Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : తెలంగాణ లో నైట్ కర్ఫ్యూ పొడగింపు !
By: Tupaki Desk | 30 April 2021 9:17 AM GMTదేశ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. సెకండ్ వేవ్తో మరోసారి భారీగా కేసులు పెరుగిపోతున్నాయి. దీంతో ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇక తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా అమల్లో ఉన్న కర్ఫ్యూని మరికొన్ని రోజులు పొడగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రంలో మొదట ఏప్రిల్ 30 వరకు కర్ఫ్యూ విధించారు. ఆ గడువు నేటి తో పూర్తి కాబోతుంది దీనితో మరోసారి నైట్ కర్ఫ్యూ పెంపు కి ప్రభుత్వం మొగ్గుచూపించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ కొత్త కేసులు వెల్లువలా వస్తుండడంతో నైట్ కర్ఫ్యూను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టకపోవడం, దేశవ్యాప్తంగా పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో కర్ఫ్యూని పొడగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. శుక్రవారం ఈ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మరో వారం పాటు కర్ఫ్యూని పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మే 1వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు కర్ఫ్యూని పొడగిస్తూ జీవో జారీ చేశారు. ఈ నైట్ కర్ఫ్యూ సందర్భంగా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అన్ని జిల్లాల పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 7,646 పాజిటివ్ కేసులు రాగా, 53 మంది మృత్యువాత పడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టకపోవడం, దేశవ్యాప్తంగా పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో కర్ఫ్యూని పొడగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. శుక్రవారం ఈ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మరో వారం పాటు కర్ఫ్యూని పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మే 1వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు కర్ఫ్యూని పొడగిస్తూ జీవో జారీ చేశారు. ఈ నైట్ కర్ఫ్యూ సందర్భంగా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అన్ని జిల్లాల పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 7,646 పాజిటివ్ కేసులు రాగా, 53 మంది మృత్యువాత పడ్డారు.