Begin typing your search above and press return to search.
మూడింటితో కానిది తాజా ఒప్పందంతో అవుతుందా?
By: Tupaki Desk | 9 March 2016 4:33 AM GMTకొన్ని విషయాల మీద మీడియా చాలా సానుకూలంగా స్పందిస్తుంది. కొన్ని విషయాల మీదనే కాదు.. కొందరి విషయంలో మీడియా తీరు అందుకు భిన్నంగా ఉంటుంది. వ్యక్తుల విషయంలోనే కాదు.. అంశాల విషయంలోనూ ఇచ్చే ప్రాధాన్యత చాలా చిత్రవిచిత్రంగా అనిపించక మానదు.తాజాగా తెలంగాణ.. మహారాష్ట్రల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చారిత్రకంగా.. గోదావరి బంధంగా ఎలా చాలానే విశేషణాలతో మీడియాలో విపరీతమైన ప్రచారాన్ని ఇచ్చారు.
ఈ ఒప్పందానికి సంబంధించి ఒక విషయం తెలిస్తే నోట మాట రాక మానదు. నిజానికి ఇప్పటికే మహారాష్ట్ర సర్కారుతో ఒప్పందాలు జరిగి ఉన్నాయి. వాటికే దిక్కు లేని పరిస్థితి. వాటి గురించి పెద్దగా మాట్లాడుకోని ప్రభుత్వాలు.. తాజాగా ఒప్పందం చేసుకోవటం గమనార్హం. తాజాగా కుదిరిన చారిత్రక ఒప్పందం నేపథ్యంలో.. గతంలో జరిగిన ఒప్పందాల మీద చర్చ తర్వాత.. ఒక వార్తాకథనమైనా ఎవరైనా ప్రచురించారా? అన్న సందేహం కలగక మానదు. నిజానికి ఈ డౌట్ చాలామందికి రాదు కూడా. ఆ మాటకు వస్తే.. గోదావరి మీద గతంలో జరిగిన ఒప్పందాలేమిటి? అవెంత వరకూ పూర్తి అయ్యాయి? ఇప్పుడు చేసుకున్న ఒప్పందం గత ఒప్పందాలకు ఎంత భిన్నం? లాంటి ప్రశ్నలు వరుసగా వేసుకుంటూ పోతే ఆసక్తికర సమాధానాలు లభించటం ఖాయం.
గతాన్ని వదిలేసి వర్తమానాన్ని పొగిడేయటం.. భవిష్యత్తును కీర్తించటం లాంటి పరిణామాల నేపథ్యంలో వాస్తవాన్ని చూసే పరిస్థితి.. చూపించే సీన్ ఎవరికి లేదన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని చెప్పక తప్పదు. తాజాగా జరిగిన చారిత్రక ఒప్పందాలకు ముందు గతంలోనూ ఈ రెండు (ఏపీ అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం) ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు జరిగాయి. జలగం వెంగళరావు సీఎంగా ఉన్నప్పుడు.. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందాలు జరిగిన విషయాన్ని మర్చిపోకూడదు. జలగం జమానా అంటే కాస్త దూరంగా చెప్పాలి. మరి.. కిరణ్ హయాంలో చేసుకున్న ఒప్పందం అమలు ఎలా సాగుతోందన్న విషయాన్ని అయినా ఎప్పుడైనా మదింపు వేశారా? అలాంటిదేమీ లేకుండానే చారిత్రకమని కీర్తించటం ఏమిటి? ఎవరి కోసం ఇదంతా.? అన్నదే పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం చెప్పే వారెవరు..?
ఈ ఒప్పందానికి సంబంధించి ఒక విషయం తెలిస్తే నోట మాట రాక మానదు. నిజానికి ఇప్పటికే మహారాష్ట్ర సర్కారుతో ఒప్పందాలు జరిగి ఉన్నాయి. వాటికే దిక్కు లేని పరిస్థితి. వాటి గురించి పెద్దగా మాట్లాడుకోని ప్రభుత్వాలు.. తాజాగా ఒప్పందం చేసుకోవటం గమనార్హం. తాజాగా కుదిరిన చారిత్రక ఒప్పందం నేపథ్యంలో.. గతంలో జరిగిన ఒప్పందాల మీద చర్చ తర్వాత.. ఒక వార్తాకథనమైనా ఎవరైనా ప్రచురించారా? అన్న సందేహం కలగక మానదు. నిజానికి ఈ డౌట్ చాలామందికి రాదు కూడా. ఆ మాటకు వస్తే.. గోదావరి మీద గతంలో జరిగిన ఒప్పందాలేమిటి? అవెంత వరకూ పూర్తి అయ్యాయి? ఇప్పుడు చేసుకున్న ఒప్పందం గత ఒప్పందాలకు ఎంత భిన్నం? లాంటి ప్రశ్నలు వరుసగా వేసుకుంటూ పోతే ఆసక్తికర సమాధానాలు లభించటం ఖాయం.
గతాన్ని వదిలేసి వర్తమానాన్ని పొగిడేయటం.. భవిష్యత్తును కీర్తించటం లాంటి పరిణామాల నేపథ్యంలో వాస్తవాన్ని చూసే పరిస్థితి.. చూపించే సీన్ ఎవరికి లేదన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని చెప్పక తప్పదు. తాజాగా జరిగిన చారిత్రక ఒప్పందాలకు ముందు గతంలోనూ ఈ రెండు (ఏపీ అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం) ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు జరిగాయి. జలగం వెంగళరావు సీఎంగా ఉన్నప్పుడు.. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందాలు జరిగిన విషయాన్ని మర్చిపోకూడదు. జలగం జమానా అంటే కాస్త దూరంగా చెప్పాలి. మరి.. కిరణ్ హయాంలో చేసుకున్న ఒప్పందం అమలు ఎలా సాగుతోందన్న విషయాన్ని అయినా ఎప్పుడైనా మదింపు వేశారా? అలాంటిదేమీ లేకుండానే చారిత్రకమని కీర్తించటం ఏమిటి? ఎవరి కోసం ఇదంతా.? అన్నదే పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం చెప్పే వారెవరు..?