Begin typing your search above and press return to search.
పుకార్లు నమ్మొద్దు.. స్కూళ్లు తెరవాలని నిపుణుల సూచన
By: Tupaki Desk | 16 Aug 2021 11:30 PM GMTథర్డ్ వేవ్ వస్తుందని.. అది పిల్లలపైనే ప్రభావం చూపుతుందన్న భయాలు ఇంకా వాడడం లేదు. అయితే ఇప్పటికైతే థర్డ్ వేవ్ ఏం రాలేదు. పిల్లలపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. రెండో దశలోనూ పిల్లల్లో కరోనా వేవ్ వచ్చిందని.. అయితే అది వారిపై పెద్దగా ప్రభావం చూపలేదని తేలింది.
తాజాగా ఏపీలో పాఠశాలలు తెరిచారు. స్కూళ్లు తెరవాలని వైద్య పరిశోధకులు కూడా చెబుతున్నారు. దేశ సామాజిక పరిస్థితులను ఎరిగిన వారు ఈ మాట చెబుతున్నారు. స్కూళ్లను తెరవకుండా ఇలా సంవత్సరాలకు సంవత్సరాలను గడిపేయడం వల్ల చాలా దుష్పరిణామాలు సంభవిస్తాయని వారు అంటున్నారు.
పిల్లలకు స్కూళ్లలో రోజూ గుడ్డు, పౌష్టికాహరం ఇస్తుంటారు. కరోనా వల్ల పాఠశాలలు బంద్ అయిపోయి ఇప్పుడు వారికి సరైన ఆహారం కూడా అందడం లేదు. కొందరు పాఠశాలలు లేక బాలకార్మికులుగా తయారవుతున్నారు. స్కూళ్లు లేక కొంతమంది ఆడపిల్లలను పెళ్లిళ్లు చేసి పంపిస్తున్నారు.
ఇక స్కూళ్లు లేకపోవడం పిల్లల్లో మానసికమైన ఎదుగుదలను సవ్యంగా సాగించడం లేదు. వారిలో చురుకుదనం లోపిస్తోంది. పిల్లలు కలవకపోవడం వల్ల వారి కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటున్నాయని చెబుతున్నారు.
మొత్తం గా కరోనా కారణంగా స్కూళ్లను తెరవకపోవడం వల్ల మరిన్ని సమస్యలకు అది కారణం అవుతోంది. పైకి పెద్దగా కనిపించకపోయినా సరే ఇది చాలా తీవ్రమైన సమస్యలకే కారణమవుతోందని చెబుతున్నారు. సుధీర్ఘకాలం పిల్లలను పాఠశాలలకు దూరంగా ఉంచవద్దని సూచిస్తున్నారు.
తాజాగా ఏపీలో పాఠశాలలు తెరిచారు. స్కూళ్లు తెరవాలని వైద్య పరిశోధకులు కూడా చెబుతున్నారు. దేశ సామాజిక పరిస్థితులను ఎరిగిన వారు ఈ మాట చెబుతున్నారు. స్కూళ్లను తెరవకుండా ఇలా సంవత్సరాలకు సంవత్సరాలను గడిపేయడం వల్ల చాలా దుష్పరిణామాలు సంభవిస్తాయని వారు అంటున్నారు.
పిల్లలకు స్కూళ్లలో రోజూ గుడ్డు, పౌష్టికాహరం ఇస్తుంటారు. కరోనా వల్ల పాఠశాలలు బంద్ అయిపోయి ఇప్పుడు వారికి సరైన ఆహారం కూడా అందడం లేదు. కొందరు పాఠశాలలు లేక బాలకార్మికులుగా తయారవుతున్నారు. స్కూళ్లు లేక కొంతమంది ఆడపిల్లలను పెళ్లిళ్లు చేసి పంపిస్తున్నారు.
ఇక స్కూళ్లు లేకపోవడం పిల్లల్లో మానసికమైన ఎదుగుదలను సవ్యంగా సాగించడం లేదు. వారిలో చురుకుదనం లోపిస్తోంది. పిల్లలు కలవకపోవడం వల్ల వారి కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటున్నాయని చెబుతున్నారు.
మొత్తం గా కరోనా కారణంగా స్కూళ్లను తెరవకపోవడం వల్ల మరిన్ని సమస్యలకు అది కారణం అవుతోంది. పైకి పెద్దగా కనిపించకపోయినా సరే ఇది చాలా తీవ్రమైన సమస్యలకే కారణమవుతోందని చెబుతున్నారు. సుధీర్ఘకాలం పిల్లలను పాఠశాలలకు దూరంగా ఉంచవద్దని సూచిస్తున్నారు.