Begin typing your search above and press return to search.
నారావారిపల్లెలో తీవ్ర ఉత్కంఠ..: ఎందుకంటే..?
By: Tupaki Desk | 21 Feb 2021 7:26 AM GMTఏపీలో పంచాయతీ ఎన్నికలు టీడీపీకి పీకమీదికొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా అధిక గ్రామాల్లో అధికార వైసీపీ జెండా ఎగురుతోంది. ఇది ఊహించినదే. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉండి.. అంతకుముందు దాదాపు 13 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు ఈ ఎన్నికలు సవాల్ గా మారాయి. టీడీపీ అధికారంలో లేదు కాబట్టి కొన్ని చోట్ల సైకిల్ అపజయానికి బాబు కారణం కాకపోవచ్చని తెలుసు. కానీ మాజీ సీఎం సొంత ఊర్లో కూడా పసపు జెండాను కిందికి దించేందుకు ఫ్యాన్ పార్టీ విపరీతంగా ప్రయత్నిస్తోంది.
నాలుగోవిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లెలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కట్టారు. అయితే ఇక్కడి ప్రజలు తమ ఊరికి చెందిన వ్యక్తి చంద్రబాబను ఆదరిస్తారా..? లేక వైసీపీకి ఓటు వేస్తారా..? అన్న చర్చ ఇప్పడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె, శేషాపురం, బి.కొంగలవారిపల్లె గ్రామాలు కలిపి 1404 ఓట్లు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఆదివారం పోలింగ్ జరుగుతోంది. వైసీపీ ఎస్సీ మహిళకు అవకాశం ఇవ్వగా.. టీడీపీ ఓసీ మహిళను బరిలోకి దింపింది. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో చాలా గ్రామాలు కైవలం చేసుకున్న లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇక టీడీపీ కంచుకోటపై దృష్టి పెట్టారట. దీంతో నారావారిపల్లె ప్రజలు చంద్రబాబును ఆదరిస్తారా..? ఛీ కొడుతారా..? అనే టెన్షన్ నెలకొంది.
ఇదిలా ఉండగా చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఢీలా పడింది. ఈ నియోజకర్గంలోని 89 పంచాయతీలు ఉండగా మూడో దశ ఎన్నికల్లో వైసీపీ 75చోట్ల విజయం సాధించింది. టీడీపీ కేవలం 14 స్థానాలకే పరిమితమైంది. దీంతో చిత్తూరు జిల్లాలోని టీడీపీ నాయకులు నిరాశతోనే ఉన్నారు. తాజాగా నారావారిపల్లెపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి సాయంత్రం వరకు చంద్రబాబు సొంత ఊరి ప్రజలు ఏ తీర్పు ఇస్తారో చూడాలి.
నాలుగోవిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లెలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కట్టారు. అయితే ఇక్కడి ప్రజలు తమ ఊరికి చెందిన వ్యక్తి చంద్రబాబను ఆదరిస్తారా..? లేక వైసీపీకి ఓటు వేస్తారా..? అన్న చర్చ ఇప్పడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె, శేషాపురం, బి.కొంగలవారిపల్లె గ్రామాలు కలిపి 1404 ఓట్లు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఆదివారం పోలింగ్ జరుగుతోంది. వైసీపీ ఎస్సీ మహిళకు అవకాశం ఇవ్వగా.. టీడీపీ ఓసీ మహిళను బరిలోకి దింపింది. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో చాలా గ్రామాలు కైవలం చేసుకున్న లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇక టీడీపీ కంచుకోటపై దృష్టి పెట్టారట. దీంతో నారావారిపల్లె ప్రజలు చంద్రబాబును ఆదరిస్తారా..? ఛీ కొడుతారా..? అనే టెన్షన్ నెలకొంది.
ఇదిలా ఉండగా చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఢీలా పడింది. ఈ నియోజకర్గంలోని 89 పంచాయతీలు ఉండగా మూడో దశ ఎన్నికల్లో వైసీపీ 75చోట్ల విజయం సాధించింది. టీడీపీ కేవలం 14 స్థానాలకే పరిమితమైంది. దీంతో చిత్తూరు జిల్లాలోని టీడీపీ నాయకులు నిరాశతోనే ఉన్నారు. తాజాగా నారావారిపల్లెపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి సాయంత్రం వరకు చంద్రబాబు సొంత ఊరి ప్రజలు ఏ తీర్పు ఇస్తారో చూడాలి.