడు డాక్టర్ను సంప్రదించడం ఉత్తమమైన పని చెబుతున్నారు నిపుణులు.
నిద్ర లేమి వల్ల చాలా దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. నిద్ర తక్కువ పోయే వారిలో జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. పని చేసే సామర్థ్యం క్రమక్రమంగా క్షీణిస్తుంది. మరి కొంత మందిలో బరువు అమాంత పెరుగుతారు. అందుకే సుఖమైన నిద్ర కోసం కొన్ని పద్ధతులు ఫాలో కావాల్సి ఉంటుంది. నిద్రపోయే ముందు అంటే సరిగ్గా రెండు గంటల ముందు టీ తాగడం పెట్టుకోకూడదు.
ఇదే నియమం కాఫీకి కూడా వర్తిస్తుంది. అంతేగాకుండా ఫోన్ లను, ల్యాప్ టాప్ లను ఉపయోగించడం కూడా తగ్గించాలి. నిద్రపోవడం లేటు అవుతుందని అనిపిస్తే వీలైన వరకు నడవడం ప్రారంభించండి. కొంత సేపటి తర్వాత నిద్ర అదే వస్తుంది. దీనితోపాటు రాత్రిపూట ఆహారాన్ని లైట్ గా తీసుకుంటే చాలా నిద్ర చాలా బాగా వస్తుందని చెబుతున్నారు నిపుణులు.