Begin typing your search above and press return to search.
సుఖ సంసారానికి బట్టలు కాదు.. మనసు విప్పండి: నిపుణుల మాట
By: Tupaki Desk | 24 May 2023 10:00 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత రెండు వారాల్లో చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే.. పండంటి కాపురాలను ఛిద్రం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. భార్య భర్తను అనుమానించడం.. లేదా..భర్తకు భార్యపై పెనుభూతం ఆవహించడం వంటివి కుటుంబ బంధాలను నాశనం చేసి.. ఏకంగా హత్యలు చేసుకునే వరకు వెళ్లింది. ఫలితంగా.. వారి పిల్లలు.. ముఖ్యంగా చిన్నారులు అనాథలుగా మారే పరిస్థితి వచ్చింది. మరి దీనికి కారణం ఏంటి? సుఖ సంసారంలో చిచ్చు పెడుతున్నవి ఏమిటి? అనేది ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది.
ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలులో సాఫ్ట్వేర్ ఉద్యోగి రాధను ఆమె భర్త మోహన్రెడ్డి దారుణంగా.. హత మార్చడం ప్రతి ఒక్కరినీ నివ్వెర పాటుకు గురిచేసింది. అదేవిధంగా తెలంగాణలోని మహబూబ్ నగర్ లో.. కట్టుకున్న భర్తను భార్య.. తన ప్రియుడితో కలిసి అత్యంత పాశవికంగా హతమార్చింది. ఈ రెండు ఘటనలు.. ఈ వారంలో చోటు చేసుకున్న అతి పెద్ద ఘటనలుగా పోలీసుల రికార్డులకు ఎక్కాయి. ఈ రెండు కేసుల్లోనూ కామన్ ఫ్యాక్టర్.. 'సుఖ సంసారం' లేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు.
ఒంగోలు కేసులో రాధ, మోహన్రెడ్డిలు ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. బాగానే ఆర్జిస్తున్నవారే. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఉద్యోగాల హడావుడి, సంపాదన జోరులో పడి.. వారి కాపురం.. ఏదో యాదృచ్ ఛికంగా మారిపోయింది. ఫలితంగా.. చిన్నపాటి ఫోన్ చాటింగ్ పెద్ద అనుమానానికి దారితీసి.. ఏకంగా శత మానంభవతి అంటూ.. ఏడడుగులు వేసి మూడు ముడులతో బంధాన్ని అల్లుకున్న భార్యను దారుణంగా హతమార్చే పరిస్థితి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.
ఇక, మహబూబ్నగర్ ఘటనలో.. ఆ ఇల్లాలికి అప్పటికే ఐదుగురు సంతానం. భర్త వ్యాపారి. అయితే.. పిల్లల పోషణం.. వ్యాపకాలు కుటుంబంలో పడి ఆయన భార్యను 'నిర్లక్ష్యం' చేశాడు. అంతే.. పొరుగువాడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇది.. ప్రేమగా మారి..ఏకంగా ఐదుగురు పిల్లలను వదిలేసి ఉడాయించే శారు. అనంతర పరిణామాలతో భర్త నుంచి గండం ఉందని గుర్తించిన భార్య నమ్మకంగా తిరిగి వచ్చి.. మరునాడు ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించింది.
మొత్తంగా ఈ రెండు ఘటనల్లో ఒకటే పెద్ద ఎత్తున చర్చకు వచ్చినా.. రెండోది కూడా అంతే తీవ్రతతో కూడుకున్న ఘటన. అయితే. ఈ పరిణామాలను విశ్లేషిస్తే. భార్యా భర్తల మధ్య ఉండాల్సిన బంధంలో పస తగ్గుతోందని మానసిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ''భార్య భర్త పక్క పక్కన కూర్చుని మాట్లాడుకోవడం.. అభిప్రాయాలు పంచుకోవడం.. ఒకరిపై ఒకరు ప్రేమను పంచుకోవడం ఒక దశలో సంసారానికి అత్యంత కీలకం.
కేవలం శృంగారమే కాపురాలను డామినేట్ చేయదు. మనసు ముఖ్యం. నేడు సెల్ ఫోన్ల ప్రభావం, ఇంటర్నెట్ ప్రభావం.. కారణంగా.. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని లైట్గా తీసుకుంటున్నారు. ఫలితంగా బంధాల్లో బీటలు ఏర్పడి.. సంసారాలు కూల్చుకునే పరిస్థితి వస్తోంది.'' అని నిపుణులు చెబుతున్నారు.
ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలులో సాఫ్ట్వేర్ ఉద్యోగి రాధను ఆమె భర్త మోహన్రెడ్డి దారుణంగా.. హత మార్చడం ప్రతి ఒక్కరినీ నివ్వెర పాటుకు గురిచేసింది. అదేవిధంగా తెలంగాణలోని మహబూబ్ నగర్ లో.. కట్టుకున్న భర్తను భార్య.. తన ప్రియుడితో కలిసి అత్యంత పాశవికంగా హతమార్చింది. ఈ రెండు ఘటనలు.. ఈ వారంలో చోటు చేసుకున్న అతి పెద్ద ఘటనలుగా పోలీసుల రికార్డులకు ఎక్కాయి. ఈ రెండు కేసుల్లోనూ కామన్ ఫ్యాక్టర్.. 'సుఖ సంసారం' లేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు.
ఒంగోలు కేసులో రాధ, మోహన్రెడ్డిలు ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. బాగానే ఆర్జిస్తున్నవారే. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఉద్యోగాల హడావుడి, సంపాదన జోరులో పడి.. వారి కాపురం.. ఏదో యాదృచ్ ఛికంగా మారిపోయింది. ఫలితంగా.. చిన్నపాటి ఫోన్ చాటింగ్ పెద్ద అనుమానానికి దారితీసి.. ఏకంగా శత మానంభవతి అంటూ.. ఏడడుగులు వేసి మూడు ముడులతో బంధాన్ని అల్లుకున్న భార్యను దారుణంగా హతమార్చే పరిస్థితి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.
ఇక, మహబూబ్నగర్ ఘటనలో.. ఆ ఇల్లాలికి అప్పటికే ఐదుగురు సంతానం. భర్త వ్యాపారి. అయితే.. పిల్లల పోషణం.. వ్యాపకాలు కుటుంబంలో పడి ఆయన భార్యను 'నిర్లక్ష్యం' చేశాడు. అంతే.. పొరుగువాడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇది.. ప్రేమగా మారి..ఏకంగా ఐదుగురు పిల్లలను వదిలేసి ఉడాయించే శారు. అనంతర పరిణామాలతో భర్త నుంచి గండం ఉందని గుర్తించిన భార్య నమ్మకంగా తిరిగి వచ్చి.. మరునాడు ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించింది.
మొత్తంగా ఈ రెండు ఘటనల్లో ఒకటే పెద్ద ఎత్తున చర్చకు వచ్చినా.. రెండోది కూడా అంతే తీవ్రతతో కూడుకున్న ఘటన. అయితే. ఈ పరిణామాలను విశ్లేషిస్తే. భార్యా భర్తల మధ్య ఉండాల్సిన బంధంలో పస తగ్గుతోందని మానసిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ''భార్య భర్త పక్క పక్కన కూర్చుని మాట్లాడుకోవడం.. అభిప్రాయాలు పంచుకోవడం.. ఒకరిపై ఒకరు ప్రేమను పంచుకోవడం ఒక దశలో సంసారానికి అత్యంత కీలకం.
కేవలం శృంగారమే కాపురాలను డామినేట్ చేయదు. మనసు ముఖ్యం. నేడు సెల్ ఫోన్ల ప్రభావం, ఇంటర్నెట్ ప్రభావం.. కారణంగా.. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని లైట్గా తీసుకుంటున్నారు. ఫలితంగా బంధాల్లో బీటలు ఏర్పడి.. సంసారాలు కూల్చుకునే పరిస్థితి వస్తోంది.'' అని నిపుణులు చెబుతున్నారు.