Begin typing your search above and press return to search.
నగరంలో నకిలీ ఐపీఎస్ ల కలకలం.. నిరుద్యోగులే టార్గెట్.. నమ్మితే అంతే!
By: Tupaki Desk | 24 May 2023 2:28 PM GMTఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీతో పాటు ఎన్నో నేరాలు పెరుగుతున్నాయి. అక్రమాలకు పాల్పడేవారు కొత్త కొత్త మార్గాలను వెతుకుతున్నారు. అంతేగాకుండా అమాయకుల ఆశలనే వారి పెట్టుబడులుగా మార్చుకుంటున్నారు. చివరకు నిండా ముంచుతున్నారు. అయితే ఇలాంటి మోసాల్లో చదువుకున్నవారే ఎక్కువగా నష్టపోతుండడం గమనార్హం. ఉన్నత విద్య అభ్యసించిన వారు కూడా ఈ నకిలీల మాయలో పడుతున్నారంటేనే ఆ కేటుగాళ్ల మోసాలు ఏ తరహాలో ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. కాగా హైదరాబాద్ నగరంలో నకిలీ ఐపీఎస్ ల విషయం కలకలం రేపుతోంది. ఇద్దరు వ్యక్తులు తమకు తాము ఐపీఎస్ అధికారులమంటూ చెప్పుకుని సొమ్ము చేసుకుంటున్నారు. కాగా వీరి అసలు రూపాన్ని భాగ్యనగర పోలీసులు బయటపెట్టారు. హైదరాబాద్ లో ఇద్దరు నకిలీ ఐపీఎస్ లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్ కు చెందిన రామ్ నకిలీ ఐపీఎస్ అవతారమెత్తినట్లు పోలీసులు తెలిపారు. కేవలం తెలంగాణలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో పలు మోసాలకు పాల్పడ్డాడని వెల్లడించారు. ఐపీఎస్ అధికారినని నమ్మించి పలువురిని మోసం చేసినట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పదవుల పేరుతో సెటిల్ మెంట్లు చేశాడని పేర్కొన్నారు. తాను ఓ ప్రత్యేక పోలీసునని, తక్కువ ధరకే జాగ్వార్ కార్లను ఇప్పిస్తానని ఎంతోమందిని మోసం చేసినట్లు పోలీసులు వివరించారు.
అంతేగాకుండా సైబరాబాద్ లో ఓ కార్యాలయం ఏర్పాటు చేసి, తుపాకులు, పోలీసులు వాహనాలు, సైరన్ల వంటివి మెయింటెన్ చేస్తూ.. తాను నకిలీ ఐపీఎస్ అధికారి అనే అనుమానం రాకుండా పలు అక్రమాలకు ఒడిగట్టాడని పోలీసులు వెల్లడించారు. కాగా ఓ మహిళను ఝార్ఖండ్ కు తీసుకెళ్లి.. ఆమె నుంచి రూ.9 లక్షలు తీసుకొని ఆమెను వదిలేశాడని చెప్పారు. ఫలితంగా బాధితురాలు ఝార్ఖండ్ పోలీసులను ఆశ్రయించడంతో.. వారు హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వగా అసలు గుట్టు బయటకు వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
రామ్ పై ఇప్పటికే ఆరు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రామ్.. హిందీ బాగా నేర్చుకొని నకిలీ ఐపీఎస్ అధికారి అవతారమెత్తినట్లు పోలీసులు గుర్తించారు.
అంతేగాకుండా నకిలీ ఫొటోలు సృష్టించి తనకు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించి.. మోసం చేసేవాడని పేర్కొన్నారు. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ఈ నకిలీ ఐపీఎస్ వలలో చిక్కుకున్నారని.. ప్రస్తుతం అందుకు సంబంధించిన వివరాలను పోలీసులు రాబడతున్నారని తెలుస్తోంది.
ఆర్మీ కల్నల్ అని నమ్మించి పలు మోసాలకు తెరలేపిన మరో నకిలీ ఐపీఎస్ అధికారిని కూడా ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ భీమవరానికి చెందిన కార్తీక్ అలియాస్ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఆర్మీ కల్నల్, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అంటూ ఈ నకిలీ ఐపీఎస్ అధికారి పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సైబరాబాద్ లో కార్యాలయం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, సెటిల్ మెంట్లు, ప్రముఖులతో పరిచయాలు పేరుతో అమాయకుల నుంచి సొమ్ము చేసుకున్నాడని మాదాపూర్ ఇన్ ఛార్జ్ డీసీపీ శ్రీనివాస రావు వివరించారు. కార్తీక్ పై దేశవ్యాప్తంగా 8 కేసులు నమోదైనట్లు తెలిపారు. కార్తీక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్ కు చెందిన రామ్ నకిలీ ఐపీఎస్ అవతారమెత్తినట్లు పోలీసులు తెలిపారు. కేవలం తెలంగాణలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో పలు మోసాలకు పాల్పడ్డాడని వెల్లడించారు. ఐపీఎస్ అధికారినని నమ్మించి పలువురిని మోసం చేసినట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పదవుల పేరుతో సెటిల్ మెంట్లు చేశాడని పేర్కొన్నారు. తాను ఓ ప్రత్యేక పోలీసునని, తక్కువ ధరకే జాగ్వార్ కార్లను ఇప్పిస్తానని ఎంతోమందిని మోసం చేసినట్లు పోలీసులు వివరించారు.
అంతేగాకుండా సైబరాబాద్ లో ఓ కార్యాలయం ఏర్పాటు చేసి, తుపాకులు, పోలీసులు వాహనాలు, సైరన్ల వంటివి మెయింటెన్ చేస్తూ.. తాను నకిలీ ఐపీఎస్ అధికారి అనే అనుమానం రాకుండా పలు అక్రమాలకు ఒడిగట్టాడని పోలీసులు వెల్లడించారు. కాగా ఓ మహిళను ఝార్ఖండ్ కు తీసుకెళ్లి.. ఆమె నుంచి రూ.9 లక్షలు తీసుకొని ఆమెను వదిలేశాడని చెప్పారు. ఫలితంగా బాధితురాలు ఝార్ఖండ్ పోలీసులను ఆశ్రయించడంతో.. వారు హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వగా అసలు గుట్టు బయటకు వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
రామ్ పై ఇప్పటికే ఆరు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రామ్.. హిందీ బాగా నేర్చుకొని నకిలీ ఐపీఎస్ అధికారి అవతారమెత్తినట్లు పోలీసులు గుర్తించారు.
అంతేగాకుండా నకిలీ ఫొటోలు సృష్టించి తనకు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించి.. మోసం చేసేవాడని పేర్కొన్నారు. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ఈ నకిలీ ఐపీఎస్ వలలో చిక్కుకున్నారని.. ప్రస్తుతం అందుకు సంబంధించిన వివరాలను పోలీసులు రాబడతున్నారని తెలుస్తోంది.
ఆర్మీ కల్నల్ అని నమ్మించి పలు మోసాలకు తెరలేపిన మరో నకిలీ ఐపీఎస్ అధికారిని కూడా ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ భీమవరానికి చెందిన కార్తీక్ అలియాస్ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఆర్మీ కల్నల్, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అంటూ ఈ నకిలీ ఐపీఎస్ అధికారి పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సైబరాబాద్ లో కార్యాలయం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, సెటిల్ మెంట్లు, ప్రముఖులతో పరిచయాలు పేరుతో అమాయకుల నుంచి సొమ్ము చేసుకున్నాడని మాదాపూర్ ఇన్ ఛార్జ్ డీసీపీ శ్రీనివాస రావు వివరించారు. కార్తీక్ పై దేశవ్యాప్తంగా 8 కేసులు నమోదైనట్లు తెలిపారు. కార్తీక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.