Begin typing your search above and press return to search.
జగన్ పరువు తీస్తున్నారుగా...!
By: Tupaki Desk | 30 Oct 2019 1:30 AM GMTఅనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించడం సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే... దీనిపై సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ పడుతున్నాయి. రంగుల పిచ్చి పీక్స్ కి వెళ్లిందంటూ... కొందరు - ఇది నేరం అంటూ కొందరు విమర్శిస్తున్నారు. నిజమే ఇది తప్పే. స్థానిక నేతలు - వారి అనుచరుల అత్యుత్సాహం వల్ల ఇలాంటి ఇటీవల తరచూ జరుగుతున్నాయి. అయితే... వారు ఎంత చిల్లరతనంతో రంగులు వేశారో - విమర్శలు చేసేవారు కూడా అంతే చిల్లరగా దీనికి ముఖ్యమంత్రిని బాధ్యులను చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
రాజకీయ పరిజ్ఞానం ఏమాత్రం ఉన్నవారైనా అతి సులభంగా గ్రహించే అంశం....ఒక పార్టీని ఏర్పాటు చేసి - అనేక కష్టనష్టాలకు ఎదురీది - వ్యూహాలను చేధించి.. సీఎం అయిన వ్యక్తికి జాతీయ జెండా గురించి - దాన్ని గౌరవించే విధానం గురించి అవగాహన ఉండదా? ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. ఆ మాటకొస్తే...అవకాశం కలిసివచ్చి పదవులు దక్కిన వారికి కూడా...జాతీయ జెండా గురించి - రంగుల గురించి స్పష్టత ఉంటుంది. అలాంటిది ఒక సీఎం...`భారతదేశ జాతీయ జెండా రంగు ఉంటే సచివాలయం నిర్వహించడం కుదరదు దాన్ని మార్చేయండి` అని ఆదేశిస్తారా? చాన్సే లేదు!! అది సరే...`తమ్మడపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించడం సంగతేంటి?` అని అంటారా..ఖచ్చితంగా ఇది అత్యుత్సాహం. స్థానిక నేతల చిలిపి చేష్టలతో పార్టీ బ్లేమ్ అవుతోంది.
గ్రామాల్లో రాజకీయ చైతన్యం సహజంగానే ఎక్కువ. అధికార పార్టీ కార్యకర్తలు తమ ఉనికి కోసం అన్ని అవకాశాలను వాడుకుంటారు. ఆ తాపత్రయంలో వారు చేసే ఇలాంటి పనులు పార్టీ అధిష్టానానికి తలనెప్పులు తెస్తుంటాయి. మినిమమ్ కామన్ సెన్స్ ఉన్న వాళ్లెవరూ ఈ పనికి ఒడిగట్టరు. ప్రజలు తమ పార్టీని గుర్తించుకునేందుకు రంగులు మార్పిడి చేయాలనుకునే అత్యుత్సాహంలో వెనుక జాతీయ జెండా ఉందా? ఇంకేముంది? అని కూడా చూసే పరిస్థితి ఉండదు. రంగులు పూసేయడమే. స్థానిక నేతలు జాగ్రత్తగా ఉంటే... పార్టీకి ఇలాంటి తలనెప్పులు రావు. ఎంత సేపు పార్టీ, ప్రభుత్వం తమకు ఏమిస్తుంది అని కాకుండా పార్టీకి ఏం చేయాలని ఆలోచించేవారుంటే ఇలా జరగదు.
రాజకీయ పరిజ్ఞానం ఏమాత్రం ఉన్నవారైనా అతి సులభంగా గ్రహించే అంశం....ఒక పార్టీని ఏర్పాటు చేసి - అనేక కష్టనష్టాలకు ఎదురీది - వ్యూహాలను చేధించి.. సీఎం అయిన వ్యక్తికి జాతీయ జెండా గురించి - దాన్ని గౌరవించే విధానం గురించి అవగాహన ఉండదా? ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. ఆ మాటకొస్తే...అవకాశం కలిసివచ్చి పదవులు దక్కిన వారికి కూడా...జాతీయ జెండా గురించి - రంగుల గురించి స్పష్టత ఉంటుంది. అలాంటిది ఒక సీఎం...`భారతదేశ జాతీయ జెండా రంగు ఉంటే సచివాలయం నిర్వహించడం కుదరదు దాన్ని మార్చేయండి` అని ఆదేశిస్తారా? చాన్సే లేదు!! అది సరే...`తమ్మడపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించడం సంగతేంటి?` అని అంటారా..ఖచ్చితంగా ఇది అత్యుత్సాహం. స్థానిక నేతల చిలిపి చేష్టలతో పార్టీ బ్లేమ్ అవుతోంది.
గ్రామాల్లో రాజకీయ చైతన్యం సహజంగానే ఎక్కువ. అధికార పార్టీ కార్యకర్తలు తమ ఉనికి కోసం అన్ని అవకాశాలను వాడుకుంటారు. ఆ తాపత్రయంలో వారు చేసే ఇలాంటి పనులు పార్టీ అధిష్టానానికి తలనెప్పులు తెస్తుంటాయి. మినిమమ్ కామన్ సెన్స్ ఉన్న వాళ్లెవరూ ఈ పనికి ఒడిగట్టరు. ప్రజలు తమ పార్టీని గుర్తించుకునేందుకు రంగులు మార్పిడి చేయాలనుకునే అత్యుత్సాహంలో వెనుక జాతీయ జెండా ఉందా? ఇంకేముంది? అని కూడా చూసే పరిస్థితి ఉండదు. రంగులు పూసేయడమే. స్థానిక నేతలు జాగ్రత్తగా ఉంటే... పార్టీకి ఇలాంటి తలనెప్పులు రావు. ఎంత సేపు పార్టీ, ప్రభుత్వం తమకు ఏమిస్తుంది అని కాకుండా పార్టీకి ఏం చేయాలని ఆలోచించేవారుంటే ఇలా జరగదు.