Begin typing your search above and press return to search.
ఏపీ లో దొంగ ఓట్లు...వైసీపీ టీడీపీ డిష్యూం డిష్యూం
By: Tupaki Desk | 30 Jun 2023 9:00 AM GMTఏపీ లో సరికొత్త రాజకీయాని కి తెర లేచింది. ఏపీ లో మొత్తం ఓట్లలో లక్షలలో దొంగ ఓట్లు ఉన్నాయన్న దాని మీద అధికార వైసీపీ విపక్ష టీడీపీల మధ్య యుద్ధమే మొదలైంది. ఏపీ లో ఇరవై లక్షల దాకా దొంగ ఓట్లు ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు హాట్ కామెంట్స్ చేయడంతో ఈ వివాదం రాజుకుంది.
ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే దొంగ ఓట్లను లక్షల్లో చేరుస్తున్నారని చంద్రబాబు వైసీపీ మీద మండిపడ్డారు. వీటిని పార్టీ యంత్రాంగం ఆధారాల తో సహా గుర్తించారని కూడా ఆయన అంటున్నారు. ఏపీ లో పెద్ద ఎత్తున ఉన్న దొంగ ఓట్ల మీద స్పెషల్ డ్రైవ్ ని చేపట్టాలని కూడా ఆయన పార్టీ శ్రేణుల కు పిలుపు ఇచ్చారు.
అర్హులు అయిన వారి ఓట్లు, టీడీపీ సానుభూతి ఓట్లను తోల్గించి భోగస్ ఓట్లను చేరుస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఓటర్ల జాబితా అక్రమాల మీద తమ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం లో వైసీపీ ని వదిలి పెట్టమని అంటున్నారు.
మరో వైపు చూస్తే వైసీపీ కూడా అచ్చం ఇలాంటి ఆరోపణలే చేస్తోంది. వైసీపీ నేతల మాటల ప్రకారం చూస్తే ఏకంగా అరవై లక్షల ఓట్లు భోగస్ అని ప్రచారం జరుగుతోంది. ఏపీ లో చూసుకుంటే అయిదు కోట్లు దాటి జనాభా ఉంది. ఓటర్ల సంఖ్య చూస్తే నాలుగు కోట్లకు పైగా ఉన్నారు.
మరి ఇందులో అరవై లక్షలు అని వైసీపీ అన్నా లేక ఇరవై లక్షలు అని టీడీపీ అన్నా పెద్ద నంబర్ గానే చూడాలి. ఇక కుప్పం లో దొంగ ఓట్లు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దొంగ ఓట్లు టీడీపీ నేతలు వరసబెట్టి గెలుస్తున్న చోట ఉన్నాయని వైసీపీ పేర్కొంటోంది.
దొంగ ఓట్లతోనే టీడీపీ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో గెలిచింది అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక విశాఖ లో అనేక చోట్ల కూడా టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేరుస్తూ తమ ఓట్లు తీయించేస్తున్నారు అని కలెక్టర్ కి ఎన్నికల అధికారుల కు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉంటే దొంగ ఓట్లు లక్షలలో ఉంటే తొలగించడం అన్నది కత్తి మీద సామే. దొంగ ఓట్లు ఎవరివి అసలు భోగస్ ఓట్లు ఎలా చేరుస్తున్నారు. దానికి నిబంధనలు ప్రకారం కుదురుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఏ ఒక్క ఓటరుని అయినా లిస్ట్ నుంచి తొలగించాలంటే ముందుగా నోటీస్ ఇచ్చి వివరాల కోసం వాకబు చేస్తారు అని అంటున్నారు. అయితే అలాంటిది లేకుండా చాలా మంది పేర్లను తొలగిస్తున్నారు అని టీడీపీ ఆరోపిస్తోంది.
అదే సమయం లో పెద్ద ఎత్తున భోగస్ ఓట్లను కూడా చేరుస్తున్నారు అని టీడీపీ ఆరోపిస్తోంది. దీని మీద అధికారుల కు ప్రతీ చోటా వెల్లువలా ఫిర్యాదులు అంటున్నారు. అసలు దీని మీద పెద్ద ఉద్యమమే నిర్వహించాలని టీడీపీ అంటోంది. చంద్రబాబు జూలై నెలలో జిల్లాల టూర్లకు వెళ్తున్నారు.
దాంతో ఆయన తాను వెళ్ళిన ప్రతీ చోటా ఇదే అంశం మీద పార్టీ నేతల కు దిశా నిర్దేశం చేసి అర్హులైన ఓట్లు పోకుండా చూస్తూనే భోగస్ ఓట్లు లేకుండా చూస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే వైసీపీ సైతం దొంగ ఓట్లు అంటోంది కాబట్టి ఆ పార్టీ ఉద్యమాలు ఎలా ఉంటాయో చూడాల ని అంటున్నారు. మొత్తానికి దొంగ ఓట్లు భోగస్ ఓట్లు పేరుతో వైసీపీ టీడీపీ డిష్యూం డిష్యూం ఫైటింగ్ చేసుకుంటున్నాయి.
ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే దొంగ ఓట్లను లక్షల్లో చేరుస్తున్నారని చంద్రబాబు వైసీపీ మీద మండిపడ్డారు. వీటిని పార్టీ యంత్రాంగం ఆధారాల తో సహా గుర్తించారని కూడా ఆయన అంటున్నారు. ఏపీ లో పెద్ద ఎత్తున ఉన్న దొంగ ఓట్ల మీద స్పెషల్ డ్రైవ్ ని చేపట్టాలని కూడా ఆయన పార్టీ శ్రేణుల కు పిలుపు ఇచ్చారు.
అర్హులు అయిన వారి ఓట్లు, టీడీపీ సానుభూతి ఓట్లను తోల్గించి భోగస్ ఓట్లను చేరుస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఓటర్ల జాబితా అక్రమాల మీద తమ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం లో వైసీపీ ని వదిలి పెట్టమని అంటున్నారు.
మరో వైపు చూస్తే వైసీపీ కూడా అచ్చం ఇలాంటి ఆరోపణలే చేస్తోంది. వైసీపీ నేతల మాటల ప్రకారం చూస్తే ఏకంగా అరవై లక్షల ఓట్లు భోగస్ అని ప్రచారం జరుగుతోంది. ఏపీ లో చూసుకుంటే అయిదు కోట్లు దాటి జనాభా ఉంది. ఓటర్ల సంఖ్య చూస్తే నాలుగు కోట్లకు పైగా ఉన్నారు.
మరి ఇందులో అరవై లక్షలు అని వైసీపీ అన్నా లేక ఇరవై లక్షలు అని టీడీపీ అన్నా పెద్ద నంబర్ గానే చూడాలి. ఇక కుప్పం లో దొంగ ఓట్లు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దొంగ ఓట్లు టీడీపీ నేతలు వరసబెట్టి గెలుస్తున్న చోట ఉన్నాయని వైసీపీ పేర్కొంటోంది.
దొంగ ఓట్లతోనే టీడీపీ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో గెలిచింది అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక విశాఖ లో అనేక చోట్ల కూడా టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేరుస్తూ తమ ఓట్లు తీయించేస్తున్నారు అని కలెక్టర్ కి ఎన్నికల అధికారుల కు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉంటే దొంగ ఓట్లు లక్షలలో ఉంటే తొలగించడం అన్నది కత్తి మీద సామే. దొంగ ఓట్లు ఎవరివి అసలు భోగస్ ఓట్లు ఎలా చేరుస్తున్నారు. దానికి నిబంధనలు ప్రకారం కుదురుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఏ ఒక్క ఓటరుని అయినా లిస్ట్ నుంచి తొలగించాలంటే ముందుగా నోటీస్ ఇచ్చి వివరాల కోసం వాకబు చేస్తారు అని అంటున్నారు. అయితే అలాంటిది లేకుండా చాలా మంది పేర్లను తొలగిస్తున్నారు అని టీడీపీ ఆరోపిస్తోంది.
అదే సమయం లో పెద్ద ఎత్తున భోగస్ ఓట్లను కూడా చేరుస్తున్నారు అని టీడీపీ ఆరోపిస్తోంది. దీని మీద అధికారుల కు ప్రతీ చోటా వెల్లువలా ఫిర్యాదులు అంటున్నారు. అసలు దీని మీద పెద్ద ఉద్యమమే నిర్వహించాలని టీడీపీ అంటోంది. చంద్రబాబు జూలై నెలలో జిల్లాల టూర్లకు వెళ్తున్నారు.
దాంతో ఆయన తాను వెళ్ళిన ప్రతీ చోటా ఇదే అంశం మీద పార్టీ నేతల కు దిశా నిర్దేశం చేసి అర్హులైన ఓట్లు పోకుండా చూస్తూనే భోగస్ ఓట్లు లేకుండా చూస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే వైసీపీ సైతం దొంగ ఓట్లు అంటోంది కాబట్టి ఆ పార్టీ ఉద్యమాలు ఎలా ఉంటాయో చూడాల ని అంటున్నారు. మొత్తానికి దొంగ ఓట్లు భోగస్ ఓట్లు పేరుతో వైసీపీ టీడీపీ డిష్యూం డిష్యూం ఫైటింగ్ చేసుకుంటున్నాయి.