Begin typing your search above and press return to search.
కోహ్లీ మ్యాచ్ కోసం 8985 మైళ్లు జర్నీచేసిన అభిమాని
By: Tupaki Desk | 20 May 2023 9:31 AM GMTక్రికెట్ ను మతంలా భావించే దేశంలో.. అందులో స్టార్ ఆటగాళ్ల ను తమ దేవుళ్లుగా వారిని అభిమానించే వారు భావిస్తుంటారు. తమ ఆరాధ్యదైవాల కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటం తెలిసిందే. క్రికెటర్లకున్న అభిమానాన్ని అసరాగా చేసుకొని బీసీసీఐ వేలాది కోట్ల ను సంపాదిస్తోంది. తాజాగా హైదరాబాద్ లో ముగిసిన ఐపీఎల్ మ్యాచ్ దీనికో ఉదాహరణగా చెప్పాలి. ఈ ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ లో నిర్వహించే చివరి మ్యాచ్ గురువారం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ కోసం కోహ్లీ వస్తున్న నేపథ్యంలో.. సదరు మ్యాచ్ టికెట్ ధరల్ని భారీగా పెంచేస్తూ కొత్త కల్చర్ కు తెర తీసిన సంగతి తెలిసిందే. దీని పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా పట్టించుకున్నది లేదు. ఇప్పటి వరకు భారీ బడ్జెట్ సినిమా టికెట్ల ధరల్ని పెంచుతూ దర్శక నిర్మాతలు నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా జరిగిన కోహ్లీ మ్యాచ్ లో అతనికున్న ఇమేజ్ ఆధారంగా చేసుకొని.. సదరు మ్యాచ్ కు రెట్టింపు ధరలతో టికెట్ల ను అమ్మిన వైనం ఒక ఎత్తు అయితే.. కోహ్లీ ని..అతడి ఆటను నేరుగా చూడటం కోసం ఒక అభిమాని భారీ సాహసమే చేయటం ఆసక్తికరంగా మారింది.
సదరు అభిమాని కోహ్లీ ని నేరుగా చూడటం కోసం అమెరికాలోని కాలిఫోర్నియా లోని ఒర్లాండో నుంచి హైదరాబాద్ కు వచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది. గురువారం హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సస్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ను లైవ్ గా చూసేందుకు వీలుగా సదరు అభిమాని అంత దూరం నుంచి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకు చేరుకున్నారు. తాను చేసిన పని గురించి ఒక ప్లకార్డు ను ప్రదర్శించారు.
అందులో.. 'ఒర్లాండో టు హైదరాబాద్.. నీ (కోహ్లీ) ఆటను చూసేందుకు 8985 మైళ్ల దూరం ప్రయాణించి హైదరాబాద్ కు వచ్చా' అంటూ రాసుకున్నారు. ఈ ప్లకార్డును ప్రదర్శించగా.. అది టీవీల్లో టెలికాస్టు అయ్యింది. కోహ్లీ మీద అతగాడికి ఉన్న అభిమానం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. ఏమైనా.. స్వచ్ఛమైన అభిమానం ఎంతలా ఉంటుందన్న దానికి ఈ ఉదంతం క్లాసిక్ ఎగ్జాంఫుల్ గా అభివర్ణిస్తున్నారు.
ఈ మ్యాచ్ కోసం కోహ్లీ వస్తున్న నేపథ్యంలో.. సదరు మ్యాచ్ టికెట్ ధరల్ని భారీగా పెంచేస్తూ కొత్త కల్చర్ కు తెర తీసిన సంగతి తెలిసిందే. దీని పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా పట్టించుకున్నది లేదు. ఇప్పటి వరకు భారీ బడ్జెట్ సినిమా టికెట్ల ధరల్ని పెంచుతూ దర్శక నిర్మాతలు నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా జరిగిన కోహ్లీ మ్యాచ్ లో అతనికున్న ఇమేజ్ ఆధారంగా చేసుకొని.. సదరు మ్యాచ్ కు రెట్టింపు ధరలతో టికెట్ల ను అమ్మిన వైనం ఒక ఎత్తు అయితే.. కోహ్లీ ని..అతడి ఆటను నేరుగా చూడటం కోసం ఒక అభిమాని భారీ సాహసమే చేయటం ఆసక్తికరంగా మారింది.
సదరు అభిమాని కోహ్లీ ని నేరుగా చూడటం కోసం అమెరికాలోని కాలిఫోర్నియా లోని ఒర్లాండో నుంచి హైదరాబాద్ కు వచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది. గురువారం హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సస్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ను లైవ్ గా చూసేందుకు వీలుగా సదరు అభిమాని అంత దూరం నుంచి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకు చేరుకున్నారు. తాను చేసిన పని గురించి ఒక ప్లకార్డు ను ప్రదర్శించారు.
అందులో.. 'ఒర్లాండో టు హైదరాబాద్.. నీ (కోహ్లీ) ఆటను చూసేందుకు 8985 మైళ్ల దూరం ప్రయాణించి హైదరాబాద్ కు వచ్చా' అంటూ రాసుకున్నారు. ఈ ప్లకార్డును ప్రదర్శించగా.. అది టీవీల్లో టెలికాస్టు అయ్యింది. కోహ్లీ మీద అతగాడికి ఉన్న అభిమానం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. ఏమైనా.. స్వచ్ఛమైన అభిమానం ఎంతలా ఉంటుందన్న దానికి ఈ ఉదంతం క్లాసిక్ ఎగ్జాంఫుల్ గా అభివర్ణిస్తున్నారు.