Begin typing your search above and press return to search.
ఫేస్బుక్, ట్విటర్ బ్యాన్.. సొంత ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్న ట్రంప్
By: Tupaki Desk | 5 May 2021 4:30 PM GMTఅమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను సోషల్ మీడియా దూరం పెట్టిన నేపథ్యంలో ట్రంప్ సొంతంగా ఓ కమ్యూనికేషన్స్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు. ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ డొనాల్డ్ జె. ట్రంప్ అని పేరు పెట్టారు. తన మద్దతుదారులతో సంప్రదింపులు నిర్వహించడానికి, వారి నుంచి సమాచారాన్ని సేకరించడానికి ఆయన సొంతంగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇది. మీడియా బులెటిన్లు, స్టేట్ మెంట్లతో పాటు వీడియో క్లిప్పింగులను కూడా పోస్ట్ చేసే సౌకర్యం కూడా ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా వరుసగా రెండోసారి బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
ఇక ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో ఆయన చేసిన పలు పోస్టింగులు, వీడియో క్లిప్పింగులు పలు వివాదాలకు దారితీశాయి. దీనితో సోషల్ మీడియా దిగ్గజాలు ట్విట్టర్, ఫేస్ బుక్ ట్రంప్ ఖాతాలని తొలగించాయి. వివాదాలకు కారణమైన డొనాల్డ్ ట్రంప్ పోస్టింగులను తొలగించాయి. ట్విట్టర్ మేనేజ్ మెంట్ డొనాల్డ్ ట్రంప్ ను ఏకంగా శాశ్వతంగా బ్యాన్ చేసింది. దీనితో ఆయన సోషల్ మీడియా కి గత కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ సోషల్ మీడియాలోకి అడుగు పెట్టడానికి సొంతంగా ఓ కమ్యూనికేషన్ల వ్యవస్థ, ప్లాట్ఫామ్ను సిద్ధం చేసుకున్నారు. ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ డొనాల్డ్ జె. ట్రంప్ పేరుతో తొలిదశలో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించారు. క్రమంగా దీన్ని మరింత విస్తరించనున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ తరహాలో మైక్రో బ్లాగింగ్ వ్యవస్థగా దీన్ని రూపుదిద్దనున్నారు. కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించే ఉద్దేశంతోనే దీన్ని అందుబాటులోకి తెచ్చారని తెలుస్తోంది. మంగళవారమే ఈ కొత్త ప్లాట్ఫామ్ లాంచైనా.. ఇందులో మార్చి నుంచే ట్రంప్ చేస్తున్న పోస్ట్లు ఉన్నాయి. ట్రంప్ను గత జనవరిలో ట్విటర్, ఫేస్బుక్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.
ఇక ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో ఆయన చేసిన పలు పోస్టింగులు, వీడియో క్లిప్పింగులు పలు వివాదాలకు దారితీశాయి. దీనితో సోషల్ మీడియా దిగ్గజాలు ట్విట్టర్, ఫేస్ బుక్ ట్రంప్ ఖాతాలని తొలగించాయి. వివాదాలకు కారణమైన డొనాల్డ్ ట్రంప్ పోస్టింగులను తొలగించాయి. ట్విట్టర్ మేనేజ్ మెంట్ డొనాల్డ్ ట్రంప్ ను ఏకంగా శాశ్వతంగా బ్యాన్ చేసింది. దీనితో ఆయన సోషల్ మీడియా కి గత కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ సోషల్ మీడియాలోకి అడుగు పెట్టడానికి సొంతంగా ఓ కమ్యూనికేషన్ల వ్యవస్థ, ప్లాట్ఫామ్ను సిద్ధం చేసుకున్నారు. ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ డొనాల్డ్ జె. ట్రంప్ పేరుతో తొలిదశలో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించారు. క్రమంగా దీన్ని మరింత విస్తరించనున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ తరహాలో మైక్రో బ్లాగింగ్ వ్యవస్థగా దీన్ని రూపుదిద్దనున్నారు. కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించే ఉద్దేశంతోనే దీన్ని అందుబాటులోకి తెచ్చారని తెలుస్తోంది. మంగళవారమే ఈ కొత్త ప్లాట్ఫామ్ లాంచైనా.. ఇందులో మార్చి నుంచే ట్రంప్ చేస్తున్న పోస్ట్లు ఉన్నాయి. ట్రంప్ను గత జనవరిలో ట్విటర్, ఫేస్బుక్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.